Connect with us

Featured

పెద్దల సభలో రచ్చ రచ్చ.. నారా లోకేష్ సంచలన వీడియో !!

Published

on

మొన్న జరిగిన శాసన మండలిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.. రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లు, వైసిపి, టీడీపీ, నినాదాలు ఆందోళనల మధ్య బిల్లును సెలెక్షన్ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు షరీఫ్. ఈ సమయంలో టీడీపీ, వైసీపీ మధ్య సభ రసాభాస జరిగిందని, చైర్మన్ షరీఫ్ పట్ల కొందరు సభ్యులు దౌర్జన్యంగా ప్రవర్తించారని తెలిసింది. ఈ క్రమంలో సభ లోపల జరిగిన దృశ్యాలను నారా లోకేష్ బయట పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బహిరంగ లేఖ అంటూ నారా లోకేష్ ఒక సంచలన పోస్ట్ తన పేస్ బుక్ లో పెట్టారు.

Advertisement

బ‌హిరంగ‌లేఖ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు న‌మ‌స్కారం. దేవాల‌యంలాంటి శాస‌న‌మండ‌లిలో ప్ర‌జాస్వామ్యానికే మాయ‌నిమ‌చ్చ‌లా వ్య‌వ‌హ‌రించిన వైకాపా ప్ర‌భుత్వం తీరు, గూండాల్లా దాడి చేసిన మంత్రుల వ్య‌వ‌హార‌శైలిని ప్ర‌పంచం ముందుకు తెచ్చేందుకు ఒక బాధ్య‌త‌ కలిగిన శాస‌న‌మండ‌లి స‌భ్యుడిగా ఈ బ‌హిరంగ‌లేఖ విడుద‌ల చేస్తున్నాను. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లిలో వైకాపా వ్యవహరిస్తున్న తీరు మీరు చూసే ఉంటారు. 2014 రాష్ట్ర విభ‌జ‌న‌ను ఎంత అప్ర‌జాస్వామికంగా, నిరంకుశంగా పార్ల‌మెంటు త‌లుపులు మూసి, లైవ్ టెలికాస్ట్ ఆపివేసి, ఏపీ ఎంపీల‌పై దాడిచేసి మూక‌బ‌లంతో బిల్లు తెచ్చారో! అదేవిధ‌మైన దారుణ ప‌రిస్థితులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌మండ‌లిలో చోటుచేసుకున్నాయి. ఇటువంటి దౌర్జ‌న్య‌క‌ర సంఘ‌ట‌న‌ల‌కు పాల‌క‌ప‌క్షం పాల్ప‌డ‌టం ప్ర‌జాస్వామ్యానికి చీక‌టిరోజు. మండ‌లిలో స‌భ్యులు కాని మంత్రులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల‌పై దాడుల‌కు దిగారు. మండ‌లి ప్ర‌త్య‌క్ష ప్రసారాలు నిలిపేశారు. ఇంట‌ర్‌నెట్ సేవ‌లు ఆపేశారు. క‌రెంటు క‌ట్ చేశారు. ఇటువంటి స‌మ‌యంలో గౌర‌వ అధ్య‌క్ష‌స్థానంలో ఉన్న ష‌రీఫ్ గారి వైపు ఒక్క‌సారిగా వైకాపాకి చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు దూసుకొచ్చారు. చైర్‌ని చుట్టుముట్టారు. చైర్మ‌న్ ని అంతుచూస్తామ‌ని బెదిరించారు. ఇతర టీడీపీ స‌భ్యుల‌పైనా మూకుమ్మ‌డిగా దాడి చేస్తున్నారు. మండ‌లి స‌భ్యుడిగా ఫోన్‌లో ఎటువంటి వీడియోలు చిత్రీక‌రించ‌కూడ‌దు. కానీ వైకాపా మంత్రులు త‌మ పంతం నెగ్గించుకునేందుకు ఎంత‌వ‌ర‌కైనా వెళ్తాం అంటూ హెచ్చ‌రిస్తుండ‌టంతో చైర్మ‌న్‌ గారు, ఇతర ఎమ్మెల్సీల భ‌ద్ర‌త కోసం త‌ప్ప‌నిస‌రై వీడియో తీశాను. విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త అంటూ లెక్చ‌ర్లు దంచే సీఎం జ‌గ‌న్‌, వైకాపా మంత్రులు మండ‌లిలో ఎలా ప్ర‌వ‌ర్తించారో ప్ర‌జ‌లు ముందుంచే ప్ర‌య‌త్న‌మే ఇది. 21వ తేదీన మండ‌లి స‌మావేశాలు ప్రారంభం కాగానే రూల్ 71కింద శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. గంద‌ర‌గోళం సృష్టించింది. ఐదు సార్లు వాయిదా పడ్డ శాసనమండలి సమావేశాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్ధిక మంత్రి బుగ్గన, సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స శాసనమండలిలో ప్రవేశపెట్టారు. రూల్ 71పై చర్చ ప్రారంభ‌మైంది. మండ‌లి స‌మావేశాలు జ‌రుగుతున్నంత సేపూ వైకాపా మంత్రులు, స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునేలా ఉంది. ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు ఆపేయించారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో టీడీపీ ఎమ్మెల్సీ గిరిజ‌న మ‌హిళ అయిన గుమ్మ‌డి సంధ్యారాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ గారు డమ్మీ కాన్వాయ్ లో వెళ్లే పరిస్థితి ఎందుకొచ్చింద‌ని అడిగినందుకు 16మంది మంత్రులు ఆమెపై దాడికి ప్ర‌య‌త్నించారు. మ‌హిళ అనే క‌నిక‌రం లేకుండా వ్య‌వ‌హ‌రించారు. స‌భ‌లో మాట్లాడేందుకు య‌త్నించిన టీడీపీ ఎమ్మెల్సీలు బుద్ధా, నాగ‌జ‌గ‌దీశ్వ‌ర‌రావు, అశోక్‌బాబుల గొంతు నొక్కేందుకు వైకాపా మంత్రులు, ఎమ్మెల్సీలు మూకుమ్మ‌డిగా మీద‌ప‌డ్డారు. ఇవేనా స‌భావ్య‌వ‌హారాల మంత్రి బుగ్గ‌న గారు ప్ర‌వ‌చించిన విలువ‌లు? తీర్మానంపై చర్చ జరిగిన అనంతరం ఛైర్మన్ షరీఫ్ ఓటింగ్ నిర్వహించారు. రూల్ 71 తీర్మానానికి అనుకూలంగా 27, వ్యతిరేకంగా 11, తటస్థంగా 9 ఓట్లు పడ్డాయి. 22వ తేదీన మండ‌లి స‌మావేశం ప్రారంభం కావ‌డంతోనే సిఆర్డిఏ, మూడు ముక్కల రాజ‌ధానుల బిల్లుల చ‌ర్చ‌ ప్రారంభమైంది. స‌భ‌లోకి 22 మంది మంత్రులు ప్ర‌వేశించి స‌భ్యులపై బెదిరింపుల‌కు దిగారు. ఈ ద‌శ‌లో మండ‌లి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు ఆపేశారు. మండలిలోని ఛాంబర్లలో ఉన్న టీవీల్లో సైతం ప్రసారాలు రాకుండా చేసారు. చైర్మ‌న్ పున‌రుద్ధ‌రించాల‌ని ఆదేశించినా ప్రసారాలు పునరుద్ధరించలేదు. మండ‌లి స‌భ్యుల్ని ప్ర‌లోభ‌పెట్టేందుకు స‌భ్యులు కాక‌పోయినా విజ‌య‌సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిలు గ్యాల‌రీల్లో ఉండి మంత‌నాలు ప్రారంభించారు. చైర్మ‌న్ రూమ్‌కి చేరిన మంత్రులు ఆయ‌న‌ను బెదిరించేందుకు ప్ర‌య‌త్నించారు. అక్ర‌మాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి మండ‌లిలో స‌భ్యుడు కాక‌పోయినా గ్యాల‌రీలోకి చేరి ప్ర‌లోభాల‌కు గురి చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం నేరం కాదా? ఎవ‌రినీ ప్ర‌లోభాల‌కు గురిచేయ‌కూడ‌ద‌నే నిబంధ‌న‌ల‌కు లోబ‌డి విజయసాయి రెడ్డికి బెయిల్ ఇచ్చారు. ఆయ‌న మండ‌లిలో బేర‌సారాలు సాగించ‌డం ప్ర‌జాస్వామ్య‌మా? ధ‌నస్వామ్య‌మా? మూడు ముక్కల రాజధాని పై చర్చ పూర్తయిన తరువాత బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపాలని మేము డిమాండ్ చేసాం. దానికి వైకాపా మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసారు. చైర్మ‌న్ ఇరు పక్షాలను పిలిచి త‌న చాంబ‌ర్‌లో మాట్లాడుతున్న సందర్భంలో టీడీపీ ఎమ్మెల్సీ దీప‌క్ రెడ్డి క్లారిఫికేష‌న్ ఇస్తుండ‌గా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆయ‌న‌పై దాడి చేశారు. ఆ త‌రువాత మండలి చైర్మ‌న్ రోజంతా జరిగిన పరిణామాలు వివరిస్తున్న సందర్భంలో వైకాపా ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తి కాగితాలు చించేసి విసిరేశారు. చైర్మ‌న్ ముందున్న టేబుల్‌పైకి ఎక్కిన మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అక్క‌డ్నించే వేలు చూపిస్తూ చైర్మ‌న్ ష‌రీఫ్‌ని బెదిరించారు. చైర్మ‌న్ సీటు ముందున్న ఓ కుర్చీ ఎక్కిన మంత్రి కొడాలి నాని నేరుగా చైర్మ‌న్‌నే దుర్భాష‌లాడారు. త‌న విచ‌క్ష‌ణాధికారం ఉప‌యోగించి బిల్లుల‌ను సెలెక్ట్ క‌మిటీకి పంపిస్తున్నట్టు ప్ర‌క‌టించి స‌భ‌ని నిర‌వ‌ధికంగా వాయిదా వేసిన‌ట్టు ప్ర‌క‌టించిన‌ చైర్మ‌న్ త‌న ఛాంబర్ కు వెళ్లిపోతుండ‌గా అస‌భ్య‌ ప‌ద‌జాలంతో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ష‌రీఫ్ గారిని దూషించారు. మ‌తం పేరును ఉచ్ఛ‌రిస్తూ.. ఆయ‌న‌ని కించ‌ప‌రచ‌డం రాజ్యాంగాన్ని అగౌర‌వ‌ప‌ర‌చ‌డ‌మే. ముస్లిం మైనారిటీ వ‌ర్గానికి చెందిన ష‌రీఫ్ మ‌చ్చ‌లేని మ‌నిషి. ఇన్నేళ్ల త‌న రాజ‌కీయ జీవితంలోనూ, మండ‌లి చైర్మ‌న్ గానూ ప‌రుషంగా మాట్లాడిన సంద‌ర్భం లేదు. అటువంటి స‌మున్న‌తమైన వ్య‌క్తిని ప‌ట్టుకుని దుర్భాష‌లాడ‌టం న‌న్ను తీవ్రంగా బాధించింది. మూడేళ్లుగా శాస‌న‌మండ‌లిలో ఉన్నాను. ఏ ఒక్క‌రోజు చైర్మ‌న్‌ని, స‌భ్యుల్ని ఎవ్వ‌రూ దూషించ‌డం జ‌ర‌గ‌లేదు. వైకాపా రౌడీ రాజ‌కీయాలు న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ మండ‌లి చ‌రిత్ర‌లో చీక‌టి అధ్యాయంగా నిలిచాయి. వైకాపా వాళ్ల చిన్న‌బుద్ధితో పెద్ద‌ల స‌భ అయిన మండ‌లి గౌరవాన్ని మంట‌గ‌లిపేశారు. మార్ష‌ల్స్ ర‌క్ష‌ణ‌గా నిలవ‌క‌పోతే చైర్మ‌న్ గారికి ర‌క్ష‌ణ కూడా ప్ర‌శ్నార్థ‌క‌మైన ప‌రిస్థితి. త‌న నిరంకుశ నిర్ణ‌యాలు ఒప్పుకోని మండ‌లి చైర్మ‌న్‌పై దాడి చేయ‌డానికి వెనుకాడ‌ని జ‌గ‌న్‌, మూడుముక్క‌ల రాజ‌ధాని బిల్లుని సెలెక్ట్ క‌మిటీకి పంప‌డాన్ని జీర్ణించుకోలేక శాస‌న‌మండ‌లి ర‌ద్దుకు తెగ‌బ‌డ‌టం రాజ్యాంగాన్ని ఖూనీ చేయ‌డ‌మే. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ పేరుతో విద్వేషాలు రెచ్చ‌గొడుతున్న జ‌గ‌న్.. బిల్లు ప్ర‌జాభిప్రాయానికి వెళితే ఎందుకు ఉలికి ప‌డుతున్నారో ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాలి. కులం, మ‌తం, ప్రాంతం పేరుతో విభ‌జించి పాలించే ఎత్తుగ‌డే త‌ప్పించి.. ఇందులో ఎటువంటి అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ లేద‌ని ప్ర‌జ‌లు గ‌మ‌నించాలి. రాష్ట్రాన్ని ముక్క‌లు చేస్తూ, ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్న వైకాపా ప్ర‌భుత్వ నిరంకుశ వైఖ‌రిపై ప్ర‌జ‌లంతా ఐక‌మ‌త్య‌మై ఉద్య‌మించాలి.

ఇట్లు, మీ నారా లోకేష్ ఎమ్మెల్సీ

Advertisement

Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!