Connect with us

Featured

శ్రీను వైట్ల ‘నీకోసం’ సినిమా ఎన్ని రోజుల్లో తీశారో తెలుసా..?

Published

on

టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్ర దర్శకుడిగా వెలిగాడు శ్రీను వైట్ల. కెరీర్ ప్రారంభంలో చిన్న హీరోలతో సినిమా తీసిన ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, మాస్ మహారాజ రవితేజ, సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేశ్ లాంటి స్టార్స్‌తో పెద్ద నిర్మాణ సంస్థలలో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్..ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాడు. అయితే శ్రీనువైట్ల ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం మాత్రం అక్కినేని నాగార్జున. ఆయన ఇచ్చిన సలహా..టాలీవుడ్‌లో ఈ దర్శకుడిని అగ్ర తాంబూలం అందుకునేలా చేసింది. ఒక దశలో ఈ డైరెక్టర్‌కి నిర్మాతలు భారీగా అడ్వాన్సులు ఇచ్చేవారు. అలాంటిది ఒక్కసారిగా కెరీర్ డైలమాలో పడింది.

శ్రీను వైట్ల ఇండస్ట్రీలోకి రావడం ఒక మిరాకిల్ అని చెప్పాలి. ఆయన తూర్పుగోదావరి జిల్లాకి చెందినవాడు. అక్కడే ఉండే ఓ డిస్టిబ్యూటర్ ద్వారా గోగినేని సుబ్బారావు అనే నిర్మాత పరిచయమయ్యాడు. ఆయన చిన్ని కృష్ణుడు, పడమటి సంధ్యారాగం అనే సినిమాల నిర్మాణంలో పార్టనర్. ఆయన శ్రీను వైట్లకి సినిమాల మీద ఉన్న ఆసక్తి తెలుసుకుని చలసాని రామారావు అనే డైరెక్టర్ కి పరిచయం చేశారు. చలసాని రామారావు.. నట సింహం నందమూరి బాలకృష్ణతో ‘ప్రాణానికి ప్రాణం’ అనే సినిమా తీస్తున్నారు.

ఆ సినిమాకి చలసాని రామారావు వద్ద అప్రెంటీస్ గా చేరాడు. ఇలా శ్రీను వైట్ల 1989 లో సినిమా రంగంలో అడుగుపెట్టాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్. ఆ తర్వాత శివ సినిమాతో రాంగోపాల్ వర్మ పేరు అంతటా మార్మోగిపోయింది. దాంతో వర్మ దగ్గర అసిస్టెంట్ గా చేరదామని శ్రీను వైట్ల హైదరాబాదు వచ్చాడు. కాని వర్మ వద్ద అప్పటికే అసిస్టెంటుగా చేరడానికి వచ్చిన వాళ్ళ క్యూ చాలా పెద్దగా ఉండింది. దాంతో ముందు ప్రాణానికి ప్రాణం సినిమా సమయంలో పరిచయమైన డైరెక్టర్ సాగర్ వద్ద అసిస్టెంట్ గా చేరాడు. అలా ‘నక్షత్రపోరాటం’ అనే సినిమాకి పని చేశాడు.

అలా సాగర్ గారి వద్ద సూపర్ స్టార్ కృష్ణ నటించిన అమ్మదొంగా సినిమా వరకూ పనిచేశాడు. ఈ సినిమా తరువాత శ్రీను వైట్ల సొంతంగా డైరెక్షన్ చేయాలని డిసైడయ్యాడు. ఈ నేపథ్యంలో కథలు తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. అలా రవితేజ – మహేశ్వరీ జంటగా నీకోసం సినిమా మొదలు పెట్టాడు. కానీ ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచీ అన్నీ కష్టాలే. నిర్మాతలు తలా ఒక రెండు, మూడు లక్షలు వేసుకుని ప్రాజెక్టు మొదలెట్టారు, కానీ మధ్యలో బడ్జెట్ అయిపోవడంతో శ్రీను వైట్లనే కొంత పెట్టుబడి పెట్టాడు. అలా నానా కష్టాలూ పడి ‘నీకోసం’ సినిమాని పూర్తిచేశాడు.

కేవలం 38 లక్షల్లో 28 వర్కింగ్ డేస్ లో తీసిన సినిమా పూర్తి కావడానికి మొత్తం సంవత్సరంన్నర పట్టింది. ఈ సినిమా ప్రివ్యూ చూసిన నాగార్జున..శ్రీను వైట్లకి దర్శకుడిగా అవకాశం ఇస్తానని ప్రామిస్ చేశాడు. అయితే మంచి కామెడీ ట్రాక్ ఉంటే నీ సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయని సలాహా ఇచ్చారు. ‘నీకోసం’ సినిమాకి సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ అందించిన సాంగ్స్ పెద్ద హిట్. టైటిల్ సాంగ్ అయితే ఇప్పటికీ వినిపిస్తుంది.  అలా ఆ తర్వాత నుంచి శ్రీను వైట్ల నాగార్జున చెప్పినట్టు హెల్దీ కామెడీ ట్రాక్ పెడూతూ వచ్చి స్టార్ డైరెక్టర్ అయ్యాడు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Venu Swamy: ఆవిడ నన్ను ప్రేమించింది.. నేను ప్రేమించాల్సి వచ్చింది: వేణు స్వామి రియల్

Published

on

Venu Swamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు. ఈయన ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతోమంది సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచు వార్తల్లో నిలిచారు. కేవలం రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ఈయన పెద్ద ఎత్తున అభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు.

ఇకపోతే ఇటీవల కాలంలో వేణు స్వామి తన భార్య వీణా వాణితో కలిసి రీల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజుల క్రితం ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాలోని డైలాగుకు రీల్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే తాజాగా మరొకరి వీడియో ద్వారా ఈయన అభిమానుల ముందుకు వచ్చారు.

ఈ క్రమంలోనే నాగార్జున సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించిన మన్మధుడు సినిమాలోని ఒక సీన్ రీ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున సోనాలి బింద్రే ఇద్దరు ప్యారిస్ వెళ్లగా అక్కడ బ్రహ్మానందంతో ఓ సన్నివేశం వస్తుంది. మీ ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ అంటూ నాగార్జున బ్రహ్మానందం ని అడగడంతో అందుకు ఆయన చెబుతూ మొదట ఆమె నన్ను ప్రేమించింది తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అనే డైలాగును వేణు స్వామి కూడా రీ క్రియేట్ చేశారు.

Advertisement

ఊపిరి పీల్చుకో..

ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వామ్మో వేణు స్వామిలో ఈ యాంగిల్ కూడా ఉందా సోషల్ మీడియా ఇక ఊపిరి పీల్చుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా జ్యోతిష్యం చెబుతూనే వార్తలలో నిలిచినటువంటి ఈయన ఇప్పుడు మాత్రం రీల్స్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారని చెప్పాలి.

https://www.instagram.com/reel/C5oDUlhxisr/?utm_source=ig_embed&ig_rid=c69f6a00-74ea-461b-b532-7e7a5316f48a

Advertisement

Continue Reading

Featured

Rashmika: నాకంటే అందగత్తెలు ఉన్నారు.. రష్మిక కామెంట్స్ వైరల్!

Published

on

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా స్టార్ డం గురించి ఈమె మాట్లాడారు.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు అయితే నాకంటే ఎంతో అందమైన అమ్మాయిలు ఉన్నారు అలాగే బాగా నటించగలిగే వారు ఉన్నారు వారందరూ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని తెలిపారు.

ఇలా నేను ఇక్కడ వాళ్లు అక్కడ ఉండటానికి కారణం అదృష్టం మాత్రమేనని ఈమె తెలిపారు. నాకు అదృష్టం రావడంతో ఇక్కడికి వచ్చానని ఈమె తెలియజేశారు. ఇలా వచ్చిన అదృష్టాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకొని నన్ను నేను నిరూపించుకోవడం కోసం ప్రయత్నాలు చేశానని రష్మిక తెలిపారు.

Advertisement

పతనానికి కారణం..
సినిమా ఇండస్ట్రీలో అని మాత్రమే కాదు ఏ రంగంలో అయినా కూడా జయాలు అపజయాలు అనేది సర్వసాధారణంగా ఉంటాయి అయితే మనం విజయం సాధించినప్పుడు ఆ పొగరు తలకెక్కించుకోకూడదు అలా ఎక్కించుకున్నాము అంటే ఆ ప్రభావం మన మనసుపై పడుతుందని అది పతనానికి కారణం అవుతుంది అంటూ రష్మిక ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ramcharan: డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్.. ఇది వారందరికీ దక్కిన గౌరవం అంటూ?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఇటీవల చెన్నై వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీకి అందించినటువంటి సేవలను గుర్తించినటువంటి వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం జరిగినటువంటి యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమాలలో భాగంగా రామ్ చరణ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన డాక్టరేట్ అందుకోవడంతో రామ్ చరణ్ కాస్త ఇకపై డాక్టర్ రామ్ చరణ్ గా మారిపోయారని చెప్పాలి. ఇక ఈయనకు డాక్టర్ అందించడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా డాక్టరేట్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చెన్నైలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేల్స్ యూనివర్సిటీ నుంచి నాకు ఈ గౌరవం దక్కడం నిజంగా సంతోషంగా అనిపిస్తుందని ఈయన వెల్లడించారు. ఆర్మీ లాంటి గ్రాడ్యుయేషన్ మధ్యలో నేను ఇలా ఈరోజు ఉండటం  ఊహిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement

అందరి గౌరవం ఇదీ…
ఈరోజు ఇలా డాక్టరేట్ అందుకున్నాను అంటే అది కేవలం నాకు దగ్గర గౌరవం మాత్రమే కాదని తెలిపారు నన్ను ఆదరించిన అభిమానులది నన్ను నమ్మి సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలది అంటూ రాంచరణ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ యూనివర్సిటీని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ఇక్కడ నిర్వాహకులకు అధ్యాపకులకు అలాగే విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!