Connect with us

General News

నిరుద్యోగులకు శుభవార్త.. స‌ద‌ర‌న్ రైల్వేలో 2,652 అప్రెంటిస్ ఉద్యోగాలు..షేర్ చేయండి..

Published

on

సదరన్ రైల్వే తమిళనాడులో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలచేసింది. పొడనూర్‌లోని స్నిగల్, టెలికాం వర్క్‌షాప్ వివిధ డిపార్ట్‌మెంట్లలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. సదరన్ రైల్వే 1961 అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు.
పోస్టు: ట్రేడ్ అప్రెంటిస్

అప్రెంటిస్ చేసే ప్రదేశాలు: పొడనూర్, సేలం, పాల్గాట్, త్రివేండ్రం.

Advertisement

ట్రేడ్ అప్రెంటిస్ మొత్తం ఖాళీల సంఖ్య: 2652 (జనరల్-1 348, ఓబీసీ-705, ఎస్సీ-399, ఎస్టీ-200)

ఖాళీలు విభాగాల వారీగా :
మెషినిస్ట్-57, టర్నర్-30, ఫిట్టర్ – 587, అడ్వాన్స్ వెల్డర్-24, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్)-456, ఎలక్ట్రీషియన్-734,ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-29, డీజిల్ మెకానిక్-104, పెయింటర్-64, కార్పెంటర్-154, ప్లంబర్-108, వైర్‌మ్యాన్-68, రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్-12, ఎలక్ట్రానిక్స్ మెకానిక్-112, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-20, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)-50, ఫ్రెషర్ ఎంఎల్‌టీ (రేడియాలజీ)-8, ఫ్రెషర్ ఎంఎల్‌టీ (పాథాలజీ)-8 ఖాళీలున్నాయి.

వయస్సు: 2018 ఏప్రిల్ 12 నాటికి 15 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి. SC,ST లకు ఐదేళ్లు, OBCకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Advertisement

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతితోపాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్/ఐటీఐ (ఫిట్టర్, మెషినిస్ట్,మెకానిక్, ఎలక్ట్రీషియన్,టర్నర్, ఎలక్ట్రానిక్స్ ప్లంబర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్, ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-20, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్) ట్రేడ్‌లో ఉత్తీర్ణత. కార్పెంటర్, వెల్డర్, పెయింటర్, వైర్‌మ్యాన్‌లకు 8వ తరగతితోపాటు సంబంధిత ITIలో ఉత్తీర్ణత. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు ఇంటర్/10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)లో ఉత్తీర్ణత.

స్టైఫండ్ : సదరన్ రైల్వే అప్రెంటిస్ కౌన్సిల్ నిర్ణయించిన విధంగా ట్రైనింగ్ సమయంలో అప్రెంటిస్ యాక్ట్ 1992 ప్రకారం స్టయిఫండ్ చెల్లిస్తారు.

అప్లికేషన్ ఫీజువివరాలు: జనరల్/OBC అభ్యర్థులు రూ. 100/-, SC,ST, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.

Advertisement

ఎంపిక విధానం: 10వ తరగతి,ITIలో వచ్చిన మార్కుల ఆధారంగా (50:50) ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పూర్తిచేసి అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.

పూర్తి చేసిన దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Work Shop Personnel Officer,
Office of the Chief Work Shop
Manager, Signal and
Telecommunication Work Shop,
Southern Railway – Podanur,
Coimbatore Dist, Tamil Nadu

Advertisement

దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 11

వెబ్‌సైట్: http://www.sr.indianrailways.gov.in/

Advertisement
Continue Reading
Advertisement

Featured

Kumari Aunty: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ పై ఈమె ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ కాలం గడిపేది అయితే ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. ఇలా కుమారి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

కుమారి ఆంటీ బిజినెస్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఈమె వద్ద తక్కువ ధరకే ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కడుపునిండా తినవచ్చు అనే విధంగా రివ్యూలు కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్డు తినడం కోసం వచ్చేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించి ఈమె సెలబ్రిటీ హోదాని కూడా అందుకున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇలా రోజుకు ఇంతమంది కస్టమర్లు ఈమె ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ తింటూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమెకు నెలకు ఎంత మొత్తంలో ఆదాయం ఉంటుంది అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

Advertisement

లక్షల్లో ఆదాయం…

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన నెల సంపాదన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు అలాగే అక్కడ పనిచేసే వారికి ఇచ్చే ఖర్చులన్నీ పోను నెలకు లక్షన్నర వరకు మిగులుతుంది అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బాగుందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Breaking News

Breaking News : డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.

Published

on

డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

Advertisement
Continue Reading

Featured

Ayodhya: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. విమాన టికెట్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే?

Published

on

Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దాంతో అయోధ్యకు సంబంధించిన వార్తలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీర్థయాత్రకు సిద్ధమవుతున్నారు.

అయోధ్యకు భక్తులు పోటెత్తడంతో, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమాన, రైలు ప్రయాణ ఎంపికలు కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఇలా ఉంటే అయోధ్యకు విమానం ద్వారా వెళ్లాలి అనుకున్న వారికి ఒక చేదు వార్త ఎదురైంది. ఎందుకంటే ఈ అయోధ్యకు వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. జనవరి 19న ముంబై నుండి అయోధ్యకు వెళ్లే విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడం, ఇండిగో విమానం ప్రయాణానికి రూ. 20,700 కోట్ చేయడంతో అస్థిరమైన ధరలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, జనవరి 20కి సంబంధించిన ఛార్జీలు దాదాపు రూ.20,000గా ఉంటాయి.

బెంగుళూరు నుండి కూడా, విమాన ఛార్జీకి మినహాయింపు లేదు. ధరలు సుమారు రూ. 8,500కి చేరుకుంటాయి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాలను మించిపోయాయి. ఇది తీర్థయాత్ర ఖర్చులకు ఊహించని కోణాన్ని జోడిస్తుంది. అంతర్జాతీయ విమానాలతో పోల్చి చూస్తే ఈ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధరను పరిశీలిస్తే ఎయిర్ ఇండియా రూ. 10,987 కోట్ చేస్తున్నట్టు చూపుతుండగా, అదే తేదీన నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.13,800. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన పర్యాటకుల ప్రవాహం విమాన ఛార్జీలపై కాదనలేని విధంగా ప్రభావం చూపింది.

చార్జీల పెంపు…

Advertisement

ఈ విధంగా విమానంలో అయోధ్యకు చేరుకోవాలి అనుకున్న వారికి చార్జీల పెంపు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. లక్షలాది మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు, పెరుగుతున్న విమాన ఛార్జీలు ఊహించని అడ్డంకిగా నిలుస్తాయి, ఆర్థికపరమైన చిక్కులకు వ్యతిరేకంగా వ్యక్తులు తమ తీర్థయాత్ర ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ప్రేరేపిస్తాయి. మరి ఈ విషయాలపై అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!