మన తెలుగు పరిశ్రమలో చాలామంది కేరీర్ చైల్డ్ హుడ్ నుంచి ప్రారంభమైంది. అయితే వారిలో కొందరు మాత్రమే పరిశ్రమలో సక్సస్ అయ్యారు. ఇంకోంతమంది ఒక్కటి, రెండు సినిమాలు చేసి తెరుమరుగైపోయారు. ఇంకోంతమంది ఒక్క సినిమాతోనే తెరగమరుగైపోయారు కాని మన మనసుల్లో మాత్రం చెరగని ముద్ర వేశారు.
అలా వచ్చి ఒక్క సినిమాతో కోట్ల మంది గుండె కొల్లగొట్టి మళ్లి వెండి తెర వైపు చూడకుండా వారి వారి సొంత పనుల్లో బిజి అయిపోయారు. అయితే వారెందుకు అలా అయ్యారో ఇప్పుడూ ఏం చేస్తున్నరో చూద్దాం.
1. కావ్య
1996లో తెలుగులో వచ్చిన ‘లిటిల్ సోల్జర్స్’ సినిమా గుర్తుందా? ఆ చిత్రంలో ‘ఐ యామ్ ఏ గుడ్ గర్ల్’ పాటతో ఫేమస్ అయిన బన్నీ అనే చిన్నపాప క్యారెక్టర్ ఎవరైనా మర్చిపోగలరా.. ఆ పాత్రకు గాను జాతీయ అవార్డు అందుకున్న ఆ అమ్మాయి పేరే ‘కావ్య అన్నపరెడ్డి’. అయితే ఆ అమ్మాయి ఆ తర్వాత ఏ చిత్రంలోనూ కనిపించలేదు. పెద్దయినా సినిమాల్లో నటించలేదు. నిర్మాత గుణ్ణం గంగరాజుకు మేనగోడలైన కావ్య తన కెరీర్లో కేవలం ఒకే ఒక చిత్రంలో నటించడం గమనార్హం. హైదరాబాద్లో ప్రముఖ వైద్యుడైన గురువా రెడ్డి కుమార్తైన కావ్య కూడా డాక్టరుగానే స్థిరపడ్డారు.
2. నాగ అన్వేష్.
ఇంట్లో ఇల్లాలు వంటిల్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ కి కొడుకుగా నటించాడు. ఆ సినిమాలో అన్వేష్ చేసిన అల్లరి ఎవరు మర్చిపోలేరు. కాని ఆ తరువాత ఏమైందో తెలియదు కాని. మళ్ళీ ఏ ఒక్క తెలుగు సినిమా చేయలేదు. సడన్ గా నాగ అన్వేష్ ఫోటోస్ రివిల్ అయ్యాయి. చిన్ననాటి కన్నా ఎంతో హైండ్ సమ్ గా ఉన్నాడు నాగ అన్వేష్. ఇప్పుడు ఈ ఫోటోస్ ని ఎందుకు పెట్టాడో్ అనుకుంటున్నారా. ఈ కుర్రాడు చాలాకాలం తరువాత తెలుగు హిరోగా ఏంట్రి ఇచ్చాడు. “వినవయ్య రామయ్య” మరియూ “ఎంజల్” సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ తరువాత ఆ సినిమాతో తెలుగులో మరి ఏ సినిమా తీయలేదు. ఎందుకంటే పై చదువుల కోసం. సినిమాలకు కాస్త దూరంగా ఉన్నాడు.
3. అనుష్క మల్హోత్రా
మెగా స్టార్ చిరంజీవి, సిమ్రాన్ నటించిన డాడీ మూవీ గుర్తుందా.? ఆ సినిమాలో అక్షయ పాత్రలో చిరంజీవికి కూతురిగా నటించిన అనుష్క అందరికి గుర్తుండే ఉంటుంది. అయితే అప్పట్లో ఈ సినిమా లో చిరంజీవి కూతురిగా నటించడానికి పెద్ద అడిషనే నిర్వహించారు. కొన్ని వందల మంది పాల్గొన్న అడిషన్ గా చివరిగా అనుష్క మల్హోత్రాను సెలక్ట్ అయ్యింది.. ఆ ఒక్క సినిమా చేసిన అనుష్క ఆ తరువాత ఏ సినిమాలో నటించలేదు. అయితే ఇప్పడు చదువు పూర్తి చేసుకొని సడన్ గా బయటకొచ్చింది. ఈ క్యూట్ గాళ్ చిన్నప్పటికంటే కూడా ఇప్పుడు చాలా అందంగా ఉంది. ఈ అమ్మాయి ఫోటోలను చూసిన వారంతా రాబోయే కాలంలో కాబోయే హిరోయిన్. అంటూ సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తున్నాయి.
4. శ్వేతా యామిని
జయం సినిమాలో “సదా” కి చెల్లెలి గా ఒక అమ్మాయి నటించింది గుర్తుందా..? అదే అండి అక్షరాలను రివర్స్ లో రాస్తూ ఉంటుంది. పైగా స్కూల్ లో టీచర్లు రివర్స్ లో నేర్పిస్తున్నారు అని చెపుతుంది. చివర్లో వాళ్ళ అక్క ప్రేమ గెలవాలని రైలు పెట్ట మీద సుద్ద ముక్కతో కూడా రివర్స్ లో రాస్తుంది. చివరికి అది అద్దంలో చూసి అర్ధం చేసుకుంటాడు హీరో. సినిమా వచ్చి పది సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో తెలుసా. ఆ అమ్మాయి పేరు “శ్వేతా యామిని“… ఇటీవలే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపొయింది..
5. బకిత
ఆనంద్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బాల నటి గుర్తుంది గా. ఈ అమ్మాయీ పేరు బకిట నటించిన సినిమా ఒకటే అయినప్పటికీ, ఈ సినిమాలో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత చదువులో పడి బిజీ అవడం తో సినిమాలకు కొంచం దూరం గా ఉంది.
6. భాస్వంత్ వంశీ
ఛత్రపతి” సినిమా అంటే అప్పట్లో ఒక ఊపు ఊపిన సినిమా. కాట్రాజ్” దగ్గర పని చేస్తూ “హోటల్” లో కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు “సూరీడు”. వాళ్ళ మామయ్య దగ్గరనుండి ఉత్తరం వస్తే వాళ్ళ అమ్మను తీసుకొని “దుబాయ్” వెళ్దాం అనుకుంటాడు. కానీ కాట్రాజ్ ఆపేస్తాడు. తరవాత ఛత్రపతి – కాట్రాజ్ ఫైట్. సినిమా వచ్చి పన్నెండు సంవత్సరాలైంది. అప్పటి “సూరీడు” ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా. టెక్ మహెంద్రాలో జాబ్ చేస్తు సమయం చిక్కినప్పుడల్లా అటు వెండి తెరపై, బుల్లి తెరపై నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు .
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.
ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.
Advertisement
ఇష్టమైన ఫుడ్ తింటారు.. ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.
Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
Advertisement
పార్టీలకు వెళ్లడం మానుకున్న.. ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Advertisement
క్విజ్ కాంటెస్ట్.. ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.