హీరో శ్రీకాంత్.. తెలుసు కదా. ఫ్యామిలీ హీరో. దశాబ్దాల నుంచి ఫ్యామిలీ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెలామణి అవుతున్నారు శ్రీకాంత్. శ్రీకాంత్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు ఎన్నో. అప్పట్లో శ్రీకాంత్ సినిమాలు అంటేనే ఓ రేంజ్ ఉండేది. ఒక పెళ్లి సందడి సినిమాను తీసుకుంటే.. ఆ సినిమా ఎంత సూపర్ సక్సెస్ అయిందో అందరికీ తెలుసు.
ఆ తర్వాత శ్రీకాంత్ వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే.. శ్రీకాంత్ కు వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి. దీంతో ఆయన చాలా డిప్రెషన్ కు గురయ్యారట. ఒకే సంవత్సరంలో తీసిన ఏడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇక సినిమా ఇండస్ట్రీలో ఉండలేం. పెట్టె సర్దుకొని ఊరెళ్లి పోయి వ్యవసాయం చేసుకొని బతుకుదామని అనుకున్నా.. అంటూ తన మనసులోని మాటను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శ్రీకాంత్.
చిరంజీవి అన్నయ్య ఓదార్చడంతో డిప్రెషన్ తగ్గింది
నేను చాలా డిప్రెషన్ లో ఉన్న సమయంలో.. ఇండస్ట్రీలో కూడా ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడలేదు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. తనను కలవాలంటూ కబురు పంపారు. అప్పుడు బ్రహ్మానందం, చిరంజీవి అందరూ అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నారు. అప్పుడు వెళ్లాను. ఆయన్ను కలిశాను. ఏమైంది శ్రీకాంత్. ఎందుకు అంత డల్ గా ఉన్నావు.. అని అడిగారు. దానికి సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయని చెప్పాను. ఆరోజు ఆయన నాకు చెప్పిన విషయాలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆయన చాలా మోటివేట్ చేసి.. ఎంతో సపోర్ట్ గా మాట్లాడారు. అందుకే.. డిప్రెషన్ నుంచి బయట పడి.. మళ్లీ సెకండ్ కెరీర్ ను ప్రారంభించి.. ఇప్పుడు ఇండస్ట్రీలో నాకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నా.. అంటూ చెప్పుకొచ్చారు శ్రీకాంత్.
Advertisement
ఊహకు ముందు నేను ప్రపోజ్ చేశా
శ్రీకాంత్ ది ప్రేమ వివాహం అని అందరికీ తెలిసిందే. హీరోయిన్ ఊహనే ఆయన పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందట. ఊహను ముందు తనే ప్రేమించారట. ఆ తర్వాత తనను ప్రపోజ్ చేయడంతో పాటు.. ఓరోజు తన ఇంటికి వెళ్లి.. డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటా అని చెప్పేశాను. అలా.. నా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. అని చెప్పారు శ్రీకాంత్.
నాకు ఇండస్ట్రీలో ఎవ్వరూ తెలియదు.. సోలోగా వచ్చా
నిజానికి శ్రీకాంత్ కు సినీ ఇండస్ట్రీలో ఎవ్వరూ తెలియదు. ఆయన సోలోగా వచ్చారు. శ్రీకాంత్ కు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్, సినిమాలు అంటే పిచ్చి ఇష్టమట. చిన్నప్పటి నుంచే చిరంజీవి అంటే శ్రీకాంత్ కు ఇష్టమట. డిగ్రీ అయిపోయాక.. హీరో కావాలన్న కోరికతో.. ఎవరికీ చెప్పకుండా మద్రాస్ వెళ్లిపోయారట శ్రీకాంత్. రెండు రోజులు మద్రాస్ లో తిరిగేసి.. మళ్లీ ఇంటికి వెళ్లిపోయారట శ్రీకాంత్. మళ్లీ కొన్ని రోజులు చదువుకొని.. ఆ తర్వాత సినిమాల్లో మళ్లీ ట్రై చేశారట. తెలిసిన వాళ్ల ద్వారా ఓ ఫిలిం ఇన్ స్టిట్యూట్ కు వెళ్లి అక్కడ యాక్టింగ్ నేర్చుకున్నాక పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమాకు సెలెక్ట్ అయ్యారట శ్రీకాంత్. పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమాకు చాన్స్ రావడంతో ఇక అప్పటి నుంచి శ్రీకాంత్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదట.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.