Connect with us

Featured

డేరింగ్ స్టెప్ వేస్తున్న అక్కినేని వారసుడు !! అఖిల్ నిర్ణయంతో భయపడుతున్న నాగార్జున..!

Published

on

టాలీవుడ్ అనగానే NTR, ANR పేర్లే వినబడతాయి. వీళ్ళిద్దరూ తెలుగు సినీ రంగానికి 2 కళ్లుగా
చెప్పుకుంటారు. ఇప్పుడూ వీళ్ళిద్దరూ లేకపోయినా వాళ్ళ మూడోతరం కూడా తెలుగు సినీరంగంలో కొనసాగుతోంది. అయితే అక్కినేని వంశానికి చెందిన టాలీవుడ్ కింగ్ నాగార్జున తండ్రికి తగ్గ కొడుకులాగే తన టాలెంట్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఈమధ్యకాలంలో నాగ్ కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. నాగ చైతన్య కొంచెం పర్వాలేదు గానీ, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ తో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇంతవరకు 3 సినిమాలలో హీరోగా నటించినా సరే, ఒక్క హిట్ కూడా అతని ఖాతాలో పడ లేదు. మొదటి సినిమా ‘అఖిల్’ తోనే పెద్ద డిజాస్టర్ ను మూట గట్టుకుని, అప్పటినుండి హిట్ కోసం తపిస్తున్నాడు అఖిల్. సాధారణంగా కొత్త కథలను తెలుగు ప్రేకకులెప్పుడూ ఆదరిస్తుంటారు. ఇంత వరకూ మాస్ కథల్నీ వదిలీ ప్రేమ కథలను మాత్రమే ఎంచుకున్న అఖిల్ కి అదృష్టం కలిసి రావట్లేదనే చెప్పాలి.

ప్రస్తుతం అఖిల్ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునే దిశగా అడుగులేస్తూ.. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ సరసన మన టాలీవుడ్ జిగేల్ రాణీ పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ చాలా పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు అఖిల్ తండ్రి నాగార్జున కూడా తన వంతుగా కొడుక్కి మాంచి హిట్ అందించాలనీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఈమధ్యనే ఈ సినిమాను చూసిన నాగార్జున సినిమా అవుట్ పుట్ పట్ల సంతోషంగా ఉన్నాడని తెలిసింది. ఇక ఈ సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సమ్మర్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా గత 4 నెలలుగా షూటింగ్ లన్నీ ఆగిపోయి చిత్ర యూనిట్ అంతా ప్రస్తుతం ఎవరి ఇళ్ళకు వాళ్ళే పరిమితమైపోయారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ షూటింగ్స్ ను మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చని అనుమతులు ఇచ్చినా కూడా ఇంకా కరోనా వైరస్ సోకుతుందనే భయంతో ఎవరూ ఈ చిత్రం షూటింగ్ ను స్టార్ట్ చేయడం లేదు.

ఈ నేపథ్యంలో ఈ చిత్ర కధానాయకుడు అఖిల్ మాత్రం కరోనాను సైతం లెక్క చేయకుండా ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న తపనతో డేరింగ్ స్టెప్ వేస్తున్నాడు. ఈయన తన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ షూటింగ్ ను మళ్ళీ మొదలు పెట్టబోతున్నాడు. మరో 15 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండటంతో దాన్ని ఎలాగైనా సరే పూర్తి చేయాలని దర్శక, నిర్మాతలు కూడా అఖిల్ అడుగుజాడల్లోనే నడుస్తూ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్, వాసు వర్మ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో అఖిల్ మళ్లీ మేకప్ వేసుకోబోతున్నాడని టాలీవుడ్ టాక్. ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా అఖిల్ తీసుకున్నది డేరింగ్ నిర్ణయమే అవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ కూడా చాలా వేగంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ షూటింగ్ ను ఎలాగైనా పూర్తి చేసి వీలైనంత తొందరగా కొబ్బరికాయ కొట్టేయాలని చూస్తున్నాడు. చూద్దాం.. ఈసారైనా అఖిల్ సక్సెస్ సాధిస్తాడో లేదో తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.!

Advertisement
Continue Reading
Advertisement

Featured

Ramcharan: రామ్ చరణ్ ఆ ఇంట్రడక్షన్ సీన్ నిజం కాదా… ఇంత పెద్ద మోసం చేశారా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినటువంటి చరణ్ తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.

ఇక రాంచరణ్ సినిమాలలో రంగస్థలం సినిమా కూడా ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటన అద్భుతం అని చెప్పాలి సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక సాధారణ వ్యక్తి లాగా సైకిల్ తొక్కుతూ ఎంట్రీ ఇచ్చారు ఈ విషయం గురించి సుకుమార్ గారికి ఒక ప్రశ్న ఎదురైంది.

ఇలా ఒక స్టార్ హీరోని ఇంత సింపుల్గా చూపించడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం మీలో కలగలేదా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ..కథకి అనుగుణంగా ఒక వ్యక్తి ఏదో వెతుక్కుంటూ వెళతాడు. ఆ రోజుల్లో వాహనం అంటే సైకిల్.. అందుకే సైకిల్ లో చూపించా.లాంగ్ షాట్ లో వంతెనపై సైకిల్ తొక్కుతూ కనిపించాలి. ఆ తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా రాంచరణ్ ముఖం దగ్గరికి కెమెరా రావాలి. కాబట్టి ఫ్లైయింగ్ కెమెరా వాడాం.

Advertisement

నాలుగైదు టేకులు..
నాలుగైదు టేకులు చేసిన మంచిగా రాకపోవడంతో ఇక ఈ ఇంట్రడక్షన్ సీన్ సీజీ వర్క్ లో పూర్తి చేశాం అని సుకుమార్ చెప్పారు. అవునా అది సీజీ షాటా అని ఆశ్చర్యపోయారు. రాంచరణ్ సైకిల్ తొక్కుతున్నది మాత్రం రిఫరెన్స్ గా తీసుకుని ఆ సీన్ ని సీజీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాలో ఇంకా కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి. కానీ ఎవరూ గుర్తు పట్టలేరు అని సుకుమార్ నవ్వేశారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Venu: బాహుబలి సినిమా చేస్తున్నావా.. వేణు ఇన్ని అవమానాలు పడ్డారా?

Published

on

Venu: జబర్దస్త్ కమెడియన్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈయన బలగం అనే సినిమా ద్వారా దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నాయి అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు తదుపరి సినిమా నానితో చేసే అవకాశాన్ని అందుకున్నారు త్వరలోనే వీరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన విషయాలు తెలియచేయబోతున్నారు.

ఇలా దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు మరొక కమెడియన్ ధనరాజ్ తో కలిపి ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది ఈ ప్రోమోలో భాగంగా బలగమా సినిమా గురించి ప్రశ్నలు వేశారు.

Advertisement

ఈ సందర్భంగా వేణు సమాధానం చెబుతూ తాను బలగం సినిమా షూటింగ్ సమయంలో కొంతమంది టెక్నీషియన్ లతో మాట్లాడుతూ ఉండగా కొందరు నన్ను అవమానపరిచారని తెలిపారు. ఏదో పెద్ద బాహుబలి సినిమా చేస్తున్నావా ఏంటి అంటూ అవమానించారని వేణు తెలిపారు.

చిన్న సినిమాలలో బాహుబలి..
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మీరు ఈ సినిమాపై స్పందిస్తూ చిన్న సినిమాలలో బాహుబలి అంటూ కామెంట్స్ చేయడం తను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ ఈ సందర్భంగా వేణు చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!