Connect with us

Movie News

కొడుకు కోసం ఆ ప్రముఖ నటి రోడ్డు పక్కన దోసెలు వేసి అమ్ముకుంటుంది

Published

on

బట్టలు… నగలు… పర్‌ఫ్యూమ్స్… ఓ సినీతార, టీవీ సెలబ్రిటీ సొంత వ్యాపారం అనగానే గుర్తొచ్చేవి ఇవేనా..? కానీ ఒక్కసారి మనం నేషనల్ హైవే 66… కేరళ, తమిళనాడు మధ్యలో… నెయ్యతినకర దగ్గర… అక్కడ ఓ నటి… పేరు కవితా లక్ష్మి… మళయాళ సీరియల్ స్త్రీధనంలో ఫేమస్… ఆమె ఓ అసాధారణ వృత్తిలో కనిపిస్తుంటుంది… మూడు వారాలుగా ఇదే సీన్… సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా… హైవే పక్కన నిలబడి దోసెలు వేస్తూ కనిపిస్తుంది… ఆమ్లెట్లు, బీఫ్ కర్రీ కూడా…!

నిజమే… అబద్ధం కాదు… 43 సంవత్సరాల ఈ నటి ఏదో పాత్రలో నటించడం లేదు… ఆమె ఆ రోడ్డు పక్కన సెంటర్‌లో చెమటలు కక్కుతూ జీవిస్తుంటుంది… అయ్యో, అయ్యో, ఎందుకమ్మా ఇలా..? అనడిగాం అనుకొండి… ‘ఏం చేద్దాం సార్..? మా అబ్బాయి ఆకాష్ కృష్ణను బ్రిటన్‌లో ఓ కోర్సులో జాయిన్ చేశాను…

Advertisement

ఖర్చులకు నా సంపాదన సరిపోవడం లేదు అని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది… ‘‘బ్యాంకులేమో లోన్లు ఇవ్వవు… తాకట్టు పెట్టడానికో, గ్యారంటీ ఇవ్వడానికో నాకేమో భూముల్లేవ్, సరిపడా ఆస్తుల్లేవ్, ఓ చిట్టీ కడుతున్నా… వాడేమో ముందే ఇవ్వరా అంటే వీలుకాదుపో అంటున్నాడు…’’ అని వివరిస్తుంది ఆమె…

‘ప్చ్, ఒక ఇంటిపైనో, భూమిపైనో నేను పెట్టుబడి పెట్టకపోవడంపై ఇప్పుడు అసంతృప్తి ఫీలవుతున్నా… నా సంపాదనంతా పిల్లల చదువుకే ఖర్చు… సొంతిల్లు కన్నా అదే ముఖ్యం అనుకున్నాను…’ అంటున్నది ఆమె…… పదేళ్లుగా ఆమె అదే నెయ్యతినకర దగ్గర ఓ రెంటెండ్ ఇంట్లో ఉంటుంది..

ఆమెకు కొడుకే కాదు, ఉమా పార్వతి అనే ఓ కూతురు కూడా ఉంది… పదో తరగతి… కవిత 13 ఏండ్ల క్రితమే భర్త నుంచి విడిపోయింది… ఇలాంటి ఏ విషాదాల్లోనైనా భార్యల బాధితులుగా మిగులుతారు, బాధ్యతలు పైన పడతాయి అనేది తెలుసు కదా… ఆమె సంపాదన సరిపోవడం లేదు మరి… ఏం చేయాలి..? ‘‘అందుకే ఈ మార్గం ఎంచుకున్నా… నా వ‌ృత్తి, నా గౌరవం… తప్పేం ఉంది..? నా అవసరాలు ముఖ్యం కదా’’ అంటున్నదామె….

Advertisement

‘‘మేం ఇలా రోడ్డు పక్కన సెంటర్లలో బోలెడు సార్లు తినేవాళ్లం… ఫ్రెష్… గరం… కెమికల్స్ ఉండవ్, ప్రిజర్వేటివ్స్ ఉండవ్… పెట్టుబడి తక్కువ… నా పిల్లలకు ఏం చేసి పెట్టానో అవే ఇప్పుడు అందరికీ చేసి పెడుతున్నా… అంతే… నా బిడ్డ కూడా నాకు సాయం చేస్తుంది…’’ అంటున్న ఆమె నిజానికి టీవీలో పెద్ద స్టార్… స్త్రీధనంలో శాంత అనే నెగెటివ్ రోల్‌లో బాగా పాపులర్… సాల్ట్ అండ్ పెప్పర్; అయలుమ్ జానుమ్ తమ్మిల్, మమ్ముట్టి నటించిన తప్పన వంటి సినిమాల్లోనూ నటించింది…

ఇప్పుడు అయలాటే సుందరి అనే సీరియల్‌కు వర్క్ చేస్తున్నది… టీవీ నిర్మాతలకు ఆమె ముందే చెబుతున్నది… తన స్థితి ఏమిటో, తను సాయంత్రాలు ఎక్కడ ఏం పనిచేస్తున్నదో… అందుకే డే షూటింగులో మాత్రమే నటిస్తూ సాయంత్రాలు ఇలా అదనపు సంపాదన కోసం నానా ఇక్కట్లూ పడుతున్నది… త్వరగా సెట్ నుంచి వెళ్లడానికి, కాస్త ఆలస్యంగా ఉదయం హాజరు కావటానికి టీవీ సీరియల్ దర్శకులు కూడా వోకే అంటుంటారు…

‘‘ఏం చేస్తాం సార్..? మొదట్లో మా దోసె బండ కేవలం 20 దోసెలకే సరిపోయేలా ఉండేది… ఇప్పుడు దాన్ని 40 దోసెలు వేసేలా అప్‌గ్రేడ్ చేసుకున్నాం… మా అమ్మ చెప్పేది… మాడిన మొహంతో సర్వ్ చేయొద్దు, నవ్వు మొహంతో ఫుడ్ పెడితే కస్టమర్ సంతోషమే వేరు… అన్నం వడ్డిస్తుంటే అంత తెల్లగా నీ మొహంలో నవ్వు ఉండాలి అని….’’ అంటున్నది..

Advertisement

ఆమె… అన్నట్టు చెప్పలేదు కదూ… ఆమె తన కెరీర్‌ను ఇరవయ్యేళ్ల క్రితం స్టార్ట్ చేసింది… ‘‘నాకు లగ్జరీ లైఫ్ అవసరం లేదు… నా పిల్లలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలి… అప్పటివరకూ కష్టపడుతూనే ఉంటా’’ అంటున్నది ఈ తల్లి… సూపర్… కంగ్రాట్స్ తల్లీ…. మరో మాట… సరదాాగా మన తెలుగు టీవీల్లోని ప్రముఖ నటీమణుల్ని ఒక్కసారి ఊహించుకొండి… ఎంతమంది ఇలా రోడ్డు పక్కన దోసెలు వేస్తూ పిల్లల కోసం నాలుగు పైసలు సంపాదించుకోగలరు..? ఊరికే… సరదాగా…!!

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!