నితిన్, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం “భీష్మ” మహా శివరాత్రి కానుకగా ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొంత కాలంగా సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్.. మరో పక్క ఫుల్ కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ అభిమానులు… మరి నితిన్ తాజా చిత్రం “భీష్మ” అటు అభిమానులు ఇటు నితిన్ ల దాహం తీర్చిందా?? అవుననే అంటున్నారు. నితిన్ గట్టిగానే హిట్ కొట్టాడట. “ఛలో” సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై విమర్శకుల ప్రసంశలు అందుకుని తన సత్తా చాటుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి డైరెక్టర్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇదివరకే రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా హీరో నితిన్, హీరోయిన్ రష్మిక తో కలిపి ఈ చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. ఇప్పటికే యూ ఎస్ లో ప్రీమియర్ షోలు చూసేసారు అక్కడి ప్రేక్షకులు. ఈ చిత్రం చుసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలూ వెల్లడిస్తున్నారు. సినిమా చాలా బాగుందని , కామెడీ అయితే చింపేసాడని ట్వీట్ చేస్తున్నారు.
Advertisement
ఫస్టాఫ్ గురించి చెబుతూ.. భీష్మ బొమ్మ అదిరిందట. ఫస్టాఫ్ మొత్తం కామెడీ ట్రాక్ నడిచిందట. “గుండెజారి గల్లంతయిందే” సినిమా తరువాత నితిన్ ఆ రేంజ్ కామెడీ చేయడం ఇదే అంటున్నారు. ఇంటర్వెల్ లో అద్భుతమైన ట్విస్ట్ కూడా ఉంటుందట. అవుట్ అండ్ అవుట్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడని. బోర్ అనే ఫీల్ లేకుండా సరదా సరదాగా సాగిపోయే సన్నివేశాలతో దర్శకుడు ఫస్టాఫ్ నడిపించాడట. చాలా రోజుల తరువాత నితిన్ కు కరెక్ట్ రోల్ దొరికిందని అంటున్నారు. తన క్యారెక్టర్ తో నితిన్ అదరకొట్టేసాడని అంటున్నారు.
#Bheeshma First Half 👍👍 Another Gundejaari range movie.
A sigh of relief to @actor_nithiin after longtime. Hope he enjoys his wedding time more Happily 🤗🤗— Mirchi Bajji (@THEMIRCHIBAJJI) February 20, 2020
Entertaining first half with good intervel twist. Comedy and Nithin characterization 👍. Screenplay better ga handle chesundali. Still timepass stuff so far. #Bheeshma— SADDY (@king_sadashiva) February 21, 2020
#Bheeshma 😁👌👌 Super first half HIT pakka despite 2nd half— Manoj Ane Nenu (@DHFM_endlessly) February 21, 2020
ఇక సెకెండ్ హాఫ్ అసలు కథలో కి ప్రవేస్తారట. కొంచెం లాగ్ అనిపించినా దాన్ని కామెడీతో, కమర్షియల్ స్టఫ్ తో కవర్ చేసారని తెలుస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా అదిరిపోయిందని. మంచి ఎంటర్టైనింగ్ మూవీ అని ట్వీట్లు చేస్తున్నారు. వెన్నెల కిశోర్ కామెడీ సినిమాకి హైలైట్ అంటున్నారు. ఇక హీరోయిన్ రష్మిక కూడా తన పాత్రకి తగిన న్యాయం చేసిందని, డైరెక్టర్ వెంకీ కుడుముల సింగల్ లైన్ డైలాగ్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. “అక్కకి లేక అడుక్కుతింటుంటే.. చెల్లి వచ్చి చికెన్ కావాలందట” ఇలాంటి డైలాగ్స్ థియేటర్లో అరుపులు పుట్టించాడట.
#Bheeshma laughed a lot after long time 👍🏼👏👏 .. best entertainer @VenkyKudumula direction ✍️👏 @actor_nithiin was really impressed with his timing comedy and matured acting.. BGM is plus “chemical food fattu.. organic food hittu.. thelusukovalante Bheeshma Ticket Kottu” 3.25/5— radha krishna (@radhacute) February 21, 2020
Okay then… Commercial film with good comedy scenes
BAN,Maharshi,AD ivi 3 mix chesar ani talk occhina kuda…Easy ga Box Office hit. B’coz, Commercial with comedy elements…
So easy ga Breakeven aipoddi 👍… Dry season lo commercial 👍#Bheeshma— Pokiri (@Karl_marx_07) February 20, 2020
భీష్మ సినిమా కొన్ని గత సినిమాలను గుర్తు చేసినా కూడా డైరెక్టర్ వెంకీ కుడుముల తనదైన శైలిలో కామెడీ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ గుప్పించి చూసే ప్రేక్షకులకు ఎక్కడా బోర్ అనిపించకుండా చేసాడని టాక్. స్టోరీ లైన్ కాస్త వీక్ అని అనిపించినా… అది పెద్దగా సినిమా ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులు అది మర్చిపోయేలా ఉందని అంటున్నారు. మొత్తానికి “భీష్మ” సినిమాతో డైరెక్టర్ గా వెంకీ కుడుముల, హీరోగా నితిన్ హిట్ కొట్టారని అంటున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చి పెట్టె సినిమా అని అంటున్నారు.
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.
ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.
Advertisement
ఇష్టమైన ఫుడ్ తింటారు.. ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.
Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
Advertisement
పార్టీలకు వెళ్లడం మానుకున్న.. ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Advertisement
క్విజ్ కాంటెస్ట్.. ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.