Connect with us

Featured

అలా వైకుంఠపురములో రివ్యూ

Published

on

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు ఈ రేంజ్ అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషలో వచ్చిన “జులాయి”, “సన్ అఫ్ సత్యమూర్తి” చిత్రాలు ఇచ్చిన హిట్ తాలూకా ప్రభావం ముచ్చటగా మూడోసారి వచ్చిన “ఆలా వైకుంఠపురములో” పై భారీగానే ఉంది. దీనికి తోడు నాలుగు నెలల నుండి ఈ సినిమా పాటలు ఎన్ని రికార్డులు సృష్టించాయో మనము చూస్తునే ఉన్నాము. సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసాయి.

Advertisement

ప్రచారం లో కొత్తపుంతలు తొక్కుతూ మూడు నెలల ముందు నుంచి ప్రేక్షకులను ఆకట్టుకునేలా పబ్లిసిటీ చేయడంతో సినిమాకు భారీగా హైప్ పెరిగింది. ఒక సినిమా హైప్ ఆకాశాన్ని తాకుతుంది అంటే ఆ ప్రభావం రెండవ సినిమా మీద పడుతుంది. సినిమాలో కంటెంట్ బాగుండి, ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఆ సినిమా ఎక్కడికో వెళ్తుంది. బాక్స్ ఆఫీస్ లెక్కలను తిరగరాస్తుంది. పొరపాటున సినిమా అంచానాలు అందుకోలేకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా చతికిల పడిపోతుంది. ఈ విషయం మన అందరికి తెలిసిందే.. దీనికి ఉదాహారణ లు ఉన్నాయి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన “అజ్ఞాతవాసి” నే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

బంటు (అల్లు అర్జున్ ) అంటే మొదటినుండి తన తండి వాల్మీకి (మురళి శర్మ) కి పడదు. తనకి కావాల్సింది ఇవ్వకపోవడం, సరిగా చూసుకోకపోవడం చేస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఇదే ఫ్రస్ట్రేషన్ లో పెరిగిన బంటు తన బాస్ (పూజ హెగ్డే) ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఇదిలా ఉండగా రామ చంద్ర (జైరాం) తన కొడుకు సుశాంత్ కు పూజ హెగ్డే ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. రామ చంద్ర బిజినెస్ పై కన్నేసిన విలన్ (సముద్రఖని) అతనిపై దాడి చేయిస్తాడు. అయితే అది ఇటు తిరిగి, బంటుకి తన జీవితంలో జరిగిన అతి పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. దాంతో జైరాం అండ్ ఫామిలీ ఉంటున్న వైకుంఠపురం (వాళ్ళ ఇల్లు) వెళతాడు బంటు.

అక్కడ ఎదురైనా పరిస్థితులు, అసలు బంటుకి తెలిసిన నిజమేమిటి? ఎందుకని వాళ్ళ నాన్న బంటుని ద్వేషిస్తాడు? చివరికి తన బాస్ తో ప్రేమాయణం ఏమైంది ? ఇలాంటి ప్రశ్నలు అన్నిటికి సమాదానాలు కావాలి అంటే సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే…

Advertisement

అల్లు అర్జున్ ది కెరీర్ లో అన్ని ఎమోషన్స్ కలగలిసిన పాత్ర, కామెడీ పరంగా, ఎమోషన్స్ పరంగా బన్నీ బాగానే మెప్పించాడనే చెప్పాలి. ఫైట్స్ అండ్ డ్యాన్సుల్లో కూడా చాల స్టైలిష్ గా కనిపించడు. పూజ హెగ్డే కు నామ మాత్రపు పాత్రే దక్కిందని చెప్పుకోవాలి. అల్లు అర్జున్ ను లవ్ చేయడం తప్ప ఆమె చేసింది ఏమి లేదు. సుశాంత్ కు కూడా పెర్ఫార్మెన్స్ కు పెద్దగా స్కోప్ ఏమి లేదు. నివేత పేతురేజ్, టబు కధలో భాగమైన కూడా వాళ్లకు లిమిటెడ్ పాత్రలే దక్కాయి. అయితే మురళీశర్మ మాత్రం ఒక విభిన్నమైన పాత్రలో మెప్పించాడు. మలయాళ నటుడు జైరాం కూడా బాగానే మెప్పించాడు. సెకండ్ హాఫ్ లోని ఎమోషనల్ సీన్స్ లో అతని హావభావాలు బాగుంటాయి. సచిన్ ఖేద్కర్ కు మంచి పాత్ర దక్కింది. అందులో అతని నటన బాగుంది. సునీల్, హర్షవర్ధన్ పెద్దగా చేసిందేం లేదు. మిగతావాళ్ళు మామూలే..

సాంకేతికంగా ఆలా వైకుంఠపురములో చాలా ఉన్నతంగా తెరకెక్కింది. సినిమాటోగ్రఫీ ఒక లెవల్ లో ఉంది. విజువల్స్ చాల బాగున్నాయి. సమజవరాగమనా పాటలో పారిస్ అందాలను, బుట్ట బొమ్మ చిత్రంలో అందమైన సెట్ ను చూపించిన విధానం చాల బాగుంది. ఇక పాటలు గురించి చెప్పాల్సిన పనిలేదు, తమన్ బెస్ట్ వర్క్స్ లో ఇది టాప్ ప్లేస్ లో ఉన్న చిత్రం. బ్యాక్ గ్రౌండ్ మ్యుజిగ్ పరంగా కూడా మెప్పించాడు. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది, సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. కథ పరంగా త్రివిక్రమ్ మరోసారి ఓల్డ్ పాయింట్ నే ఎంచుకున్నాడు. అయితే తన మార్క్ డైలాగ్స్ తో దాన్ని కొంచెం కవర్ చేయగలిగాడనే చెప్పాలి. ఎందుకో ఒకప్పుడు త్రివిక్రమ్ చేసిన మ్యాజిక్ ఇప్పుడు చేయలేకపోతున్నాడని అనిపిస్తుంది. నేరేషన్ పరంగా త్రివిక్రమ్ రొటీన్ అవుతున్నాడేమో అనిపిస్తుంది.

” ఎవరినైనా ఒక స్థానంలో కుర్చోపెట్టగలం కానీ వారికి స్థాయిని మనం తీసుకురాలేం. అది ఎవరికి వారు సంపాదించుకోవాలి.” ఇదే పాయింట్ ను తనకు అలవాటు అయిన రీతిలో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే తర్వాత ఎం జరుగుందో ప్రేక్షకులకు ముందే తెలిసిపోతుంది. కూల్ గా సాగిపోయే కధనం, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ ప్లస్ కాగా, పెద్దగా విలనిజం లేకపోవడం, రొటీన్ అనిపించే కొన్ని సీన్స్, కొంచెం బోర్ అనిపిస్తుంది. ఏది ఏమయినా కానీ “ఆలా వైకుంఠపురములో” ఈ సంక్రాంతి ఫ్యామిలీ అంతా కలిసి అలా వెళ్లి చూడదగ్గ చిత్రం.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Magadheera: చరణ్ అభిమానులకు శుభవార్త.. థియేటర్లో రిలీజ్ కాబోతున్న.. ఎప్పుడో తెలుసా?

Published

on

Magadheera: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే తెలుగు థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ,రామ్ చరణ్,ఎన్టీఆర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అన్న వివరాల్లోకి వెళితే.. మగధీర సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్‌ బర్త్‌డే సందర్భంగా మగధీర చిత్రాన్ని 26న రీ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన మగధీర 2009 జూలై 30న విడుదలై, బ్లాక్‌ బస్టర్‌ హిట్ గా నిలిచింది.

రీ రిలీజ్‌..

Advertisement

దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్‌ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌బాబు రీ రిలీజ్‌ చేస్తున్నారు. మగధీర చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్‌ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి అని తెలిపారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌ బాబు.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: బోయపాటి డైరెక్షన్లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ఫిక్స్ చేసిన బాలయ్య?

Published

on

Mokshagna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఈయనకు వయస్సు మీద పడుతున్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక బాలయ్య వారసుడి రాక కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Mokshagna

మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి అభిమానులను ఊరిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు కానీ గత ఏడాది బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాది తన కుమారుడు సినీ ఎంట్రీ ఉంటుందని తెలిపారు.. ఇకపోతే మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం అవుతారన్న సందేహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకసారి అనిల్ రావిపూడి పేరు వినిపించగా మరోసారి బోయపాటి పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఇప్పటికే వీరిద్దరూ స్క్రిప్ట్ గురించి కూడా డిస్కషన్స్ పూర్తి చేశారని ఇక త్వరలోనే ఈ సినిమా పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య తన కొడుకు ఎంట్రీ బోయపాటి పైనే భారం వేసారని తెలుస్తోంది ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

బోయపాటి పైనే భారం..
ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా మరొక వార్త వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి టైం ఫిక్స్ చేశారని ఇక ఈయన బోయపాటి డైరెక్షన్ లోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. మాస్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ తన కుమారుడి మొదటి సినిమా కూడా ఇలాంటి యాక్షన్ టచ్ ఇస్తేనే బాగుంటుందని భావించినటువంటి బాలయ్య బోయపాటిని ఫిక్స్ చేశారట.

Advertisement
Continue Reading

Featured

Venkata Chaitanya: ప్రతి ఒక్కటి తిరిగి ఇచ్చేయాల్సిందే.. వైరల్ అవుతున్న నిహారిక మాజీ భర్త పోస్ట్!

Published

on

Venkata Chaitanya: జొన్నలగడ్డ వెంకట చైతన్య పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ నిహారిక మాజీ భర్తగా ఈయన ఎంత గుర్తింపు పొందారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె తన పెళ్లి విడాకులు అలాగే రెండో పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇందుకు కౌంటర్ గా తన మాజీ భర్త సైలెన్స్ సైలెన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన పరోక్షంగా నిహారికను ఉద్దేశిస్తూ తనకు కౌంటర్ ఇస్తూనే ఇలాంటి పోస్టులు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయినటువంటి చైతన్య తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

పాజిటివిటీని పెంచాలి..
చాలా రోజుల తర్వాత ఇలా మళ్లీ రాసుకు వస్తున్నాను. ఇంస్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయిన తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంచమైనా పాజిటివిటీని పెంచాలని అనుకుంటున్నాను అంటూ ఈయన పోస్ట్ చేయడంతో ఇది చూసినటువంటి నేటిజన్స్ కచ్చితంగా ఇది నిహారికను ఉద్దేశించి చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు విడిపోయిన సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ఇలా పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!