Connect with us

Featured

రక్తం గ్రూపుని బట్టి వ్యక్తుల గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.

Published

on

వ్యక్తి తల రాతను బట్టి వ్యక్తిత్వాలు ఉంటాయని తెలుసు. ఆకారాన్ని బట్టి వ్యవహరిస్తారని తెలుసు. ఆఖరికి నిద్రపోయే విధానాన్ని బట్టి వారి వ్యక్తిత్వాలు ఉంటాయని కూడా తెలుసు. ఇక జోతిష్యం సంగతి కూడా తెలుసు కానీ రక్త వర్గాలను బట్టి వ్యక్తులుంటారా? కానీ ఇది నిజమనే చెప్తున్నారు నిపుణులు. అదికూడా పరిశోధనల ద్వారానే దీన్ని ధ్రువపరిచామని కూడా వారు తెలిపారు. కాబట్టి ప్రతి వ్యక్తికీ ఏదో ఒక కోణం.. ఆలోచనా విధానం ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా ఓ బ్లడ్‌గ్రూప్ కూడా ఉంటుంది. రక్తం చెప్పే మనస్తత్వాల గురించి ఏమాత్రం లేట్ చేయకుండా తెలుసుకుందామా…

ఆ బ్లడ్‌గ్రూప్‌లోని హిమోగ్లోబిన్ శాతమెంత? ప్లాస్మా పర్సెంటేజీ ఏంటీ? వంటి విషయాలు పక్కనబెడితే పర్సనాలిటీ.. మనసు కోణంలోనే ఆలోచిస్తే రక్తవర్గ చరిత్ర తెలుసుకోవచ్చు! మనలో చాలామంది దానగుణాలు చేసే వ్యక్తిత్వం కలవారుంటారు. ఇతరులను చూస్తే ఓర్వలేని వారుంటారు. ఒకరైతే వేరొకరి కోసం జీవితాన్నే త్యాగం చేసేవాళ్లు. మరొకరు ఎప్పటికీ.. ఎవ్వరికీ అర్థంకానివాళ్లు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో పరిస్థితి. ఈ చర్యలన్నీ శరీరంలో ప్రతిక్షణం సరఫరా అయ్యే ప్రతి రక్తం బొట్టుపై ఆధారపడి ఉంటుందనేదే ఆసక్తి.. ఆశ్చర్యం కలిగించే విషయం. అందుకే ఇవి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటంలో తప్పు లేదు!

Advertisement

బ్లడ్ గ్రూపులను బట్టి మనస్తత్వం ఉంటుందని మొదటగా జపనీయులు కనిపెట్టారు. ఈ విషయం శాస్త్రీయంగా ధ్రువపడ లేదు కానీ గణాంకాల ప్రకారం సరి అవుతున్నట్లు చెప్తున్నారు మానసిక.. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ నిపుణులు. దక్షిణ కొరియాలో కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే పెళ్లి సంబంధాలు.. ఉద్యోగాల విషయంలో రక్త వర్గాలను ప్రామాణికంగా పాటిస్తున్న దేశాలూ.. సంస్థలూ ఉన్నాయి! రక్తాన్ని బట్టి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకుని ఆ పరంగా మనకు తెలిసిన వారి మనస్తత్వాన్ని పరిశీలిస్తుండటం సరదాగా అనిపిస్తుంది కదా!

క్రూరంగా ప్రవర్తించేవాళ్లను పచ్చినెత్తురు తాగేవాళ్లు అని అంటుంటారు. కానీ ఆయనది ఏ గ్రూపో తెలిస్తే తన క్రూరత్వాన్ని మార్చుకోవచ్చుగా అని ఆలోచించే.. రక్త వర్గాలపై కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. మనిషికి.. మనస్తత్వానికి ఇంత సంబంధం ఉన్నప్పుడు.. వాటికంత ప్రాధాన్యం ఉన్నప్పుడు కచ్చితంగా ఎవరికైనా తమ జాతకమేంటో తెలుసుకోవాలని ఉంటుంది. అయితే అంతకంటే ముందు రక్తంలో ఎన్ని వర్గాలు ఉంటాయి.. అసలు రక్తం అంటే ఏమిటో బ్రీఫ్‌గా తెలుసుకుందాం! ఇతిహాసాల్లో.. చరిత్రలో.. సాహిత్యంలోనూ రక్తం ప్రస్తావన ఉంది.

మహాభారతంలో ద్రౌపది వస్త్రాపరణ సందర్భంలో.. దుశ్శాసునుడి చంపి రక్తం తాగుతానని భీముడు.. ఆ నెత్తురును తల నూనెగా రాసుకుంటానని ద్రౌపది శపథం చేస్తారు! అంటే మనిషి రక్తానికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్టేట్స్ వేర్వేరు వ్యక్తుల్లో వేరుగా ఉంటాయి. రక్తంలో ముఖ్యంగా నాలుగు వర్గాలు ఉన్నాయి. ఏ, బీ, ఏబీ, ఓ. తిరిగి వీటిలో రీసస్ (ఆర్‌హెచ్) ఫ్యాక్టర్ ఆధారంగా పాజిటివ్ లేదా.. నెగెటివ్‌గా వర్గీకరించారు. ఓ నెగెటివ్ గ్రూప్ రక్తం విశ్వదాతగానూ.. ఏబీ పాజిటివ్ విశ్వ గ్రహీతగానూ పేర్కొంటారు. మానవ శరీర బరువులో దాదాపు 7 శాతం వరకు రక్తం ఉంటుందని పరిశోధకుల అంచనా!

Advertisement

రక్తం గురించీ ఒకమాట! రక్తం ఉపయోగం.. దాని స్థితి ఏంటో ఒకమాటలో తెలుసుకోవాలని లేదా? అయితే చదవండి. రక్తం ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడుతుంది. దాదాపు 473 మిల్లీ లీటర్ల రక్తం ద్వారా ముగ్గురిని ప్రాణాపాయ స్థితుల నుంచి కాపాడుతుంది. ఒక సగటు వయోజన వ్యక్తి బరువులో 65 నుంచి 80 కిలో బరువులో దాదాపు రక్తం 4.7 నుంచి 5.5 లీటర్ల వరకు ఉంటుంది. మనిషి జీవిత కాలంలో గుండె దాదాపు 1.5 మిలియన్ బారెల్స్ రక్తాన్ని సరఫరా చేస్తోంది. గుండె ప్రతి హృదయ స్పందనలో దాదాపు 55 నుంచి 80 మిల్లీ లీటర్ల రక్తాన్ని సరఫరా చేస్తుంది.

ఏ పాజిటివ్:
వీరు నాయకత్వ లక్షణాలు కలవారు. ఏ- పాజిటివ్ రక్తం ఉన్న వ్యక్తులు బయటకు బక్కచిక్కగా.. సాధారణంగా కనిపించొచ్చు. కానీ వాళ్లలో బ్లడ్‌గ్రూప్ తెలిస్తే అసలు విషయం కనుక్కోవచ్చు. నాయకుడంటే పరిపాలనాదక్షుడు. సన్మార్గంలో నడిపేవాడు. ప్రభావితం చేసేవాడు. నాయకత్వాన్ని వెతికి నేర్వడం కంటే.. అది మన రక్తంలో ఉంటుందని గ్రహించాలేమో!

ఏ నెగెటివ్:
వీరు కష్టపడే మనస్తత్వం కలవారు. కష్టం కంటే పనిని ఇష్టపడేవారు అనొచ్చు. చూసి కష్టాన్ని ఎలా ఇష్టపడాలో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మెరిసేదంతా బంగారం కాదు.. మోగేదంతా కంచు కాదు అని తెలుసుకుంటే బావుంటుంది. ఎందుకంటే బంగారంలా కనిపిస్తుందని వేరేవాళ్ల మెరుపు కోసం.. మెప్పు కోసం కాకుండా కష్టపడుతూ స్వయంగా ఎదగడం నేర్చుకోవడం కోసం.

Advertisement

బీ పాజిటివ్:
త్యాగం చేసే మనస్తత్వం కలవారు. త్యాగాన్ని కూడా త్యాగం చేసేవాళ్లన్నమాట! బీ పాజిటివ్‌గా ఉంటేనే ఇది సాధ్యం అన్నమాట. రక్తమే కాదు.. మన మనసూ బీ పాజిటివ్‌గా ఆలోచిస్తే ఇక నువ్వెన్ని త్యాగాలు చేసినా సంక్షోభం రాదు. నీ మనసు నిండా సంతృప్తి నిండి ఉంటుంది. మంచి వ్యక్తిగా.. తెలివితేటలుకలవానిగా.. నిజాయితీ కలవానిగా ఎంత త్యాగం చేసినా మనసు కరగని వెన్నలానే ఈ బ్లడ్ గ్రూప్ వారు ఉంటారన్నమాట.

బీ నెగెటివ్:
వీరు పరిస్థితులతో కాస్త సర్దుబాటు కాలేరు. వీళ్ల రక్తమే నెగెటివ్ కదా.. అని కాదు.. బ్లడ్‌గ్రూప్ మిమ్మల్ని ఇలానే ఉండమని చెప్పట్లేదు. కూడా మారొచ్చు.. పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు.. మార్చేస్తే మారుతారు సామీ అని చెప్తోంది. సర్దుబాటు అవ్వడం అనేది రక్తాన్ని.. దాని గ్రూపును బట్టి ఉండకపోవచ్చు.. చుట్టూ ఉన్న మనుషులు.. పరిస్థితులను బట్టే ఉంటుంది కదా.. అందుకే బీ నెగెటివ్ వారు సర్దుబాటు కాలేరు అనేది సర్వేలు చెబుతున్నా.. ఇందులో పూర్తి వాస్తవం లేకపోవచ్చు.

ఓ పాజిటివ్:
ఈ బ్లడ్ గ్రూప్‌వారు చురుకైన మనసును కలిగి ఉంటారు. ఏ విషయంలోనూ బద్దకిస్తే అది మనకే ప్రమాదం. నువ్వు చురుకుగా ఉంటే.. నీ జాతకాన్ని మార్చే మంత్రదండమేదీ లేదు. మనలో కొంతమంది మానవ సంబంధాల విషయంలో కూడా అలసత్వంగా.. నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ మనుషులు దూరంగా ఉంటే ఏం ప్రయోజనం. మనసులు దగ్గరగా ఉండేలా చురుగ్గా ఉంటే ఇతరుల మనసుల్ని గెలవడమే కాదు.. మనం కూడా ఆనందంగా ఉండొచ్చు. ఇది ఓ-పాజిటివ్ వాళ్లకు మెండుగా ఉంది కాబట్టి నో టెన్షన్!

Advertisement

ఓ నెగెటివ్:
వీరు కాస్త అర్థంకాని మనస్తత్వం కలవారు! అయినా మీరే చెప్పండి.. అక్క మనది అయితే.. బావ మనోడు కాడా?.. అవుతాడు కదా. అలాగే వీరిలో అంత ఈజీగా అర్థంకాని తత్వం కాస్త ఉన్నా.. ఈ సెల్ఫీల కాలంలో చల్తాహై. ఓ-నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు ప్రతీదాన్ని నెగెటివ్‌గా ఆలోచిస్తారనడం వాస్తవం లేకపోవచ్చు. ఇదే మీ బ్లడ్ గ్రూప్ అయితే.. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.. మీలోని క్వాలిటీస్ ఓసారి కర్టె చేసుకోండి. ఒక వేళ కాస్తో కూస్తో.. అవకాశం ఉంటే.. మీ మనస్తత్వం కాస్త మార్చుకోండి. ఎందుకంటే.. మీ నెగెటివ్ రక్తానికి ఎందుకు నెగెటివ్ పేరు తేవడం.. బీ పాజిటివ్ యార్!

ఏబీ పాజిటివ్:
వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టమట! ఇతరులకు సహాయం చేసేందుకు పుట్టారట వీళ్లు! ఈ గ్రూప్‌వాళ్లలో రెండు లక్షణాలున్నాయి. రెండూ వేటికవే భిన్నం. ఒక వ్యక్తిని ఏదో ఒకరకంగా అర్థం చేసుకోవచ్చు. కానీ కొందరు ఎంత అర్థం చేసుకున్నా అర్థం కారు. అందుకే మనలో చాలామంది వీడెంతకూ అర్థమవడురా బాబూ అని పెదవి విరుస్తుంటారు కూడా! ఇది ఒక లక్షణం అయితే.. ఇతరులకు సహాయం చేయడం వీరిలోని రెండో లక్షణం! కానీ ఇది మొదటిదానికి పూర్తిగా భిన్నం! మొదటిదాంట్లో నెగెటివ్ శాతం ఎక్కువగా ఉంటే.. రెండో లక్షణంలో పాజిటివ్ శాతం పుష్కలంగా ఉంది! కాబట్టి మీలో ఎవరైనా ఏబీ పాజిటివ్ ఉన్నవాళ్లుంటే వాళ్లను రెండు విధాలుగా అర్థం చేసుకోండి!

ఏబీ నెగెటివ్:
మెండైన తెలివి తేటలు కలిగి ఉంటారు! చూడటానికి చలాకీగా.. చురుగ్గా ఉంటారు. అందరితో చక్కగా మాట్లాడతారు. కమ్యూనికేషన్ గ్యాప్‌కూడా వీళ్ల దరి చేరదు. మన తెలివే మనల్ని కాపాడుతుంది. తెలివి లేకపోతే సకల సౌకర్యాలున్నా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏబీ నెగెటివ్ వాళ్లు ఇలానే తమ తెలివితేటల్ని ప్రదర్శిస్తూ భవిష్యత్‌లో మరింత ఉన్నతంగా ఎదిగేలా ప్లాన్ చేసుకోవాలి. దాంతోపాటు ఇతరులను కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఏబీ నెగెటివ్ గ్రూప్ వాళ్లు అన్నీ తెలిసిన తెలివిమంతులు కదా!

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Pitapuram: అందరి ఆసక్తి పిఠాపురం పైనే.. గెలుపు ఎవరిది.. సర్వేలు ఏం చెబుతున్నాయి?

Published

on

Pitapuram: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఎన్నికల హడావిడి మొదలైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరి జెండా ఎగురుతుందన్న విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇలా పిఠాపురం పైన ఇంత ఆసక్తి రావడానికి కారణం అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే కారణమని చెప్పాలి.

గత ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం కాపులు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలోనే ఈయనకు పోటీగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఎవరు గెలుస్తారో అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఎన్నో చానల్స్ వారు ప్రజా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. వంగా గీత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ అంతేకాకుండా ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కూడా ఈమె కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో వంగా గీత కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.

Advertisement

జనసేనదే విజయమా..
ఇకపోతే వంగా గీత 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు అయితే అప్పట్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిన పిఠాపురానికి చేయాల్సినటువంటి న్యాయం చేయలేకపోయారని అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నామంటూ చాలామంది ప్రజలు పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తున్నారంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి చూడాలి మరి పిఠాపురంలో ఏ జెండా ఎగురుతుంది వంగా గీత పవన్ కళ్యాణ్ కి ఎలా పోటీగా నిలబడతారు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading

Featured

AP politics: పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు.. పవన్ స్ట్రాంగ్ వార్నింగ్!

Published

on

AP politics: రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగిపోతుంది కానీ తెలుగుదేశం పార్టీతో జనసేన బిజెపి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే ఇలా కూటమిగా ఏర్పడి ఎన్నికలలో గెలిచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించాలని ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించారు.

ఇలా ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతున్నటువంటి తరుణంలో కొన్ని నియోజకవర్గాలలో పార్టీల కోసం ఎంతో కష్టపడినటువంటి వారికి సీట్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోనే జనసేనలోనూ కూడా అభ్యర్థులు అలకలు మొదలుపెట్టారు. ఇటీవల బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ సీటు జనసేన పార్టీకే కేటాయిస్తారని, పార్టీ తరపున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు.

ఇలా బిజెపికి సేటు కేటాయించడంతో మహేష్ ఏకంగా జనసేన పార్టీ కార్యాలయం ముందు రెండు గంటల పాటు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈయనని పవన్ కళ్యాణ్ పిలిపించుకొని తనని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవి తప్పకుండా ఇస్తామని చెప్పిన మహేష్ మాత్రం తనకు టికెట్ కావాలని కోరారు.

Advertisement

పొత్తు ధర్మాన్ని పాటించండి..
ఇలా అభ్యర్థులు సహకరించకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.పొత్తు ధర్మాన్ని పాటిద్దామని కూటమిని గెలిపిద్దామంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఆ పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: షర్మిల సునీతపై జగన్ ఘాటు వ్యాఖ్యలు.. హంతకులకే మద్దతంటూ?

Published

on

AP Politics: ఏపీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సభలో తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో రాష్ట్ర తెలుసనీ, తన చెల్లెలు షర్మిల సునీతను కూడా తమ రాజకీయాలలో పావులుగా వాడుకున్నారని తెలిపారు.

నా చెల్లెమ్మలు ఇద్దరూ కూడా హంతకులకే మద్దతు తెలుపుతున్నారని జగన్ మండిపడ్డారు. చెల్లెమ్మలు చిన్నాన్నను చంపిన వారితో చేతులు కలపగా నేను మాత్రం ప్రజల పక్షమే ఉంటానని జగన్ తెలిపారు. ఇలాంటి హంతకులతో అవినీతిపరులతో యుద్ధం చేయడానికి ఈ అర్జునుడు సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ ఈ కార్యక్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

Advertisement

కూటమి అంటే కుట్రలు..
వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడికి 45 ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపి, ఆయన విగ్రహాలకు పూలమాలలు వేశారని అన్నారు. కూటమి అంటే కుట్రలు కుతంత్రాలని జగన్ తెలిపారు. తమ జెండా మాత్రం మరో జెండాతో జతకట్టలేదని చెప్పారు. కేంద్రం నుంచి ఓ పార్టీని తెచ్చుకున్నారని అన్నారు. ఇటీవల చోటుచేసుకున్న డ్రగ్స్‌ కేసు వెనుక చంద్రబాబు వదిన గారి చుట్టం ఉన్నారంటూ డ్రగ్స్ వ్యవహారంపై కూడా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!