Connect with us

Featured

మీనా లైఫ్ లో చేసిన సరిదిద్దుకోలేని తప్పులు ఏంటో తెలుసా !?

Published

on

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో హీరోయిన్లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే అప్పట్లో చాలామంది హీరోయిన్లు హీరోలతో పాటు సమానమైన క్రేజ్ ను సంపాదించుకొని సినిమా విజయంలో కీలక పాత్రను పోషిస్తూ ఉండేవారు. అలాంటి వాళ్ళలో సౌందర్య లాంటి హీరోయిన్లు మొదటి వరుసలో ఉంటే రమ్యకృష్ణ, మీనా లాంటి హీరోయిన్లు ఆమె తర్వాత అంత గొప్ప విజయాలను అందుకొని నటులుగా మంచి గుర్తింపు సాధించుకున్నారు.

ముఖ్యంగా మీనా అయితే ‘సీతారత్నం గారి మనవరాలు’ సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సాధించుకున్నారు. ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోలందరితో సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలందరితో అప్పట్లో చాలా సినిమాల్లో నటించి నటులుగా మంచి గుర్తింపు సాధించుకున్నారు. అప్పట్లో వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కూడా మీనా మంచి గుర్తింపు సాధించుకున్నారు. అయితే వాళ్ళ అమ్మ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ఇండస్ట్రీకి పంపించారు అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే తన డేట్స్ కావాలంటే వాళ్ళ అమ్మని అడగాల్సిందే. వాళ్ళ అమ్మ ఎలా చెప్తే అలా వినేది మీనా. అందులో భాగంగానే చాలా సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాల్సిన మీనా కొన్ని సినిమాలను మిస్ చేసుకుంది.

అందులో చాలా సినిమాలు ఉన్నప్పటికీ ఒక రెండు సినిమాలు మిస్ చేసుకున్నందుకు మాత్రం మీనా ఇప్పటికీ చాలా బాధపడుతూ ఉంటారు. అందులో మొదటిది కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘నిన్నే పెళ్ళాడుతా’ సినిమాలో మీనా నే హీరోయిన్ గా తీసుకుందాం అనుకున్నారు. ఆవిడకి స్టోరీ కూడా చెప్పారు. నాగార్జున కూడా అప్పటికే సక్సెస్ లో ఉన్న మీనానే హీరోయిన్ గా ఫిక్స్ చేద్దాం అని చెప్పారట. ఇద్దరూ కలిసి స్టోరీ అ చెప్పారు ఆ స్టోరీ మీనాకి నచ్చింది. దాంతో ఆ సినిమా చేయడానికి ఒప్పుకుంది కానీ ఆ సినిమా కోసం కృష్ణవంశీ 60 రోజులు డేట్స్ అడిగితే మీనా వాళ్ళ అమ్మ కుదరదు అని చెప్పి 20 రోజులు ఇస్తా ఇష్టం చేయండి లేకపోతే కుదరదు అని చెప్పడంతో కృష్ణవంశీ హీరోయిన్ గా టబుని తీసుకున్నాడు. సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించడంతో హీరోయిన్ గా టబు కి మంచి పేరు వచ్చింది. అయితే మీనా ఆ సినిమా చూసిన ప్రతిసారి చాలా బాధ పడుతూ ఉంటారని చెబుతూ ఉంటారు.

అలాగే ఈ సినిమా తర్వాత కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘నరసింహ’ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన పాత్ర కోసం మొదటగా మీనాని అడిగారు ఆ కథని మీనా కి చెప్పిన దర్శకుడు నీలాంబరి క్యారెక్టర్ ని డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంతో మీనాకి కూడా డైరెక్టర్ చెప్పిన కథలో నీలాంబరి క్యారెక్టర్ బాగా నచ్చి చేస్తాను అని చెప్పింది. కానీ అప్పటికే తను హీరోయిన్ గా టాప్ లో ఉంది అలాంటప్పుడు నెగెటివ్ క్యారెక్టర్ లో చేయడం కరెక్ట్ కాదని వాళ్ళ అమ్మ చెప్పడంతో ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రమ్యకృష్ణ సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. నరసింహ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్బస్టర్ హిట్ గా మిగిలింది.

ముఖ్యంగా రమ్యకృష్ణ పోషించిన పాత్ర కి రజనీకాంత్ కంటే ఎక్కువ పేరు వచ్చిందని చెప్పాలి. ఇలాంటి మంచి సినిమా మిస్ చేసుకున్నందుకు కూడా మీనా ఇప్పటికీ చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు చాలా సినిమాల్లో వారు చేయాల్సిన క్యారెక్టర్ లను మిస్ చేసుకుంటూ వాళ్లకు రావాల్సిన క్రేజ్ వేరే వాళ్ళకి వచ్చింది అని బాధపడుతూ ఉంటారు…

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!