Connect with us

Featured

బతుకమ్మ తెలంగాణలోనే ఎందుకు జరుపుకుంటారో తెలుసా.

Published

on

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత రాష్ట్రపండుగగా మారిన బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా సాగుతున్నాయి. చిన్నా పెద్దా, ముసలి ముతక అనే తేడా లేకుండా ఆడవారు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

రాష్ట్రం రాకముందు బతుకమ్మ పండగను కొన్ని జిల్లాల్లో మాత్రమే ఎక్కువగా చేసేవారు. కాని రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రతి జిల్లాకు నిధులు కేటాయించి, బతుకమ్మను ప్రోత్సహించడంతో పాటు, ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు కొనసాగుతున్నాయి.

Advertisement

తెలంగాణలో మాత్రమే సాగే ఈ పూల ఉత్సవంకు పలు కథలు, కారణాలను పెద్దలు చెబుతూ ఉన్నారు. కథల విషయం ఎలా ఉన్నా కూడా ఈ పూల పండుగ వలన వాతావరణం బాగుపడుతుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. చెరువులు, కుంటల్లో ఈ పూలను వేయడం వల్ల ఆ నీరు శుద్ది అవుతుందని చెబుతున్నారు. బతుకమ్మ పండుగ బొడ్డెమ్మతో మొదలై ఎంగిలి పూల బతుకమ్మతో ముగుస్తుంది.

దసరా ముందు వచ్చే ఈ పూల జాతరకు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం ఉంది. పూలను ఒక క్రమ పద్దతిలో పేర్చి చిన్నా లేదా పెద్ద సైజ్‌లలో బతుకమ్మలను తయారు చేస్తారు. ఎవరి తాహతకు తగ్గట్లుగా వారు బతుకమ్మను తయారు చేసుకుంటారు. అలా తయారు చేసిన బతుకమ్మను సాయంత్రం సమయంలో ఊర్లోని ఒక నిర్దేశిత ప్రాంతంలో లేదా చెరువు గట్టుపైన బతుకమ్మలను ఒక్కచోట చేర్చి ఆడపడుచులు అంతా కూడా చుట్టు తిరుగుతూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆట ఆడుతారు.

గంట నుండి మూడు గంటల వరకు కూడా కొన్ని చోట్ల బతుకమ్మ పాటలు పాడుతూ ఆడవారు ఉత్సవంలా బతుకమ్మను జరుపుకుంటారు. బతుకమ్మలను నీటిలో వదిలేసి తిరిగిరా బతుకమ్మ అంటూ ఒకరికి ఒకరు ప్రసాదాలు తినిపించుకోవడంతో పాటు, సరదాగా కొందరు రంగులు కూడా పూసుకుంటారు. బతుకమ్మను 9 రోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు.

Advertisement

ఈ 9 రోజులకు 9 పేర్లు ఉన్నాయి. ఆ 9 రోజుల్లో 9 రకాల ప్రసాదాలను బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు.
ఎంగిలి పూల బతుకమ్మ: నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ :సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..
అలిగిన బతుకమ్మ : నైవేద్యమేమి సమర్పించరు.
వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
సద్దుల బతుకమ్మ : ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం.

బతుకమ్మ పండుగ గురించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఎక్కువగా వినిపించే కథ ఏంటి అంటే… ఒక బాలిక భూస్వాముల అకృత్యాల కారణంగా బలైపోతుంది. ఆమెను ఆ ఊరు ప్రజలు అంతా కూడా కలకాలం బతుకమ్మ అంటూ దీవించారట, అప్పటి నుండి కూడా ఆడపిల్లల పండుగ బతుకమ్మ అయ్యిందని అంటారు.

కొన్ని వందల సంఖ్యలో బతుకమ్మ పాటలు ఉన్నాయి. బతుకమ్మ ఉత్సవం అంటే ఖచ్చితంగా వినిపించే పాట ఉయ్యాల పాట మరియు చందమామ పాటలు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పి, తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తీసుకు వచ్చింది బతుకమ్మ. తెలంగాణ ఆడపడుచులందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షాలు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!