స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. మెగా ఫ్యామిలీ నీడ నుంచి మెల్లిగా బయటపడి. తనకంటూ సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. డ్యాన్స్, ఫైట్స్ సహా అద్భుత నటనతోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇక పర్సనల్ లైఫ్లోనూ మంచి కొడుకుగా మంచి భర్తగా తండ్రిగా మంచి మార్కులే కొట్టేస్తున్నాడు.
అల్లు అర్జున్ భార్య స్నేహలతా రెడ్డి కూడా తక్కువేమీ కాదు. భర్తకు తగ్గ భార్యగా మేడ్ ఫర్ బన్నీ అనిపించుకుంది. మరి అలాంటి స్నేహ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగానే అందరికీ తప్పకుండా ఉంటుంది.
వాస్తవానికి బన్నీ, స్నేహలది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పొచ్చు. 2011లో వీరిద్దరూ ప్రేమపక్షుల్లా విహరించి. పెద్దల ఆమోదంతో ఒక్కటయ్యారు. అయితే మొదట్లో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. పెళ్లికి అల్లు ఫ్యామిలీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా. స్నేహ తండ్రి సిట్ ఇంజినీరింగ్ కాలేజ్ ఫౌండర్ కేసీ శేఖర్రెడ్డి అంగీకరించలేదు. దీంతో వారి వివాహానికి ఏడాది గ్యాప్ వచ్చింది. చివరికి మధ్యవర్తుల సహకారంతో ఇరు పక్షాలు పెళ్లికి అంగీకరించారు.
చిన్నప్పటి నుంచే స్నేహ ఎంతో చురుకైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీతో పాటు ఇంజినీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ని పూర్తి చేశారు. ఇండియా వచ్చిన తర్వాత తమ సిట్ కాలేజ్ విస్తరణకు కృషి చేసింది. కాలేజ్ అకడమిక్స్ అండ్ ప్లేసెమెంట్ సెక్షన్ డైరెక్టర్ గా తనదైన ముద్ర వేసింది. తన డైనమిజంతో… కాలేజ్ ఈవెంట్స్ లో ఆక్టివ్ రోల్ ప్లే చేసింది. యువతను జాగృతం చేయడానికి స్పెక్ట్రం అనే కాలేజీలకు సంబంధించిన మ్యాగజైన్కి చీఫ్ ఎడిటర్గా కూడా పని చేసింది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే అల్లు అర్జున్ 10వ తరగతి వరకు మాత్రమే చదివితే.. స్నేహ రెడ్డి మాత్రం బన్నీ కన్నా ఏడాకులు ఎక్కువే చదువుకుంది.
కుటుంబపరంగా అత్తామామల వద్ద స్నేహారెడ్డికి మంచి ఇంప్రెషనే ఉంది. తమ కోడలు బంగారమని వారు చెబుతారు. అంతేకాదు అయాన్, అర్హలకి తల్లిగా స్నేహా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. ఆడుతూ పాడుతూ.. జాలీగా.. చిలిపిగా కనిపించే అల్లు అర్జున్కు ఇలాంటి భార్య దొరకడం నిజంగా ఆ కుటుంబం చేసుకున్న అదృష్టంగా చెబుతారు.
మరోవైపు స్నేహారెడ్డి సెల్ఫ్ రెస్పెక్ట్ను ఎక్కువగా కోరుకుంటుంది. తండ్రితో సంక్రమించిన ఆస్తులు, బిజినెస్ను, భర్తతో వచ్చిన స్టార్ స్టేటస్ను కాదనుకుని తనకంటూ ప్రత్యేకంగా ఉండాలని భావించింది.
అందుకే జూబ్లీహిల్స్లో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించింది. తన అభిరుచి మేరకు పికాబో అనే ఓ ఆన్లైన్ ఫోటో స్టూడియోని కొనుగోలు చేసింది. బేబి ఫొటోగ్రఫి, మెటర్నిటి ఫొటోగ్రఫి చేస్తూ తన సత్తా చాటుతోంది. ఇవండీ అల్లు అర్జున ప్రియ సతీమణి స్నేహ రెడ్డి గురించిన ఆసక్తికరమైన విషయాలు.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.