Connect with us

Featured

చక్రవాకం నటీనటులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా ?

Published

on

అసలు వెండితెరపై ఒక సినిమాను రెండు వారాలు ఆడించడానికే నిర్మాతలు నానా తంటాలు పడుతుంటారు. ఇక ఆ సినిమా యాబై రోజులకు చేరువైతే ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ కిందే లెక్క. అయితే ఇదంతా వెండితెరపై కానీ బుల్లితెరపై మాత్రం సీన్ రివర్స్. ఏదైనా ఒక సీరియల్ మొదలైందంటే. వందలకొద్దీ ఎపిసోళ్లు. వెయ్యి దాటిందంటే అదో రికార్డు. సీరియల్‌ తీయడం ఒకెత్తయితే. దాన్ని ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా మార్చడం మరొకెత్తు. ఇందులో వందకు వెయ్యి మార్కులు వేయించుకునే సీరియల్ చక్రవాకం. ఇదంత మామూలు విషయం కాదు. ఈ ఘన కార్యాన్ని సాధించడమే కాదు. వెయ్యి ఎపిసోడ్లకు పైగా పరుగులు పెట్టించి రికార్డ్ సృష్టించింది చక్రవాకం టీం.

టీవీ సీరియల్ అనగానే గుర్తుకొచ్చేలా తెలుగువాకిళ్లలో అందరినోటా నానిన సీరియల్ గా చక్రవాకంకు పేరు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు మంజులా, బిందునాయుడు సిస్టర్స్. చక్రవాకం సీరియల్ 2003 నవంబర్ 3న ప్రారంభమైంది. అక్కడి నుంచీ అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సీరియల్స్ తో మంచి ఇమేజ్ తెచ్చుకున్నా నటి నటుల గురించి ఇపుడు తెలుసుకుందాం.

ఇంద్రనీల్ వర్మ

చక్రవాకం’ హీరో ఇంద్రనీల్ గా అశేష తెలుగు టీవీ ప్రేక్షకులకు బాగా పరిచితుడు. తరువాత మంజులానాయుడి ‘మొగలిరేకులు’ సీరియల్లో కూడా హీరోగా చేశాడు. ఇంద్రనీల్ అలియాస్ రాజేశ్ బాబు పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా గుడివాడలో. చక్రవాకం సీరియల్లో నటిస్తున్నపుడే ఆ సీరియల్లో అత్తగా నటించిన గుజరాతీ అమ్మాయి మేఘనా రమ్మీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ తో పాపులారిటీ వచ్చిన తరువాత చాలా సీరియల్స్ ప్రోగ్రామ్స్ తో బిజీ గా ఉన్నాడు.

Advertisement

ప్రీతి అమిన్

‘చక్రవాకం’ హీరోయిన్ ప్రీతి అమిన్ టీవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ అమ్మడు పుట్టి పెగింది ముంబై, తెలుగు సీరియల్స్ లోనే కాకుండా హిందీ సీరియల్స్ కూడా నటించింది. చక్రవాకం సీరియల్ తో 2006 లో వెస్ట్ యాక్టర్స్ అవార్డు వచ్చింది. ఇక ఆతరువాత ప్రీతి అమిన్ అమెరికాకు చెందిన వ్యక్తి ని పెళ్లి చేసుకొని అమెరికాలోనే సెటిల్ అయిపోయింది.

సెల్వరాజ్

చక్రవాకం సీరియల్ లో ఇక్బాల్ క్యారెక్టర్ లో బాగా నటించి మంచి పేరు తెచ్చుకున్న నటుడు సెల్వరాజ్. ఆ తర్వాత మొగలి రేకులు సీరియల్ లో కూడా లీడ్ రోల్ చేసాడు. ఇక ఆతర్వాత చాల సీరియల్స్, ప్రోగ్రామ్స్ తో బిజీ అయిపోయాడు సెల్వరాజ్.

లిఖిత కామిని

Advertisement

తెలుగు అమ్మాయి అయినా లిఖిత చక్రవాకం సీరియల్ తో బాగా పాపులర్ అయి ఆ తరువాత మొగలి రేకులు సీరియల్ లో కూడా నటించింది. ఇక్క ఆ తర్వాత పెళ్లి చేసుకొని రియల్ లైఫ్ లో బిజీ అయిపోయింది. లిఖిత కు ఒక బాబు కూడా ఉన్నాడు.


శృతి

బుల్లితెరపై చక్రవాకం సీరియల్ లో మహిళా ప్రేక్షకుల్ని మెప్పించిన గొప్పనటి శృతి. మోడలింగ్ నుంచి సీరియల్స్ వరకు తన జీవన ప్రస్థానాన్ని సాగించారు. వందకుపైగా సీరియల్స్‌లో నటించారు . రుతురాగాలు, చక్రవాకం, మొగలిరేకులు, చంద్రముఖి, కన్యాశుల్కం, శ్రావణ సమీరాలు, మమతల కోవెలలోని పాత్రలు మంచి పేరు తెచ్చుకుంది ఈ నటి. ఈమె భర్త మధుసూదన్ కూడా నటుడే, సీరియల్స్ మరియు సినిమాల్లో ఎక్కువగా విల్లన్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇటు బుల్లి తెర అటు వెండి తెరఫై నటిస్తూ బిజీ గా ఉన్నారు ఈ కపుల్స్ .

మేధా

చక్రవాకం సీరియల్ లో మేధా చాల మంచి క్యారెక్టర్ చేసింది. ఆ తర్వాత మొగలి రేకులు సీరియల్ లో కూడా లీడ్ రోల్ చేసి ప్రేక్షకాదరణ పొందింది ఈ అమ్మడు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని బిజీ అయినా కూడా సీరియల్ లో నటిస్తుంది. మేధా కి ఒక బాబు కూడా ఉన్నాడు.

సాగర్

ఈ సీరియల్ తో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు నటుడు సాగర్. చక్రవాకం, మొగలి రేకులు టివి సీరియల్స్ రేపిన సంచలనం మాములుగా లేదు. ఆ తరువాత పలు టివి సీరియల్స్ లో నటించిన సాగర్ హీరోగా ”మాన్ అఫ్ ది మ్యాచ్” సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత సాగర్ హీరోగా సిద్దార్థ అనే సినిమా చేసాడు. ఇటీవలే “షాదీ ముబారక్” అనే సినిమాలో హీరోగా నటించాడు.

Advertisement

పావని

చక్రవాకం సీరియల్ లో ఫ్రెండ్ క్యారెక్టర్ లో అలరించిన నటి పావని. ఈ అమ్మడు సినిమాలు కూడా చేసింది. ఇక్క ఆతర్వాత పెళ్లి చేసుకొని రియల్ లో బిజీ అయిపోయింది , పావనకి ఒక పాపా కూడా ఉంది.

లహరి

చక్రవాకం’ ఇచ్చిన కిక్‌తో కెరీర్‌ వెనక్కి చూడాల్సిన అవసరం లేకుండా ముందుకు వెళ్తుంది లహరి. . ఈ సెరల్ తర్వాత ‘మొగలిరేకులు’, ‘లయ’, ‘డాక్టర్‌ చక్రవర్తి’, ‘శుభాకాంక్షలు’, ‘ఆరాధన’, ‘ముద్దుబిడ్డ’ సీరియల్స్‌ లో నటించింది. ‘ అంతే కాదు సినిమాలో కూడా నటిస్తుంది ఈ అమ్మడు. ఇటు బుల్లి తెర పైన అటు వెండి తెర పైన బిజీ గ ఉంటుంది లహరి.

చక్రవాకం సీరియల్ లో నటించిన ఈ నటులు అందరూ జీవితంలో ఎలా స్టిర పడ్డారో చూసారు కదా.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!