ఒకప్పుడు తెలుగు సినిమా హీరోల భార్యలు ఎలా ఉండేవాళ్లో.. ఏంచేస్తుండే వాళ్లో బయట ప్రపంచానికి అస్సలు తెలిసేది కాదు. అసలు ఫోటో చూద్దామన్నా సాద్యమయ్యేది కాదు. ఎప్పుడో ఏదో పెళ్లిల్ల లోనో.. పేరంటాల లోనే కనిపించీ కనిపించనట్టు కనిపిస్తుండే వాళ్లు ఒకనాటి హీరోల భార్యలు. సభ్య సమాజానికి సంభందం లేదన్నట్టు వంటింటి పనులు, పిల్లల పెంపకానికే పరిమితం అయ్యే వాళ్లు.
కాని కాలం మారింది. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. హీరోల భార్యలు కూడా హీరోల సంపాదకు రెట్టింపు సంపాదిస్తున్నారంటే ఆశ్చర్యపడక తప్పదు. సినీ పరిశ్రమలో హీరోగా సెటిలై మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్న కధానాయకుల భార్యలు.. భర్త సంపాదన మీద ఆధార పడకుండా స్వతహాగా తమ ఆదాయ మార్గాలను వారు అణ్వేషించుకుంటున్నారు.
Advertisement
ప్రస్తుత హీరోల భార్యలు చాలా మంది ఇంటీరియర్ డెకరార్స్, బొటిక్స్., ఈవెంట్ మేనేజ్ మెంట్స్., ఫాషన్ డిజైనింగ్ వృత్తుల్లో ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తూ రెండూ చేతుల్తో ఎకౌంట్స్ నిండా సంపాదిస్తున్న వారు ఉన్నారు. కొందరు హీరోల భార్యలైతే సినిమా రంగంలోనే భర్తలకు కాస్ట్యూమ్స్ డిజైనర్ అవకాశాలు కూడా కొట్టేస్తున్నారు.
వరుస హిట్లతో దూసుకెళ్తున్న నాని భార్య అంజన ఇటీవల దర్శకుడు రాజమౌళి స్కూల్లో చేరిపోయింది. ఆర్క మీడియాలో క్రియేటివ్ డిపార్ట్ మెంట్ కి హెడ్ గా పని చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటుందట. అంజన క్రియేటివీటికి తగ్గట్టే పారితోషికం కూడా భారీ స్థాయిలో లభిస్తోందట. బెంగుళూరు నిఫ్ట్ లో ఫాషన్ డిజైనింగ్ లో శిక్షణ తీసుకున్న అంజన భాహుబలి సినిమాకు లో ప్రభాస్, రాణా, అనుష్క తో పాటు మరి కొంత మంది ఆర్టిస్టుల దుస్తుల డిజైనింగ్ లో కీలక పాత్ర పోషించిందట.
ఇక మరో నటుడు రాజీవ్ కనకాల భార్య సుమ యాంకరింగ్ లో తనకు తానే సాటి అన్నట్టు బుల్లి తెర ప్రపంచానికి మహారాణిలా దూసుకుపోతోంది. ఏదో ఒక ఎంటర్టెయిన్ మెంట్ టీవి ఎప్పుడు ఆన్ చేసిన సుమ కనిపించని సందర్బం ఉండదు. టీవి చూస్తున్న సగటు మహిళలు అసలు సుమ ఇంట్లో వంట ఎప్పుడు చేస్తుంది., పిల్లలను స్కూల్ కి ఎప్పుడు రెఢీ చేస్తుంది అని సరదాగా మాట్లాడుకునే సందర్బాలు కూడా లేకపోలేదు. అంతే కాదు ఎలాంటి ఆడియో ఫంక్షన్లు, వంద రోజుల సెలబ్రేషన్స్ ఏదైనా మైక్ పట్టుకొని సుమ హడావిడి చేయాల్సిందే.. అందుకు తగ్గట్టుగానే సుమ సంపాదన కూడా ఉందనుకోండి. తెలుగు చిత్ర పరిశ్రమలో బూమ్ లో ఉన్న హీరోయిన్ కన్నా సుమ సంపాదన ఎక్కువని చెప్తే ఆశ్చర్యం వేస్తోంది. కాని అది సత్యం.
Advertisement
ఇక అల్లరి నరేష్ భార్య విరూప కూడా ఈవెంట్ మేనేజ్ నిర్వహిస్తూ కార్పోరేట్ శుభకార్యాలు చేస్తుంటుంది. అందుకు లక్షలు, కోట్లలో టారిఫ్ ఉంటుంది. అల్లరి నరేష్ కన్నా ఒక రకంగా రెట్టింపు సంపాదిస్తోంది విరూప.
అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఇద్దరు పిల్లల తల్లి అయినఫ్ఫటికి తన తండ్రి స్థాపించిన SCIENT Institute of Technology కంపనీ కోసం తన వంతు కృషి చేస్తూ, నియామక విబాగానికి డైరెక్టర్ గా పని చేస్తుంది, అంతే కాకుండా స్పెక్ట్రాం అనే మ్యాగ్జిన్ కి చీఫ్ ఎడిటర్ గా కూడ పని చేస్తు అల్లు అర్జున్ కి దీటుగా సంపాదిస్తుంది.. ఇది నిజంగా అల్లు కుటుంభ అబిమానులకి శుభవార్తే.
రామ్ చరణ్ బార్య ఉపాసన గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో అందరికి తెలిసిన విషయమే, అపోలో లో చురుకైన పాత్ర వహిస్తు మరియు సోషల్ ఆక్టివిటీస్ లో కూడ ఎంతో ఆక్టివ్ గ ఉండి సంపాదనలో భర్త రాం చరణ్ కన్నా ఎంతో ముందుంది.
Advertisement
ఇక ఈ మద్య అందాల రాక్షషి హీరో రాహుల్ రవీంద్రన్ తన బార్య తన కన్నా ఎక్కువ ఇన్ కం టాక్ష్ ఫైల్ చేసిందని మీడియా సాక్షిగా చెప్పాడు.
ఇవండీ మన హీరోల బార్య ల సంపాదనలు..
దీనికి సంబందించి లోతైన సమాచారం కోసం మా టీం ఇంక కృషి చేస్తుంది ఈ సారి లెక్కలతో సహ ఈ సారి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
Pawan Kalyan: ఇటీవల నటుడు మెగాస్టార్ చిరంజీవి కూటమికి మద్దతు తెలుపుతూ ఒక వీడియో షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ వీడియో పట్ల వైసిపి ప్రధానం సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిరంజీవి కూటమికి మద్దతు తెలపడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. ఇలా పవన్ కళ్యాణ్ కూటమికి మద్దతు తెలుపుతున్నారనే విషయం గ్రహించే అభిమానులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. దీంతో కూటమికి మరింత బలం చేకూరుతుందని చెప్పాలి. ఇలాంటి తరుణంలోనే సజ్జల చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇలా చిరంజీవి పట్ల సజ్జల చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సజ్జలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి అజాత శత్రువు.. ఆయన జోలికొస్తే సహించేది లేదంటూ సజ్జల రామకృష్ణారెడ్డిని పవన్ హెచ్చరించారు.
Advertisement
డబ్బు అధికారం ఎక్కువయ్యాయి.. రాష్ట్రప్రజల జోలికి, చిరంజీవి జోలికి, బడుగుబలహీన వర్గాల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాలంటూ పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసిపి సింహం కాదని గుంటనక్కలు, తోడేళ్ల బ్యాచ్ అని విమర్శించారు. సజ్జలకు డబ్బు, అధికారం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మేమంతా కూటమిగా ఏర్పడినది స్వలాభం కోసం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమిగా ఏర్పడ్డామంటే ఈ సందర్భంగా వైసీపీపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Suriya: సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సూర్య జ్యోతిక ఇద్దరు కూడా కెరియర్ పరంగా సినీ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక సూర్య దంపతులు కెరియర్ పరంగా బిజీగా ఉండడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. సూర్య దంపతులకు ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు. అయితే తాజాగా తన కుమారుడు దేవ్ సాధించిన ఘనత పట్ల సూర్య ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తన కుమారుడు దేవ్ కరాటే నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే .ఇందులో భాగంగా బ్లాక్ బెల్ట్ సాధించారు. అయితే ఈ బ్లాక్ బెల్ట్ అందించే కార్యక్రమానికి హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన కుమారుడు సాధించిన ఘనత చూసి ఈయన పుత్రోత్సాహంతో ఉన్నారు.
Advertisement
బ్లాక్ బెల్ట్.. తన కొడుకు వేదిక పైకి రాగానే తనకు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక తన కొడుకు వేదిక దిగి వెళుతుండగా సూర్య మాత్రం సంతోషంతో తదేకంగా తన కొడుకు వంక అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో తన కొడుకు సాధించిన ఘనత పట్ల సూర్య ఓ తండ్రిగా సంతోషం వ్యక్తం చేయడంతో ఆ సంతోషం తన కళ్ళల్లో కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.