బాలీవుడ్ యువ హీరో సుశాంత్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకొస్తూ క్రొత్త మలుపులు తిరుగుతుంది. ఇన్ని రోజులు సుశాంత్ బలవాన్మరణం పొందాడనుకుంటున్న కేసును ఇప్పుడు పాట్నా పోలీసులు దర్యాప్తు చేస్తుండటంతో జరుగుతున్న పరిణామాలను, నడుస్తున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే సుశాంత్ ఉరి వేసుకునెంత పిరికి వాడు కాదని తాజాగా సుశాంత్ ఫ్యామిలీ ఫ్రెండ్ స్మితా పారిఖ్ సంచలన కామెంట్స్ చేశారు.
సుశాంత్ ది బలవాన్మరణం కాదని తాము ముందు రోజు నుంచి చెబుతున్నామని, సుశాంత్ కుటుంబ సభ్యులదీ ఇదే అభిప్రాయమని, సుశాంత్ బలవన్మరణం పొందినట్టు చెబుతున్న వస్త్రానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు ఇప్పటికీ బయటికి రాలేదని, ఈ సంఘటన జరిగిన జూన్ 14న పితానీ, శామ్యూల్ అనే ఇద్దరు వ్యక్తులే అక్కడ ఉన్నారని, వీరిద్దరూ సుశాంత్ సాంకేతిక వ్యవహారాలను చూస్తుంటారని ఈ సందర్భంగా పారిఖ్ తెలియజేశారు. మరోవైపు సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంది. సుశాంత్ వద్ద జీరో బ్యాలన్స్ ఉన్నా.. అతడి దగ్గర్నుంచి 50 కోట్లు కాదు కదా 100 కోట్లు తీసుకుపోయినా కూడా అతను ప్రాణం తీసుకునేంత చేసుకునేంత పిరికివాడు కాదని.. మళ్లీ ఆ డబ్బును సంపాదించే తెలివి, ధైర్యం 2 ఉన్నవాడంటూ అంకిత చెప్పుకొచ్చింది. సినీ ఫక్కీలో రోజుకో క్రొత్త మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇప్పుడు అందరి దృష్టి ఓ వ్యక్తి పైనే వుంది.
అతడే సిద్ధార్థ్ పితానీ. తెలుగబ్బాయే. సినిమా రంగంపై ఇంట్రస్ట్ తో జైపూర్లో పని చేస్తున్న సిద్ధార్థ్.. 2019లో సుశాంత్ కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత సుశాంత్ సింగ్ కు రూమ్ మేట్ గా మారిన సిద్ధార్థ్.. సుశాంత్ చనిపోయిన రోజు అతడి ఫ్లాట్లోనే వుండటంతో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అతడి పేరే ఎక్కువగా వినబడుతుంది. సుశాంత్ బలవాన్మరణం పొందిన టైంలో తలుపులు తెరుచుకోవడం లేదంటూ సుశాంత్ సింగ్ అక్కకు ఫోన్ చేసి తలుపులు తెరిపించింది కూడా సిద్ధార్థ్ పితానీయే కావడం విశేషం. అయితే సోషల్ మీడియాలో మాత్రం రియా, సుశాంత్ మధ్య అసలేం జరిగింది.? వాళ్లిద్దరూ ఎప్పట్నుంచి కలిసుంటున్నారు.? మొదలైన విషయాలన్నీ సిద్ధార్థ్కు బాగా తెలుసనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ సిద్ధార్థ్ మాత్రం ఎంత సుశాంత్ తో కలిసి ఒకే ఇంట్లోనే ఉన్నా కూడా అసలేం జరిగిందో తనకు తెలియదంటూ చెప్తున్నాడు. కానీ అతని మాటలను ఎవరూ అంత ఈజీగా నమ్మడం లేదు. ఈ కేసులో ఎవరూ ఊహించని మరో ట్విస్ట్ ఏమిటంటే.. తనను రియాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ బెదిరిస్తున్నారని సిద్ధార్థ్ పితానీ ముంబై పోలీసులకు ఈమధ్యనే మెయిల్ షేర్ చేసాడు. దీంతో సుశాంత్ కేసు చాలా మలుపులు తిరిగేలా కనబడుతుంది. సిద్ధార్థ్ పితానీ పేరు కూడా సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది. మొత్తానికి సుశాంత్ కేసులో అసలేం జరిగింది.? అనే అంశంపై సిద్ధార్థ్ నోరు విప్పితే కానీ అసలు నిజాలు బయటికి రావంటున్నారు బీహార్ పోలీసులు.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.