Connect with us

Featured

విడాకులు తీసుకుని.. షూటింగ్ లొకేషన్ లో మళ్ళీ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న యాక్టర్స్ వీళ్ళే !!

Published

on

అసలు ప్రేమ, పెళ్లి అనే పదానికి అర్థాలు మారిపోతున్న రోజులు ఇవి. ఎవరితో ఎప్పుడు ప్రేమలో పడతారో తెలియదు ఎలా విడిపోతారో తెలియదు. ప్రేమించడానికి పట్టిన సమయం విడిపోవడానికి పట్టట్లేదు. ఇది సెలెబ్రేటిస్ నుండి మాములు మనుషుల వరకు ఒకేలా ఉంది పరిస్థితి. ఒకసారి ప్రేమ పెళ్లి విషయంలో ఓడిపోయామని ఎవరు ఖాళీగా బాధపడుతూ కూర్చోవడం లేదు. ఫటా ఫట్ గా మళ్ళీ ప్రేమలో పడిపోతున్నారు, పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మన టాలీవుడ్లో మరియు సౌత్ ఇండియాలో ఈ కల్చర్ ఎప్పటి నుండో ఉంది..

పెళ్లయిన హీరోయిన్స్ ని, నటీమణులని సినిమా సెట్లో కలిసి నటిస్తున్న సమయంలో మనసు పారేసుకుంటున్నారు మన హీరోలు. మరి ఇలా పెళ్లయినా హీరోయిన్స్ ప్రేమలో పడి మళ్ళీ పెళ్లి చేసుకున్న నటులెవరో చూద్దాం.

మొదటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న రాధిక.. ఈమె మ్యారేజ్ లైఫ్ పైన ఇప్పటికే అనేక సార్లు చర్చించుకున్నాం… రెండు సార్లు జీవితంలో పెళ్లి విషయంలో విఫలం అయ్యి ఒక బిడ్డతో జీవిస్తున్న రాధికను అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న శరత్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఒంటరి తనంతో ఉండటం వల్ల ఒక షూటింగ్ సందర్భంగా ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వీరు పెళ్లి చేసుకొని అన్యోన్యంగానే కాపురం చేసి మరొక కుమారుడికి జన్మ ఇచ్చి సంతోషంగా జీవిస్తున్నారు.

ఇక మరొక సీనియర్ నటి సీత. తల్లి పాత్రలకే హుందాతనం తెచ్చిన నటి సీత జీవితం లో కూడా అనేక ఆటుపోట్లు ఉన్నాయ్. తమిళ్ స్టార్ పార్తీబన్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు కూతుళ్లు పుట్టాక మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఆ ఎడబాటులో అలాగే ఉండకుండా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది సీత, ఆ సమయంలో షూటింగ్ స్పాట్ లో బుల్లి తెర హీరో సతీష్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇక అనుకున్నదే తడవు ఇద్దరు పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు బాగానే ఉన్న సీత సతీష్ తో కూడా విడిపోయి ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది.

ఇక మరొక హీరో కమల్ హాసన్. సీనియర్ హీరోయిన్ గౌతమిని ప్రేమించడానికి ముందే కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. అంతే కాదు వాణి గణపతితో కమల్ కి మొదట పెళ్లయిన కూడా సారికను ప్రేమించి వాణికి విడాకులు ఇచ్చారు. అలాగే గౌతమితో సెట్లో మనసు పారేసుకుని సారికకు విడాకులు ఇచ్చాడు. అప్పటికే పెళ్లయి ఒక కూతురికి తల్లయిన గౌతమి కమల్ ప్రేమలో నిజాయితీని వెతుకుంది కానీ పదేళ్ల సహజీవనం తర్వాత కమల్ కి బ్రేకప్ చెప్పి విడిపోయింది.

ఇక క్రైమ్ స్టోరీని మించింది హీరోయిన్ కావ్య మాధవన్ మరియు దిలీప్ ల ప్రేమ కథ. వీరిద్దరి కంబినేషన్లో ఇరవైకి పైగా సినిమాలు వచ్చాయి. కానీ దిలీప్ కి మంజు వారియర్ అనే హీరోయిన్ తో ప్రేమ పెళ్లి జరిగి ఒక కూతురు కూడా ఉంది. అలాగే కావ్య మాధవన్, దిలీప్ ల మధ్య షూటింగ్ లొకేషన్స్ లో కుదిరిన గాఢమైన బంధం ఉంది. కానీ ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్పడంతో కావ్య మాధవన్ కి వేరే పెళ్లి చేసారు. సరిగా మూడు నెలలు తిరక్కుండానే కావ్య అతడిని కోర్టుకి ఈడ్చి నానా రభస చేసి విడాకులు తీసుకుంది. ఇక దిలీప్ కూడా మంజుతో తెగదెంపులు చేసుకొని కావ్యను పెళ్లి చేసుకున్నాడు. ఇక దిలీప్ నటి భావనతో కాస్త క్లోజ్ గా ఉంటున్నాడని ఆమెను కావ్య మాధవన్ కిడ్నాప్ చేయించి బెదిరించిన కేసు ఇప్పటికి నడుస్తుంది. ఈ కేసులో ఏడాది కి పైగా జైల్లో బెయిల్ దొరక్కుండా ఉన్నాడు దిలీప్. ఏది ఏమైనా కావ్య మాధవన్ తో ప్రేమ ఆ తర్వాత పెళ్లి ఒక సినిమా తీసిన సరిపోదు. వీరి వైవాహిక బంధం మాత్రం సజావుగానే సాగుతుంది.

మరొక సీనియర్ హీరోయిన్ లక్ష్మి కి సైతం పెళ్లిళ్ల విషయం లో ఒక రికార్డు ఉంది. మొదట చిన్న వయసులోనే పెళ్లి చేయడంతో కూతురు ఐశ్వర్య పుట్టగానే విడాకులు తీసుకుంది. అలాగే అప్పటికే తమిళ్ లో స్టార్ గా ఉన్న నటుడు భాస్కర్ రావు ఆమెతో షూటింగ్ లొకేషన్ లో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు కానీ ఈ బంధం చాన్నాళ్లు నిలవలేదు.

Advertisement

O. A. K. సుందర్ తో నటి అంజు సైతం షూటింగ్ లొకేషన్ లో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. కానీ అంజు కి అప్పటికే విలన్ గా నటించే టైగర్ ప్రభాకర్ తో పెళ్ళై విడాకులు అయ్యింది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!