Connect with us

Featured

ఆర్జీవి సినిమాలు ట్రైలర్ చూసి ఆగిపోతేనే బెటర్…

Published

on

“నగ్నం” నిజంగా ఈ మూవీని చూసిన వాళ్ళెవరికైనా ఇది రామ్ గోపాల్ వర్మ సినిమాయేనా లేక బీగ్రేడ్ షార్ట్ ఫిల్మా.? అనే సందేహం కలగక మానదు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కరోనా టైంలో కూడా ప్రేక్షకుల బలహీతలను ఎలా క్యాష్ చేసుకోవాలో ప్లాన్ చేసి విడుదల చేసిన చిత్రమే “నగ్నం” అని తెలిసిపోవడంతో ఆర్జీవి ఎంతగా దిగజారిపోయాడో చెప్పడానికి ఈ చిత్రం మరో ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. దీన్ని సినిమా అనడం కన్నా షార్ట్ ఫిలిం అనడమే బెటర్. ఎందుకంటే కేవలం 22 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను బాహుబలి రేంజ్ లో పబ్లిసిటీ చేసి సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నంలో జనాలకు మరోసారి నరకం చూపించాడు ఆర్జీవి.

శ్రేయాస్ మీడియా, ఆర్జీవి సంయుక్తంగా ఓటీటీలో విడుదల చేసిన ఈ సినిమా ప్రారంభం నుండి శుభం కార్డ్ వరకూ మన జేబులో నుండి అనవసరంగా రెండొందలు ఖర్చు పెట్టామనే ఫీలింగే కలుగుతుంది. సాధారణంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలలో కేవలం ట్రైలర్ మాత్రమే బాగుంటుంది. ఆ ట్రైలర్ లో ఉన్నదే సినిమా అంతా ఉంటుంది కానీ ప్రత్యేకంగా కధేమీ వుండదనే రిమార్క్ ఉంది. గతంలో K.s.d అప్పలరాజు వంటి చాలా సినిమాలతో అది నిజమని నిరూపించుకున్న ఆర్జీవీ, ఈసారి నగ్నం చిత్రంతో మరోసారి ఆ రిమార్క్ ను తన సొంతం చేసుకున్నాడు.

ఒక ఇంట్లో జరిగిన ఓ అక్రమ సంబంధం కథతో సినిమాను మొత్తం చుట్టేశాడు వర్మ. ఇంత నీచాతినీచమైన పరమ చెత్త కథను, ఇంత చెత్త ప్రొడక్షన్ వాల్యూస్ ను ఇప్పటివరకు వర్మ సినిమాల్లో మనం చూసి ఉండం. ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇలాంటి కథల్ని 90ల్లోనే షకీలా చేసేసింది. మల్లు మూవీస్ లో కూడా ప్రేక్షకులు చూసేశారు. నగ్నం సినిమాలో హీరోయిన్ ఎక్స్ పోజింగ్, కెమెరామెన్ ఫ్రేమ్స్ తప్పితే ఇంకేం కనిపించవు. కనీసం హీరోయిన్ కు నటించే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఎంతసేపూ ఆమె అందాల్ని చూపించడం, కవ్వించేలా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం వరకే స్వీటీని పరిమితం చేసేశాడు వర్మ. ఇక కెమెరా యాంగిల్స్ అయితే నరకమంటే ఎలా వుంటాయో అనుభవంలోకి తెస్తాయి.

హీరోయిన్ కు ఎక్కడెక్కడ కెమెరాలు పెట్టకూడదో ఆలోచించి మరీ అక్కడే ఫ్రేమ్స్ పెట్టి రీలన్నీ చుట్టేశాడు ఆర్జీవి. ఆఖరుకి కెమెరాలు కూడా తొంగి చూడలేని శరీర భాగాలను మొబైల్ తో చిత్రీకరించాడంటే నిజంగా వర్మ మెంటాలిటీని అర్థం చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే వర్మ పైశాచికత్వానికి, పీక్స్ లో అంగాంగ ప్రదర్శనకు మాత్రమే ఈ 22 నిమిషాల సినిమాను తీశారేమో అనిపిస్తుంది. 200 రూపాయలు టికెట్ పెట్టి ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాను డబ్బులు పెట్టి కొని చూసిన ప్రేక్షకులు తాము మోసపోయామని లబోదిబోమంటున్నారు. అదండి సంగతి.. చదివారుగా రామ్ గోపాల్ వర్మ పైశాచిక చిత్రం “నగ్నం” రివ్యూను.. మరి మీ జేబుకూ కూడా చిల్లు పడకుండా వుండాలంటే ట్రైలర్ చూసి మోసపోకండి.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Vijay Devarakonda: సినిమా సక్సెస్ కోసం పూజలు చేసిన ఫ్యామిలీ స్టార్… సక్సెస్ అయ్యేనా?

Published

on

Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. చివరిగా ఈయన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇక త్వరలోనే పరశురాం దర్శకత్వంలో నటించినటువంటి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతోంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో మంచి సక్సెస్ అందుకోవాలనే ఉద్దేశంలో విజయ్ దేవరకొండ ప్రత్యేక పూజలను చేశారు ఈ క్రమంలోనే దిల్ రాజు ఆఫీస్ లో దర్శక నిర్మాతలు హీరోలతో కలిసి ప్రత్యేకంగా హోమాలు పూజలను చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

సినిమా విజయం కోసమే పూజలు..
ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమా సక్సెస్ కోసం విజయ్ దేవరకొండ ఇలాంటి పూజలు చేయించారని అయితే ఈ పూజలు సక్సెస్ అయ్యి తన సినిమా మంచి విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి అప్డేట్స్ ఈ సినిమా పై భారీ స్థాయిలోనే అంచనాలు పెంచాయి.

Advertisement
Continue Reading

Featured

Siddharth -Aditi: రహస్యంగా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన అదితి సిద్ధార్థ్?

Published

on

Siddharth -Aditiy: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో
సిద్ధార్థ్ అదితి రావు హైదరి జంట ఒకటి. వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరూ కలిసి అవే భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాలో కలిసిన నటించారు. ఇక ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు..

ఇక వీరిద్దరూ కలిసి ముంబైలో సహజీవనం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి జంటగా వెళ్లారు. అయితే వీరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ వీరు మాత్రం ఎప్పుడూ కూడా తమ రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు. ఇలా రహస్యంగా తమ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి ఈ జంట ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.

ఇలా ముంబైలో సహజీవనం చేస్తున్నటువంటి ఈ జంట తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాథ స్వామి ఆలయ మండపంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో వీరి వివాహ వేడుక హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారనే వార్త వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతారు.

Advertisement

తెలంగాణలో వివాహం..
రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తున్నారు అయితే ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరికీ ఇది మొదటి వివాహం కాదని వీరిద్దరికీ ఇది రెండో వివాహమనే చెప్పాలి ఇప్పటికే వీరిద్దరూ పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటూ తిరిగి రెండో పెళ్లి చేసుకున్నారు.

Advertisement
Continue Reading

Featured

Pallavi Prashanth: ఖైదీలందరూ అలా మాట్లాడేవారు.. జైలు జీవితం పై పల్లవి ప్రశాంత్ కామెంట్స్!

Published

on

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. ఒక సాధారణ రైతుబిడ్డగా పొలం పనులు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయన ఎన్నో రకాల వీడియోలు చేస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఇలా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయనకు బిగ్ బాస్ అవకాశం రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. హౌస్ లోకి అడుగు పెట్టినటువంటి ప్రశాంత్ అనంతరం విన్నర్ గా బయటకు వచ్చారు.

ఇక గ్రాండ్ ఫినాలే రోజు ఈయన అభిమానులు చేసిన హంగామా గురించి మనకు తెలిసిందే. పెద్ద ఎత్తున కార్లు ధ్వంసం చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేయడంతో ఈయనపై కేసులు పెట్టి జైలుకు పంపించారు. అయితే బెయిలు మీద బయటకు వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ తన రెండు రోజుల జైలు జీవితం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాను రెండు రోజులపాటు జైలులో చాలా ఇబ్బంది పడ్డాను అని తెలిపారు. బాధతో భోజనం కూడా చేయలేదని కానీ తోటి ఖైదీలు చెప్పడంతో భోజనం చేశానని జైలు కూడు బాగుందని తెలిపారు. నన్ను వీఐపీ ఇలా ట్రీట్ చేసిన లేక సాధారణంగా ట్రీట్ చేసిన కూడా అక్కడ భోజనం బాగుందని ఈయన వెల్లడించారు. ఇక ఖైదీలు అందరూ కూడా నాతో మాట్లాడుతూ బిగ్ బాస్ గురించి ప్రశ్నలు వేసే వాళ్ళు విన్నర్ ఎవరంటూ కూడా అడిగేవారు.

Advertisement

బిగ్ బాస్ గురించి అడిగేవారు..
ఇక నేను వెళ్ళిన తర్వాత జైలుకు వచ్చిన వారు బయట జరిగిన గొడవ గురించి తెలిపే వారని ప్రశాంత్ తెలిపారు. అయితే నేను జైలులో ఉంటే ఏ మాత్రం భయపడలేదు నేను తప్పు చేయలేదు అందుకే ఎవరికి భయపడలేదని కానీ నాపై విమర్శించిన వారికి కూడా అదే గతే పడుతుంది అంటూ ఈ సందర్భంగా జైలు జీవితం గురించి ప్రశాంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!