Connect with us

General News

భార్యకు ఫేస్ బుక్ లో లవర్ ఉన్నాడని తెలిసి ఓ కంప్యూటర్ ఇంజనీర్ భార్యను ఏం చేశాడో తెలుసా?!!

Published

on

ఇప్పుడు ఉన్న కాలంలో ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్ సైట్లపై ఆసక్తి చూపటం తప్పులేదు. అయితే పరిచయం లేని వ్యక్తులతో స్నేహం చేయడం.. ముక్కు ముఖం తెలియని వారిని నమ్మి వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ప్రమాదమేనని మానసిక వైద్యులు అంటున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సైట్ల ద్వారా ఏర్పడే స్నేహంతో ప్రపంచంలో ఎన్నో కుటుంబ సంబంధాలు తెగతెంపులు అవుతున్నాయని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవలే వీటిలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన మీ కోసం.. అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్‌గా ఉన్న వ్యక్తికి.. ఆతని తల్లిదండ్రులు ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి విదేశాలకు పంపించేశారు. ఆ అమ్మాయి గ్రామంలో కలివిడిగా పెరగడంతో విదేశాల్లో ఒంటరి జీవితానికి ఇష్టపడలేకపోయింది. దీంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన ఆమె భర్త ఆమెకు కంప్యూటర్ నేర్పించడం.. ఫేస్ బుక్, ట్వట్టర్‌తో కాలక్షేపం చేయమని చెప్పి ఆఫీసుకు వెళ్లేవాడు. అంతా తన ఉద్యోగ కార్యకలాపాలకే వెచ్చించే అతగాడు ఆమెకు అసలు సమయం ఇచ్చేవాడు కాదు. దీంతో ఆమెలో ఒంటరితనం బాగాపెరిగిపోయింది. అదిగ్గో అలా దొరికిన ఎమ్టీ ప్లేస్ లోకి సరిగ్గా వేరొకడు చాకచక్యంగా దూరిపోయాడు.అలా ఫేస్ బుక్‌లో పరిచయమైన ఓ వ్యక్తితో ఆ అమ్మాయి తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంది. అంతేగాకుండా వీరిద్దరి మధ్య స్నేహం చాలా దూరం వెళ్లిపోయింది.

తన భార్యకు ఫేస్ బుక్ లో లవర్ దొరికిన సంగతిని లేటుగా తెలుసుకున్న ఆ ఇంజనీర్.. ఆమెను మందలించకుండానే ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పి.. ఆ అబ్బాయికే ఇచ్చి పెళ్లిచేసుకోండని చెప్పి పెద్ద మనస్సుతో స్వదేశానికి పంపించేశాడు. అయితే తన అమ్మాయికి దొరికిన ఫేస్ బుక్‌ స్నేహితుడిపై ఆమె తల్లిదండ్రులు ఆరా తీస్తే ఫోన్ నెంబర్ నకిలీదని తేలింది. అంతేగాకుండా..

ఆ వ్యక్తి ఉన్నట్టుండి ఫేస్ బుక్ అకౌంట్‌ను కూడా క్లోజ్ చేసేశాడని తెలిసి షాక్ అయ్యారు.. దీంతో తన తప్పును తెలుసుకున్న ఆ అమ్మాయి పశ్చాత్తాపపడి భర్త వద్ద క్షమాపణలు కోరింది. అయితే ఆ భర్త మాత్రం ఆమెను అంగీకరించే మనస్తత్వంలో లేడు. ఇందుకు పరిష్కారం కోసం మానసిక వైద్యులను సంప్రదించాడు. ఈ సమస్యకు ఇంజనీర్ కూడా ఓ కారణమని వైద్యులు చెప్పారు.

గ్రామంలో పుట్టిపెరిగి కలివిడిగా తిరిగిన అమ్మాయిని ఒంటరిని చేయడం ద్వారానే ఇలాంటి పరిణామాలకు దారి తీసిందని, ఆమెను పై చదువులు చదివించి.. ఆమెకంటూ ఓ ఉద్యోగాన్ని ఏర్పరిస్తే ఆమెలో మార్పు వస్తుందని సలహా ఇచ్చారు వైద్యులు. అంతేగాకుండా ఆమె చేసిన తప్పును క్షమించి స్వీకరించాల్సిందిగా.. చేసిన తప్పును మళ్లీ మళ్లీ దెప్పిపొడవకుండా అన్యోన్యంగా జీవించాల్సిందిగా వైద్యులు సూచించారు. కానీ ఈ సలహాలను ఆ ఇంజనీర్ స్వీకరిస్తాడో లేదో డౌటే.. సో మీరు ఫేస్ బుక్, ట్విట్టర్లు ఉపయోగిస్తుంటే కాస్త జాగ్రత్తపడండి అమ్మాయిలు..

Advertisement
Continue Reading
Advertisement

Featured

Kumari Aunty: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ పై ఈమె ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ కాలం గడిపేది అయితే ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. ఇలా కుమారి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

కుమారి ఆంటీ బిజినెస్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఈమె వద్ద తక్కువ ధరకే ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కడుపునిండా తినవచ్చు అనే విధంగా రివ్యూలు కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్డు తినడం కోసం వచ్చేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించి ఈమె సెలబ్రిటీ హోదాని కూడా అందుకున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇలా రోజుకు ఇంతమంది కస్టమర్లు ఈమె ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ తింటూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమెకు నెలకు ఎంత మొత్తంలో ఆదాయం ఉంటుంది అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

Advertisement

లక్షల్లో ఆదాయం…

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన నెల సంపాదన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు అలాగే అక్కడ పనిచేసే వారికి ఇచ్చే ఖర్చులన్నీ పోను నెలకు లక్షన్నర వరకు మిగులుతుంది అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బాగుందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Breaking News

Breaking News : డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.

Published

on

డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

Advertisement
Continue Reading

Featured

Ayodhya: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. విమాన టికెట్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే?

Published

on

Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దాంతో అయోధ్యకు సంబంధించిన వార్తలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీర్థయాత్రకు సిద్ధమవుతున్నారు.

అయోధ్యకు భక్తులు పోటెత్తడంతో, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమాన, రైలు ప్రయాణ ఎంపికలు కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఇలా ఉంటే అయోధ్యకు విమానం ద్వారా వెళ్లాలి అనుకున్న వారికి ఒక చేదు వార్త ఎదురైంది. ఎందుకంటే ఈ అయోధ్యకు వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. జనవరి 19న ముంబై నుండి అయోధ్యకు వెళ్లే విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడం, ఇండిగో విమానం ప్రయాణానికి రూ. 20,700 కోట్ చేయడంతో అస్థిరమైన ధరలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, జనవరి 20కి సంబంధించిన ఛార్జీలు దాదాపు రూ.20,000గా ఉంటాయి.

బెంగుళూరు నుండి కూడా, విమాన ఛార్జీకి మినహాయింపు లేదు. ధరలు సుమారు రూ. 8,500కి చేరుకుంటాయి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాలను మించిపోయాయి. ఇది తీర్థయాత్ర ఖర్చులకు ఊహించని కోణాన్ని జోడిస్తుంది. అంతర్జాతీయ విమానాలతో పోల్చి చూస్తే ఈ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధరను పరిశీలిస్తే ఎయిర్ ఇండియా రూ. 10,987 కోట్ చేస్తున్నట్టు చూపుతుండగా, అదే తేదీన నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.13,800. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన పర్యాటకుల ప్రవాహం విమాన ఛార్జీలపై కాదనలేని విధంగా ప్రభావం చూపింది.

చార్జీల పెంపు…

Advertisement

ఈ విధంగా విమానంలో అయోధ్యకు చేరుకోవాలి అనుకున్న వారికి చార్జీల పెంపు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. లక్షలాది మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు, పెరుగుతున్న విమాన ఛార్జీలు ఊహించని అడ్డంకిగా నిలుస్తాయి, ఆర్థికపరమైన చిక్కులకు వ్యతిరేకంగా వ్యక్తులు తమ తీర్థయాత్ర ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ప్రేరేపిస్తాయి. మరి ఈ విషయాలపై అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!