Connect with us

Featured

జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా !! ఆమోదించిన జనసేనాని !! అసలు కారణం ఇదేనా ?

Published

on

జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ ఎందుకు రాజీనామా చేశారు, ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పంపారు. ఇందులో జేడి ఈ విధంగా పేర్కొన్నారు. మీరు పూర్తీ జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తానని, తిరిగి సినిమాలలో నటించానని మీరు పూర్వం చాలా సార్లు చెప్పారు. అయితే ఇప్పుడు మీరు తిరిగి సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా మీ విధానాల్లో నిలకడ లేదని తెలుగుస్తుంది. కావున నేను జనసేన పార్టీ నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో నావెంట నడిచిన ప్రతి కార్యకర్తకి, నాకు ఓటు వేసిన ప్రతి ఓటరుకు నా కృతఙ్ఞతలు. నేను వ్యక్తిగత స్థాయిలో జనసైనికులకు, కార్యకర్తలకు మరియు పౌరులకు అందుబాటులో ఉంటానని తెలియచేస్తున్నాను. ఇన్నాళ్లు నాతో నడిచిన వారందరికీ, మరియు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లపుడు మంచి జరగాలని, ఆ భగవంతుడి కృప మీ మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు అని పేర్కొన్నారు.

అయితే ఈయన రాజీనామాను జనసేన అధక్షుడు పవన్ కళ్యాణ్ ఆమోదించారు. ఈ మేరకు జనసేన తన ట్విట్టర్ ఖాతాలో ఓక పోస్టు పెట్టింది. ” శ్రీ వి. వి. లక్ష్మీ నారాయణ గారి భావాలను గౌరవిస్తున్నాము. అయన రాజీనామాను ఆమోదిస్తున్నాము. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవి లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాదు. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నామీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి. వారికోసం, నాకుటుంబం కోసం, పార్ట్ ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి. ఇవన్నీ లక్ష్మీనారాయణగారు తెలుసుకుని అయన రాజీనామాలో ప్రస్తావించి ఉంటె బాగుండేది. శ్రీ లక్ష్మీనారాయణ గారు పార్టీకి రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగా నాకు, జనసైనికులకు, ఆయనపై ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆయనకు నా శుభాబినందనలు.” అంటూ పేర్కొన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.

Advertisement

జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ ఎందుకు రాజీనామా చేశారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. విశాఖ పార్లమెంట్ స్థానానికి జేడీ పోటీ చేసి దాదాపు 3 లక్షల ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున నిర్వహించిన విశాఖ లాంగ్ మార్చికి జేడీకి పిలుపు లేదు. దాంతో పాటుగా ఇటీవల జనసేన, బీజేపీ పొత్తు విషయంలో లక్ష్మీనారాయణను ఏమాత్రం అభిప్రాయం తీసుకోలేదని అంటున్నారు. మరియు జనేసేన – బీజేపీ పొత్తుపై కూడా జేడీ ఆగ్రహంగా ఉన్నారని వినికిడి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Ramcharan: రామ్ చరణ్ ఆ ఇంట్రడక్షన్ సీన్ నిజం కాదా… ఇంత పెద్ద మోసం చేశారా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినటువంటి చరణ్ తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.

ఇక రాంచరణ్ సినిమాలలో రంగస్థలం సినిమా కూడా ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటన అద్భుతం అని చెప్పాలి సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక సాధారణ వ్యక్తి లాగా సైకిల్ తొక్కుతూ ఎంట్రీ ఇచ్చారు ఈ విషయం గురించి సుకుమార్ గారికి ఒక ప్రశ్న ఎదురైంది.

ఇలా ఒక స్టార్ హీరోని ఇంత సింపుల్గా చూపించడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం మీలో కలగలేదా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ..కథకి అనుగుణంగా ఒక వ్యక్తి ఏదో వెతుక్కుంటూ వెళతాడు. ఆ రోజుల్లో వాహనం అంటే సైకిల్.. అందుకే సైకిల్ లో చూపించా.లాంగ్ షాట్ లో వంతెనపై సైకిల్ తొక్కుతూ కనిపించాలి. ఆ తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా రాంచరణ్ ముఖం దగ్గరికి కెమెరా రావాలి. కాబట్టి ఫ్లైయింగ్ కెమెరా వాడాం.

Advertisement

నాలుగైదు టేకులు..
నాలుగైదు టేకులు చేసిన మంచిగా రాకపోవడంతో ఇక ఈ ఇంట్రడక్షన్ సీన్ సీజీ వర్క్ లో పూర్తి చేశాం అని సుకుమార్ చెప్పారు. అవునా అది సీజీ షాటా అని ఆశ్చర్యపోయారు. రాంచరణ్ సైకిల్ తొక్కుతున్నది మాత్రం రిఫరెన్స్ గా తీసుకుని ఆ సీన్ ని సీజీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాలో ఇంకా కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి. కానీ ఎవరూ గుర్తు పట్టలేరు అని సుకుమార్ నవ్వేశారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Venu: బాహుబలి సినిమా చేస్తున్నావా.. వేణు ఇన్ని అవమానాలు పడ్డారా?

Published

on

Venu: జబర్దస్త్ కమెడియన్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈయన బలగం అనే సినిమా ద్వారా దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నాయి అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు తదుపరి సినిమా నానితో చేసే అవకాశాన్ని అందుకున్నారు త్వరలోనే వీరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన విషయాలు తెలియచేయబోతున్నారు.

ఇలా దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు మరొక కమెడియన్ ధనరాజ్ తో కలిపి ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది ఈ ప్రోమోలో భాగంగా బలగమా సినిమా గురించి ప్రశ్నలు వేశారు.

Advertisement

ఈ సందర్భంగా వేణు సమాధానం చెబుతూ తాను బలగం సినిమా షూటింగ్ సమయంలో కొంతమంది టెక్నీషియన్ లతో మాట్లాడుతూ ఉండగా కొందరు నన్ను అవమానపరిచారని తెలిపారు. ఏదో పెద్ద బాహుబలి సినిమా చేస్తున్నావా ఏంటి అంటూ అవమానించారని వేణు తెలిపారు.

చిన్న సినిమాలలో బాహుబలి..
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మీరు ఈ సినిమాపై స్పందిస్తూ చిన్న సినిమాలలో బాహుబలి అంటూ కామెంట్స్ చేయడం తను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ ఈ సందర్భంగా వేణు చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!