కిడ్నీలో రాళ్ళూ సహజ పద్ధతిలో ఎలా పోగొట్టాలో తేలుకుందాం. ముందుగా అసలు కిడ్నీలోకి రాళ్ళూ ఎలా ఏర్పడతాయి. అనేవి తెలుసుకుంటే.. మనం రోజు తినే ఆహారంలో ఇదొక వేస్ట్ అంటే చిన్న చిన్న వెంట్రుకలు, కంటికి, పంటికి అనని ఇసుక లాంటి పదార్ధాలు మనకు తెలియకుండానే మన నోటి ద్వారా పంపిస్తూ ఉంటాం. అలా వెళ్లిన వెంట్రుకలు కడుపులో పేరుకుపోతాయి . అయితే ఒక వెంట్రుక ఏం చేస్తుంది అనే కదా. అలా మనకు తెలియకుండా మన శరీరంలోకి వెళ్లిన అనేక వెంట్రుకలు ఒక చోట చేరి ఒక చిన్నపాటి రాయిలా ఏర్పడుతుంది. వీటినే మనం కిడ్నీలో ఉండే రాళ్ళూ అంటాం. ఇదే మీకు సైన్స్ పరంగా చెప్పాలి అంటే ప్రతిరోజు మూత్రపిండాలు నీరు, రక్తం కలిపి కనీసం 600 నుంచి 700 లీటర్ల ద్రవాలను వడపోస్తూ ఉంటాయి.
ఈ క్రమంలో వ్యర్ధపదార్ధాలన్నీ విసర్జింపబడతాయి. మధుమేహం ఉన్నవారిలో ఈ పరిమాణం మరింత ఎక్కువగా ఉంటుంది. రక్తంలో కాల్షియం, పాస్ఫేట్లు, ఆక్సలేట్లు, మెగ్నీషియం, యూరియా ప్రధానంగా ఉంటాయి. ఒకవేళ అవసరానికి మించి ఇవి ఉంటే.. ఇవే అతిచిన్న స్పటికాలుగా మారతాయి. కొన్నిసార్లు ఒకే ఒక స్పటిక కూడా రాయిగా మారవచ్చు లేదా కొన్ని కలసి రాయిగా మారతాయి. కొంతమందిలో విటమిన్ A, D లు ఎక్కువగా ఉన్నా విటమిన్ B కాంప్లెక్స్ తక్కువగా ఉన్నా రాళ్ళూ ఏర్పడడానికి ఎక్కువ అవకాశం ఉంది.రాళ్ళూ ఏర్పడడానికి ఒక యూరిక్ యాసిడ్ ఒక బలమైన కారణంగా కూడా చెప్పొచ్చు. అందుకే మాంసాహారుల్లో రాళ్ళూ ఎక్కువగా ఏర్పడతాయి.
Advertisement
థైరాయిడ్ సమస్య కారణంగా ఎక్కువగా వేసుకునే మందులు, గ్యాస్టిక్ సమస్యల కారణంగా తీసుకునే జలసిస్ లాంటి ద్రవాలు కూడా రాళ్ళూ తయారవడానికి కారణం అవుతాయి. ఈ ద్రవాలలో కాల్షియం ఉండడం వలన రాళ్ళూ ఏర్పడుతుంటాయి. దాదాపు పది శాతం రాళ్లు దీర్ఘకాలిక సమస్యల కారణంగా సంవత్సరాల తరబడి తీసుకునే మందులవల్లే ఏర్పడతాయి. రోజు మద్యపానం చేసే వారిలో కూడా ఈ సమస్యలు కనబడుతుంటాయి. వీటన్నింటికి మించి అవసరమైన నీళ్లు తాగకపోవడం వల్ల రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఆహారంలో రసాలు, పులుసులు ఇవేమి లేకుండా పూర్తిగా ఘనాహారమే తీసుకుంటే వారిలో కూడా ఈ కిడ్నీ రాళ్ల సమస్యలు గురవుతుంటారు..
కిడ్నీలో ఉండే రాళ్లను తీసేయడం ఎలా? కిడ్నీలో రాళ్లను కరిగించుకోడం సాధ్యం కానీ.. మీకు ఒక విషయం తెలియాలి. అదేంటంటే రాళ్లు 5 మి.మీ కంటే తక్కువ ఉంటే తప్ప వాటిని కరిగించలేము. 5 నుంచి 7 మి.మీ ఉన్నవాటికి ఆపరేషన్ చేసి తియ్యాలి. ఇక కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు నొప్పి వస్తుంది. ఇది చాలా మందికి అనుభవం ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. లేకపోతే పెద్ద ప్రమాదమే ఉంటుంది. ఇక కిడ్నీలో రాళ్ళూ కరిగించాలకుంటే మన ఇంట్లోనే చాలా సహజ మార్గాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.
అందరూ చెప్పేది ఒకటే ఎక్కువగా నీరు త్రాగాలి. మనకు తెలుసు కిడ్నీలో రాళ్ళూ ఎందుకు వస్తాయో. శరీరానికి సరిపడా నీరు తీసుకోకపోతే కిడ్నీలో రాళ్ళూ ఏర్పడతాయి. మీకు గాని రాళ్ళూ ఉన్నాయని తెలిసిన వెంటనే ఎక్కువగా నీరు, ద్రవ పదార్ధాలు తీసుకోవాలి. రోజుకు కనీసం 5 నుంచి 6 లీటర్ల నీరు తప్పనిసరి. కిడ్నీలో రాళ్ళూ కరిగించడానికి ఇది చక్కని చిట్కా. మరొకటి మెంతులు నీటిలో నానబెట్టి తీసుకోవడం. ఒక స్పూన్ మెంతులు తీసుకుని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్నే లేవగానే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ఈ విధంగా చేస్తే కిడ్నీలో రాళ్లు పోతాయి. అంతేకాకుండా శరీరంలోని విష పదార్ధాలను కూడా ఈ ద్రవం బయటకు పంపిస్తుంది. అరటిచెట్టు బెరడు. ఇది నిజానికి ఒక కూరలాగా వండుతారు. అరటిచెట్టు కాండంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని కనుక తీసుకుంటే మూత్రద్వారం గుండా రాళ్లను బయటకు పంపిస్తుందనే నమ్మకం గట్టిగ ఉంది.
Advertisement
మరొకటి కొత్తిమీర ఆకులు. సాధారణంగా కొత్తిమీరను గార్నిష్ గా ఉపయోగిస్తాం. కానీ, దీనికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒక నీటి గిన్నెలో కొత్తిమీర ఆకులు తీసుకుని కాచుకోవాలి. తరువాత ఆ నీటిని తాగాలి. ఇంకో బెస్ట్ టిప్ ఏంటంటే నేరేడి పండు. ఈ పండు దొరికే సీజన్లో రోజుకు ఒకటి చొప్పున తిన్నాసరే కిడ్నీలో కంకర రాళ్ళూ ఉన్నా యిట్టె కరిగిపోతాయి. కడుపులో ఉండే వెంట్రుకలు, చిన్నపాటి రాళ్లను పూర్తిగా కరిగించే శక్తీ ఈ నేరేడి పండుకు ఉంది. కాబట్టి నేరేడి పండ్లను వీలైనంత ఎక్కువగా తీసుకోండి. మూత్రపిండాలలో రాళ్లను శస్త్రచికిత్స నుండి తప్పించుకోవాలి అంటే ఈ సులభమైన పరిష్కారాలు తప్పదు.
Butter Milk Side Effects: మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఎంతో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. ఇక మనం తీసుకునే ఆహార పదార్థాలలో తప్పనిసరిగా పెరుగు లేదా మజ్జిగ ఉండటం సర్వసాధారణం అయితే పెరుగుతో పోలిస్తే చాలామంది మజ్జిగ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మజ్జిగలో కూడా ఎన్నో పోషక విలువలు దాగి ఉండడంతో ప్రతిరోజు మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుందని భావిస్తూ ఉంటారు.
ఇలా మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరం కూడా హైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుందని భావిస్తూ చాలామంది మజ్జిగ తాగుతూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి మంచిది కాదని మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ప్రమాదంలో పడతామని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగను అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు మనల్ని వెంటాడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
పాలు పాల పదార్థాలలోనూ లాక్టోస్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది చాలామందిలో జీర్ణక్రియను పూర్తిగా మందగించేలా చేస్తుంది. ఎవరికైతే లాక్టోస్ ను జీర్ణం చేసే ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి కావు లాంటివారికి మజ్జిగ తాగటం వల్ల అవి జీర్ణం కాక వాంతులు అయ్యే పరిస్థితులు ఏర్పడుతుంటాయి అలాగే కడుపు నొప్పి రావడం కడుపు చాలా ఉబ్బర కావడం విరోచనాలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇలాంటి వారు ఎక్కువగా మంచిగా తీసుకోకపోవడం ఎంతో మంచిది.
Advertisement
చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి…
ముఖ్యంగా ఈ సమస్య చిన్న పిల్లలలో అధికంగా కనబడుతూ ఉంటుంది. అలాంటివారు రోజుకు కేవలం ఒక గ్లాస్ మజ్జిగ తాగడం మంచిది ఇక చాలా మంది మజ్జిగలో ఉప్పు అధికంగా వేసుకొని తాగుతూ ఉంటారు ఇలా అధికంగా ఉప్పు వేసుకొని తాగడం వల్ల మన శరీరంలో ఉప్పు నిలువలు పెరిగిపోయి హై బీపీ రావడానికి కూడా కారణం అవుతుంది. ఇక మరికొందరికి చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక రోజు ఒక గ్లాస్ కి మించి మజ్జిగ తాగకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Pregnant After 40 Years: ప్రస్తుత కాలంలో మహిళలు కూడా విద్యా ఉద్యోగం అంటూ పెళ్లిళ్లు చేసుకోవడం కూడా చాలా ఆలస్యంగా చేసుకుంటున్నారు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వెంటనే పిల్లలని ప్లాన్ చేయడం లేదు అందుకే ప్రస్తుత కాలంలో మహిళలందరూ కూడా 30 తర్వాత దాదాపు 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పిల్లలను కనడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలా మహిళలు 40 కి దగ్గర పడుతున్న సమయంలో పిల్లలను కనడం వారి ఆరోగ్యానికి మంచిదేనా పిల్లల ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందా అనే విషయానికి వస్తే…
40 సంవత్సరాల వయసు దగ్గర పడుతున్న సమయంలో పిల్లల్ని కనడం పెద్ద తప్పు అని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను కనడానికి 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఎంతో మంచిదని ఈ సమయంలో పిల్లలను కనడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా జన్మిస్తారు. 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి మహిళలలో విడుదల అయ్యే అండాల నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంది తద్వారా పిల్లలు పుట్టడం కూడా చాలా అరుదు ఒకవేళ పుట్టిన ఎన్నో రకాల సమస్యలతో జన్మిస్తూ ఉంటారు.
40 సంవత్సరాల వయసు దగ్గరకు పడే మహిళలలో రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడే వారు పిల్లల్ని కనుక కణాలని భావిస్తే వారి జీవితాన్ని కూడా ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. 30 సంవత్సరాల లోపు మొదటి బిడ్డకు జన్మనివ్వడం ఎంతో మంచిది అయితే మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి ఆరు ఏడు నెలల వ్యవధిలోని మరొకసారి గర్భం దాల్చడం చాలా ప్రమాదకరం.
Advertisement
18 నెలల గ్యాప్ అవసరం…
మొదటి బిడ్డకు రెండవ బిడ్డకు 18 నుంచి 23 నెలల గ్యాప్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఇలా ఉంటేనే రెండో బిడ్డకు ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదు. అలా కాకుండా ఐదు నెలల గ్యాప్ లోనే మరోసారి గర్భం దాల్చితే అది తల్లి బిడ్డల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఇలా గర్భం దాల్చడం వల్ల రక్తస్రావం జరగడం, తల్లి ఆరోగ్యం పై అధిక ప్రభావం చూపడం వంటివి జరుగుతుంటాయి.అందుకే పిల్లల విషయంలో సరైన ప్లానింగ్ ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు.
Doctor Kiran : కరోనా నీలి నీడలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నలభై ఏళ్ల లోపు వాళ్ళు గుండె పోటుతో చాలా మంది మరణించడం కలవరపెడుతోంది. ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి మరణిస్తుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక్క రోజులోనే తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది మంది యుక్త వయసు వాళ్ళు గుండెపోటుతో అక్కడికక్కడే మరణించడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక అసలు యుక్త వయసు వారికి గుండెపోటు రావడం వంటివి ఎందుకు సంభవిస్తున్నాయి, దీనికి గల కారణాలు వంటి విషయాలను డాక్టర్ కిరణ్ వివరించారు.
వాక్సిన్ కాదు స్మార్ట్ ఫోన్ వల్లే గుండె పోటు…
మారుతున్న జీవన సరళి వల్ల ఆహారపు అలవాట్లు, పని అన్నీ మారిపోయి మనం ఊబకాయం, షుగర్ వంటి వ్యాధుల భారిన పడటం వలన ఇన్ని రోజులు గుండెపోటు మరణాలు సంభవించేవి. అయితే ఇప్పుడు యుక్త వయసులో ఉన్నవారికే ఎక్కువగా గుండెపోటు సంభవించడానికి గల కారణాలను డాక్టర్ కిరణ్ వివరించారు. యువతలో అనారోగ్యాలకు గుండె ఆరోగ్యం మీద చూపే ప్రభావాలలో మొదటిది ఫోన్ వాడకం.
Advertisement
గంటలు గంటలు ఫోన్లను చూస్తూ చేతులు కాళ్ళు కదల్చకుండా ఉంచడం వల్ల చాలా శరీర భాగలకు రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతాయి. అపుడు రక్తం సరఫరా చేయడానికి గుండె మరింత బలంగా కొట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందువల్ల గుండె మీద భారం అధికమై చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇక బరువు ఉన్నట్టుండి తగ్గడం లేదా పెరగడం వల్ల కూడా ప్రమాదాలు ఎదురావుతున్నాయని తెలిపారు. ఇక కరోనా వాక్సిన్ వల్ల గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి అనేది అపోహ మాత్రమే, ఆ వాక్సిన్లు వేయించుకున్నందుకే మనం బ్రతికి ఉన్నాం అంటూ తెలిపారు.