Connect with us

Featured

మీకు గ్యాస్ సబ్సిడీ రావాడం లేదా..?? మీ వంట గ్యాస్ సబ్సిడీ సొమ్మును ఎయిర్‌టెల్ కాజేస్తుంది.ఎలాగో తెలిస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తారు.?

Published

on

ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు మనకు ఆధార్‌, మొబైల్ లింక్ చేసుకోండి.. అంటూ మొబైల్ కంపెనీలు మెసేజ్‌ల మీద మెసేజ్‌లను పంపిస్తూనే ఉన్నాయి. అలాగే కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉన్నాయి. అయితే అది ఇంత వరకు బాగానే ఉంది. కానీ..

మీరు ఎయిర్‌టెల్ కస్టమర్లా..? మీరు మీ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేశారా..? మీకు గ్యాస్ సబ్సిడీ ఏ బ్యాంక్ అకౌంట్‌లో పడుతోంది. ఏంటీ.. అసలు సబ్సిడీయే రావడం లేదా..? అయితే అందుకు కారణం ఏంటో తెలుసా..? మీరు మీ ఎయిర్‌టెల్ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయడమే..! అవును, మీరు విన్నది అక్షరాలా నిజమే. ఏంటీ.. మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేస్తే గ్యాస్ సబ్సిడీ బ్యాంక్ అకౌంట్‌లో ఎందుకు పడదు..? అని మీరు ఆశ్చర్యపోతున్నారా..? అయినా మేం చెబుతోంది నిజమే. ఎందుకో కింద ఇచ్చింది చదివి మీరే తెలుసుకోండి..!

Advertisement


ఎయిర్‌టెల్ అన్ని మొబైల్ కంపెనీల కన్నా కొంచెం భిన్నం కదా. కనుక అది ఏం చేస్తుందంటే. మనం మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయమని ఎయిర్‌టెల్ స్టోర్‌కు వెళ్తాం కదా. అప్పుడు వారు మొబైల్ నంబర్‌ను, ఆధార్ ను లింక్ చేస్తారు.కానీ వారు మనకు తెలియకుండానే మన పేరిట ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ను ఓపెన్ చేస్తారు. ఆ విషయం మనకు తెలియదు. ఇక దీంతో ఆధార్ అనుసంధానం అవుతుంది. కనుక యథావిధిగా లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్‌ సీడింగ్ అయిన వివరాల ప్రకారం మనకు వచ్చే గ్యాస్ సబ్సిడీ సొమ్ము ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు వెళ్తుంది.ఇది ఇలా చాలా మందికి జరిగింది.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో పైన చెప్పిన విధంగా మొత్తం ఇప్పటి వరకు రూ.167 కోట్ల గ్యాస్ సబ్సిడీ సొమ్ము జమ అయిందట. అవును మీరు విన్నది కరెక్టే. హెచ్‌పీ, ఇండియన్ ఆయిల్‌, భారత్ గ్యాస్ తదితర కంపెనీలకు చెందిన అనేక కోట్ల మంది కస్టమర్ల ఎల్‌పీజీ సబ్సిడీ సొమ్ము వారి వారి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్లలో జమ అయింది.

ఈ విషయాన్ని ఆధార్ బాడీ (UIDAI)) కూడా ధృవీకరించింది. అందుకనే తాజాగా ఎయిర్‌టెల్‌, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లకు ఆధార్ ఈ-కేవైసీ లైసెన్స్‌ను ఆధార్ బాడీ(UIDAI) సస్పెండ్ చేసింది. దీంతో ఎయిర్‌టెల్‌లో ఇప్పుడు ఆధార్, మొబైల్ లింక్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అంతేకాదు, కొత్తగా పేమెంట్స్ బ్యాంక్‌లను కూడా ఓపెన్ చేయడానికి వీలులేదు.

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుంది. కనుక.. మీరు కూడా మీ ఎయిర్‌టెల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసి ఉండి, గ్యాస్ సబ్సిడీ పడకపోతుంటే.. అప్పుడు మీరు మీ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్‌లో సబ్సిడీ సొమ్ము జమ అయిందో లేదో చేక్ చేసుకోండి.

లేదంటే.. ఎయిర్‌టెల్ వాడు ఆ సొమ్మును కాజేస్తాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త..!

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!