Connect with us

Featured

బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం.. ఊహకందని కంటెస్టెంట్ లు.. భారీ స్థాయిలో మార్పులు జరిగింది ఇవే!

బుల్లితెరలో బిగ్ బాస్ సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం తెలుగు బిగ్ బాస్ ముందు వాలిపోయారు. ఈరోజు 6 గంటలకు ప్రారంభమైన ఈ షోకు

Published

on

బుల్లితెరలో బిగ్ బాస్ సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం తెలుగు బిగ్ బాస్ ముందు వాలిపోయారు. ఈరోజు 6 గంటలకు ప్రారంభమైన ఈ షోకు క్షణంలోనే రేటింగ్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న బుల్లితెర అభిమానులకు ఎవరెవరు బిగ్ బాస్ లో పాల్గొంటున్నారని తెగ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు కొందరు పాల్గొనగా బిగ్ బాస్ హౌస్ లో సందడి, రచ్చ మొదలైంది. ఈ సీజన్ భారీ బడ్జెట్ తో పాటు హౌస్ లో చాలా మార్పులు కూడాచేశారు.

ఇక నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 నుండి హోస్టింగ్ చేస్తూనే ఉన్నాడు. తన హోస్టింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోగా మంచి ఆదరణ కూడా లభించింది. దీంతో సీజన్ 4,5 లను కూడా నాగార్జుననే హోస్టింగ్ చేస్తున్నాడు.

ఇక ఇందులో ఫస్ట్ కంటెస్టెంట్ గా యాంకర్, బుల్లితెర నటి సిరి హనుమంత ఎంట్రీ ఇవ్వగా బాగా సందడి చేసింది.

రెండవ కంటెస్టెంట్ గా మరో బుల్లితెర నటుడు సన్నీ కూడా ఎంట్రీ ఇచ్చి తన మాటలతో అందర్నీ ఆకట్టుకున్నాడు.

ఇక మూడో కంటెస్టెంట్ గా లహరి షేరి కూడా ఎంట్రీ ఇచ్చి నాగార్జునను ప్రపోజల్ చేసి ఫిదా చేసింది.

నాలుగో కంటెస్టెంట్ గా సింగర్ శ్రీ రామచంద్ర బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి తన పాటలతో అందరినీ తన వైపు లాక్కున్నాడు.

ఇక ఐదవ కంటెస్టెంట్ గా డాన్స్ మాస్టర్ అని అడుగు పెట్టి తన డాన్స్ తో ఫిదా చేసింది.

ఆరో కంటెస్టెంట్ గా లోబో అడుగు పెట్టాడు. అంతేకాకుండా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన క్షణం లోనే అందరితో బాగా క్లోజ్ అయ్యాడు.

ఇక ఏడో కంటెస్టెంట్ వెండితెర నటి ప్రియా అడుగు పెట్టి ఎంతో సున్నితంగా ఆకట్టుకుంది.

ఎనిమిదో కంటెస్టెంట్ గా మోడల్ జెస్సి అడుగుపెట్టి తను స్టైల్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

తొమ్మిదో కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఆర్టిస్ట్ ట్రాన్స్ జెండర్ ప్రియాంక అడుగు పెట్టి తన అందంతో, మాటలతో బాగా ఆకట్టుకుంది.

పదో కంటెస్టెంట్ గా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ అడుగు పెట్టాడు. తన సైలెంట్ మాటలతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

పదకొండవ కంటెస్టెంట్ గా హమిద బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

పన్నెండవ కంటెస్టెంట్ గా డాన్సర్ నటరాజ్ హౌస్ లోకి అడుగు పెట్టి తమ పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకున్నారు.

పదమూడవ కంటెస్టెంట్ గా యూట్యూబ్ స్టార్ బోల్డ్ బ్యూటీ సరయు అడుగు పెట్టింది. తన భాషతో, మాటలతో నాగార్జుననే ఫిదా చేసింది.

పద్నాలుగవ కంటెస్టెంట్ గా నటుడు, కండలవీరుడు విశ్వ హౌస్ లోకి అడుగు పెట్టాడు.

పదిహేనవ కంటెస్టెంట్ గా బుల్లితెర నటి ఉమాదేవి అడుగు పెట్టింది.

పదహారవ కంటెస్టెంట్ గా బుల్లితెర నటుడు మానస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

పదిహేడవ కంటెస్టెంట్ ఆర్జే కాజల్ ఎంట్రీ ఇచ్చింది. తన గడగడ మాటలతో బాగా ఆకట్టుకుంది.

పద్దెనిమిదవ కంటెస్టెంట్ గా శ్వేతా వర్మ ఎంట్రీ ఇచ్చి తన పరిచయాన్ని మరింత పెంచుకుంది.

ఇక పంతొమ్మిదవ కంటెస్టెంట్ గా యాంకర్ రవి ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!