Connect with us

General News

అతను “మొబైల్ నెంబర్” ను “ఆధార్” కు లింక్ చేయగానే..అకౌంట్ లో ఉన్న రూ.1.30 లక్షలు పోయాయి..! ఎలాగో తెలుసా.?

Published

on

వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు మీ మొబైల్‌ నంబర్లను ఆధార్‌తో లింక్‌ చేసుకోండి. లేదంటే మీ మొబైల్‌ నంబర్‌ పనిచేయదు… ఇదీ.. ఇప్పుడు చాలా మంది మొబైల్‌ వినియోగదారులకు రోజూ వస్తున్న మెసేజ్‌. ఈ క్రమంలో పలువురు టెలికాం ఆపరేటర్లు ఈ విషయం పేరిట వినియోగదారులను రోజూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మెసేజ్‌ల వరకు అయితే ఓకే, కానీ మొబైల్‌ నంబర్‌ను ఆధార్‌కు లింక్‌ చేయండి.. అంటూ కాల్స్‌ కూడా చేసి వేధిస్తున్నారు. సరే.. వారు మారరు. కానీ నిజంగా.. ఇలా లింక్‌ చేస్తే ప్రయోజనం ఏంటి..? అనే మాట పక్కన పెడితే.. ఇప్పుడు మేం చెప్పబోయే సంఘటన గురించి వింటే మాత్రం మీ మొబైల్‌ నంబర్‌ను ఆధార్‌కు లింక్‌ చేయడానికి ఒక నిమిషం ఆలోచిస్తారు. అవును, మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే విషయం అలాంటిది మరి..! ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…


అతని పేరు శాశ్వత్‌. అతనికి ఓ రోజున మెసేజ్‌ వచ్చింది. అందులో ఏముందంటే… మీ మొబైల్‌ నంబర్‌ బ్లాక్‌ అయింది. దాన్ని కంటిన్యూ చేయాలంటే ఆధార్‌కు లింక్‌ చేసుకోవాలి. కనుక మీ సిమ్‌ ఫోన్‌ నంబర్‌, సీరియల్‌ నంబర్‌లను 121 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయండి.. అంటూ అచ్చం ఎయిర్‌టెల్‌ కస్టమర్‌ కేర్‌ నుంచి వచ్చినట్టుగానే మెసేజ్‌ వచ్చింది. దీంతో శాశ్వత్‌ ఇది నిజమే అని నమ్మి సదరు నంబర్లను మెసేజ్‌ చేశాడు. అంతే.. క్షణాల్లో అవతలి వారు శాశ్వత్‌ సిమ్‌ను క్లోనింగ్‌ చేశారు. అంటే… అతని సిమ్‌కు డూప్లికేట్‌ సిమ్‌ను తయారు చేశారన్నమాట. అనంతరం ఆ సిమ్‌తో అతని ఐసీఐసీఐ శాలరీ అకౌంట్‌లో ఉన్న రూ.1.30 లక్షలను దోచేశారు. ఆశ్చర్యం… ఇది ఎలా జరిగింది.. అనుకుంటున్నారు కదా… అయితే వివరిస్తాం చూడండి..!

ఈ మధ్య కాలంలో డిజిటల్‌ పేమెంట్‌ మెథడ్స్‌ ఎక్కువయ్యాయి తెలుసు కదా. అనేక రకాల వాలెట్లు యాప్ ల రూపంలో మనకు అందుబాటులో వచ్చాయి. అయితే వాటిల్లో ఐఎంపీఎస్‌, నెఫ్ట్‌ వంటి పేమెంట్స్‌ మెథడ్స్‌తోపాటు యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌) అనే కొత్త పేమెంట్‌ విధానం కూడా మనకు అందుబాటులో ఉంది. దీనికి కేవలం మొబైల్‌ నంబర్‌ ఉంటే చాలు. మన బ్యాంక్‌ వివరాలు ఏమీ ఎంటర్‌ చేయాల్సిన పని ఉండదు. మొబైల్‌ నంబర్‌ను యూపీఐకి అనుసంధానిస్తే యూపీఐ ఇంటర్‌ఫేస్‌ మన మొబైల్‌ నంబర్‌కు కనెక్ట్‌ అయి ఉన్న బ్యాంక్‌ అకౌంట్లను వెదుకుతుంది. ఏదో ఒకటి లింక్‌ అయి ఉంటుంది కనుక కచ్చితంగా అలా లింక్‌ అయిన బ్యాంక్‌ను చూపిస్తుంది. దీంతో బ్యాంక్‌ ఖాతా యూపీఐకి అనుసంధానం అవుతుంది. అలా అయ్యాక ఇక అంతే. బ్యాంక్‌ వివరాలతో సంబంధం లేకుండా నేరుగా యూపీఐ ద్వారా డబ్బును పంపుకోవచ్చు, రిసీవ్‌ చేసుకోవచ్చు. ఇదే నేరగాళ్లకు అవకాశంగా మారింది. ఈ క్రమంలోనే పైన చెప్పిన శాశ్వత్‌ నంబర్‌ కూడా నేరగాళ్ల చేతిలో పడింది. వారు కూడా యూపీఐ ద్వారానే అతని ఖాతాలో ఉన్న రూ.1.30 లక్షలను కాజేశారు.

Advertisement

అయితే శాశ్వత్‌ నిజం తెలుసుకునేసరికి ఆలస్యం అయింది. అయినప్పటికీ లేట్‌ చేయకుండా వెంటనే కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి విషయం చెప్పాడు. అనంతరం ఆ బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లాడు. అక్కడ కూడా కంప్లెయింట్‌ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఫలితం లేదు. పైగా శాశ్వత్‌ కంప్లెయింట్‌ ఇచ్చాక 18 గంటల తరువాత కూడా అతని బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు మాయమయ్యాయి. అతను ఫిక్స్‌ చేసుకున్న ఫిక్స్‌ డిపాజిట్లను కూడా నేరగాళ్లు కాజేశారు. కంప్లెయింట్‌ ఇచ్చాక కూడా ఇలా జరిగిందంటే ఇక ఆ బ్యాంక్‌ ఖాతాదారులకు ఎలాంటి సెక్యూరిటీ కల్పిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అసలు కంప్లెయింట్‌ ఇవ్వగానే ఆ బ్యాంక్‌ అకౌంట్‌ ఫ్రీజ్‌ అవ్వాలి. కానీ అలా కాలేదు. అంటే అందుకు బ్యాంకే బాధ్యత వహించాలి.

చూశారుగా… మీకు కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తే స్పందించకండి. మీ మొబైల్‌ నంబర్‌ను ఆధార్‌కు అనుసంధానం చేసుకోవాలంటే కచ్చితంగా స్టోర్‌కు వెళ్లాల్సిందే. అంతేకానీ అలా అనుసంధానం చేసుకునేందుకు సదరు కంపెనీలు ఆన్‌లైన్‌లో, మొబైల్‌ ద్వారా ఎలాంటి సదుపాయం కల్పించలేదు. ఇక మరో విషయం ఏమిటంటే… మీ సిమ్‌ కార్డు పోయినా వెంటనే దాన్ని బ్లాక్‌ చేయండి. ఎందుకంటే పైన చెప్పాం కదా. కేవలం మీ మొబైల్‌ నంబర్‌ ఉంటే చాలు, దాంతో బ్యాంకులో ఉన్న డబ్బులు కాజేస్తారు. కాబట్టి ఈ విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిందే..!

Advertisement
Continue Reading
Advertisement

Featured

Kumari Aunty: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ పై ఈమె ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ కాలం గడిపేది అయితే ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. ఇలా కుమారి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

కుమారి ఆంటీ బిజినెస్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఈమె వద్ద తక్కువ ధరకే ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కడుపునిండా తినవచ్చు అనే విధంగా రివ్యూలు కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్డు తినడం కోసం వచ్చేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించి ఈమె సెలబ్రిటీ హోదాని కూడా అందుకున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇలా రోజుకు ఇంతమంది కస్టమర్లు ఈమె ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ తింటూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమెకు నెలకు ఎంత మొత్తంలో ఆదాయం ఉంటుంది అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

Advertisement

లక్షల్లో ఆదాయం…

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన నెల సంపాదన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు అలాగే అక్కడ పనిచేసే వారికి ఇచ్చే ఖర్చులన్నీ పోను నెలకు లక్షన్నర వరకు మిగులుతుంది అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బాగుందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Breaking News

Breaking News : డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.

Published

on

డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

Advertisement
Continue Reading

Featured

Ayodhya: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. విమాన టికెట్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే?

Published

on

Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దాంతో అయోధ్యకు సంబంధించిన వార్తలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీర్థయాత్రకు సిద్ధమవుతున్నారు.

అయోధ్యకు భక్తులు పోటెత్తడంతో, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమాన, రైలు ప్రయాణ ఎంపికలు కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఇలా ఉంటే అయోధ్యకు విమానం ద్వారా వెళ్లాలి అనుకున్న వారికి ఒక చేదు వార్త ఎదురైంది. ఎందుకంటే ఈ అయోధ్యకు వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. జనవరి 19న ముంబై నుండి అయోధ్యకు వెళ్లే విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడం, ఇండిగో విమానం ప్రయాణానికి రూ. 20,700 కోట్ చేయడంతో అస్థిరమైన ధరలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, జనవరి 20కి సంబంధించిన ఛార్జీలు దాదాపు రూ.20,000గా ఉంటాయి.

బెంగుళూరు నుండి కూడా, విమాన ఛార్జీకి మినహాయింపు లేదు. ధరలు సుమారు రూ. 8,500కి చేరుకుంటాయి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాలను మించిపోయాయి. ఇది తీర్థయాత్ర ఖర్చులకు ఊహించని కోణాన్ని జోడిస్తుంది. అంతర్జాతీయ విమానాలతో పోల్చి చూస్తే ఈ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధరను పరిశీలిస్తే ఎయిర్ ఇండియా రూ. 10,987 కోట్ చేస్తున్నట్టు చూపుతుండగా, అదే తేదీన నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.13,800. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన పర్యాటకుల ప్రవాహం విమాన ఛార్జీలపై కాదనలేని విధంగా ప్రభావం చూపింది.

చార్జీల పెంపు…

Advertisement

ఈ విధంగా విమానంలో అయోధ్యకు చేరుకోవాలి అనుకున్న వారికి చార్జీల పెంపు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. లక్షలాది మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు, పెరుగుతున్న విమాన ఛార్జీలు ఊహించని అడ్డంకిగా నిలుస్తాయి, ఆర్థికపరమైన చిక్కులకు వ్యతిరేకంగా వ్యక్తులు తమ తీర్థయాత్ర ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ప్రేరేపిస్తాయి. మరి ఈ విషయాలపై అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!