Connect with us

Movie News

కొడుకు కోసం ఆ ప్రముఖ నటి రోడ్డు పక్కన దోసెలు వేసి అమ్ముకుంటుంది

Published

on

బట్టలు… నగలు… పర్‌ఫ్యూమ్స్… ఓ సినీతార, టీవీ సెలబ్రిటీ సొంత వ్యాపారం అనగానే గుర్తొచ్చేవి ఇవేనా..? కానీ ఒక్కసారి మనం నేషనల్ హైవే 66… కేరళ, తమిళనాడు మధ్యలో… నెయ్యతినకర దగ్గర… అక్కడ ఓ నటి… పేరు కవితా లక్ష్మి… మళయాళ సీరియల్ స్త్రీధనంలో ఫేమస్… ఆమె ఓ అసాధారణ వృత్తిలో కనిపిస్తుంటుంది… మూడు వారాలుగా ఇదే సీన్… సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా… హైవే పక్కన నిలబడి దోసెలు వేస్తూ కనిపిస్తుంది… ఆమ్లెట్లు, బీఫ్ కర్రీ కూడా…!

నిజమే… అబద్ధం కాదు… 43 సంవత్సరాల ఈ నటి ఏదో పాత్రలో నటించడం లేదు… ఆమె ఆ రోడ్డు పక్కన సెంటర్‌లో చెమటలు కక్కుతూ జీవిస్తుంటుంది… అయ్యో, అయ్యో, ఎందుకమ్మా ఇలా..? అనడిగాం అనుకొండి… ‘ఏం చేద్దాం సార్..? మా అబ్బాయి ఆకాష్ కృష్ణను బ్రిటన్‌లో ఓ కోర్సులో జాయిన్ చేశాను…

Advertisement

ఖర్చులకు నా సంపాదన సరిపోవడం లేదు అని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది… ‘‘బ్యాంకులేమో లోన్లు ఇవ్వవు… తాకట్టు పెట్టడానికో, గ్యారంటీ ఇవ్వడానికో నాకేమో భూముల్లేవ్, సరిపడా ఆస్తుల్లేవ్, ఓ చిట్టీ కడుతున్నా… వాడేమో ముందే ఇవ్వరా అంటే వీలుకాదుపో అంటున్నాడు…’’ అని వివరిస్తుంది ఆమె…

‘ప్చ్, ఒక ఇంటిపైనో, భూమిపైనో నేను పెట్టుబడి పెట్టకపోవడంపై ఇప్పుడు అసంతృప్తి ఫీలవుతున్నా… నా సంపాదనంతా పిల్లల చదువుకే ఖర్చు… సొంతిల్లు కన్నా అదే ముఖ్యం అనుకున్నాను…’ అంటున్నది ఆమె…… పదేళ్లుగా ఆమె అదే నెయ్యతినకర దగ్గర ఓ రెంటెండ్ ఇంట్లో ఉంటుంది..

ఆమెకు కొడుకే కాదు, ఉమా పార్వతి అనే ఓ కూతురు కూడా ఉంది… పదో తరగతి… కవిత 13 ఏండ్ల క్రితమే భర్త నుంచి విడిపోయింది… ఇలాంటి ఏ విషాదాల్లోనైనా భార్యల బాధితులుగా మిగులుతారు, బాధ్యతలు పైన పడతాయి అనేది తెలుసు కదా… ఆమె సంపాదన సరిపోవడం లేదు మరి… ఏం చేయాలి..? ‘‘అందుకే ఈ మార్గం ఎంచుకున్నా… నా వ‌ృత్తి, నా గౌరవం… తప్పేం ఉంది..? నా అవసరాలు ముఖ్యం కదా’’ అంటున్నదామె….

Advertisement

‘‘మేం ఇలా రోడ్డు పక్కన సెంటర్లలో బోలెడు సార్లు తినేవాళ్లం… ఫ్రెష్… గరం… కెమికల్స్ ఉండవ్, ప్రిజర్వేటివ్స్ ఉండవ్… పెట్టుబడి తక్కువ… నా పిల్లలకు ఏం చేసి పెట్టానో అవే ఇప్పుడు అందరికీ చేసి పెడుతున్నా… అంతే… నా బిడ్డ కూడా నాకు సాయం చేస్తుంది…’’ అంటున్న ఆమె నిజానికి టీవీలో పెద్ద స్టార్… స్త్రీధనంలో శాంత అనే నెగెటివ్ రోల్‌లో బాగా పాపులర్… సాల్ట్ అండ్ పెప్పర్; అయలుమ్ జానుమ్ తమ్మిల్, మమ్ముట్టి నటించిన తప్పన వంటి సినిమాల్లోనూ నటించింది…

ఇప్పుడు అయలాటే సుందరి అనే సీరియల్‌కు వర్క్ చేస్తున్నది… టీవీ నిర్మాతలకు ఆమె ముందే చెబుతున్నది… తన స్థితి ఏమిటో, తను సాయంత్రాలు ఎక్కడ ఏం పనిచేస్తున్నదో… అందుకే డే షూటింగులో మాత్రమే నటిస్తూ సాయంత్రాలు ఇలా అదనపు సంపాదన కోసం నానా ఇక్కట్లూ పడుతున్నది… త్వరగా సెట్ నుంచి వెళ్లడానికి, కాస్త ఆలస్యంగా ఉదయం హాజరు కావటానికి టీవీ సీరియల్ దర్శకులు కూడా వోకే అంటుంటారు…

‘‘ఏం చేస్తాం సార్..? మొదట్లో మా దోసె బండ కేవలం 20 దోసెలకే సరిపోయేలా ఉండేది… ఇప్పుడు దాన్ని 40 దోసెలు వేసేలా అప్‌గ్రేడ్ చేసుకున్నాం… మా అమ్మ చెప్పేది… మాడిన మొహంతో సర్వ్ చేయొద్దు, నవ్వు మొహంతో ఫుడ్ పెడితే కస్టమర్ సంతోషమే వేరు… అన్నం వడ్డిస్తుంటే అంత తెల్లగా నీ మొహంలో నవ్వు ఉండాలి అని….’’ అంటున్నది..

Advertisement

ఆమె… అన్నట్టు చెప్పలేదు కదూ… ఆమె తన కెరీర్‌ను ఇరవయ్యేళ్ల క్రితం స్టార్ట్ చేసింది… ‘‘నాకు లగ్జరీ లైఫ్ అవసరం లేదు… నా పిల్లలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలి… అప్పటివరకూ కష్టపడుతూనే ఉంటా’’ అంటున్నది ఈ తల్లి… సూపర్… కంగ్రాట్స్ తల్లీ…. మరో మాట… సరదాాగా మన తెలుగు టీవీల్లోని ప్రముఖ నటీమణుల్ని ఒక్కసారి ఊహించుకొండి… ఎంతమంది ఇలా రోడ్డు పక్కన దోసెలు వేస్తూ పిల్లల కోసం నాలుగు పైసలు సంపాదించుకోగలరు..? ఊరికే… సరదాగా…!!

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!