బాలీవుడ్ ధోనీగా ప్రసిద్ధి చెందిన యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి నెల రోజులు గడుస్తున్నా.. ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఆయన ధ్యాసలోనే ఉన్నారు. తమ అభిమాన నటుడు ఎందుకు చనిపోయాడా.? అనే సందేహాలకు సరైన సమాధానం దొరకక సతమతమౌతున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ చక్కని నటుడు మాత్రమే కాదు స్టూడెంట్ నెం.1 కూడా.! అతను దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం నిర్వహించిన AIEEE పరీక్షలో ఆల్ ఇండియా టాప్ 7 వ ర్యాంకర్, ఆ తర్వాత తన కలలను నెరవేర్చుకోవడానికి 4వ సంవత్సరంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. పాట్నాలో జన్మించిన సుశాంత్ కు నలుగురు సోదరీమణులు. అతను వారి ఏకైక సోదరుడు. అతని తండ్రి ప్రభుత్వ అధికారి. అతను 12వ తరగతి చదువుతున్నప్పుడు తల్లిని కోల్పోయాడు. తన సోషల్ మీడియా పేజీలలో అప్పుడప్పుడు తన తల్లి కోసం ఎమోషనల్ మరియు హార్ట్ టచింగ్ పోస్టులను పోస్ట్ చేస్తూ ఉంటాడు, ఈ పోస్టులు సుశాంత్ తన తల్లిని ఎంతగా మిస్ అవుతున్నాడో తెలియ జేస్తుండేవి. సుశాంత్ ను బుల్లితెరకు పరిచయం చేసింది పవిత్ర రిష్టా అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ‘కిస్ దేశ్ మె హై దిల్ మేరా’ సీరియల్లో ప్రీత్ జునేజా పాత్రతో సుశాంత్ తన నటనా జీవితాన్ని ప్రారంభించాడన్న సంగతి చాలామందికి తెలియదు.
ప్రముఖ నటుడు షియామాక్ దావర్ మరియు ఆష్లే లోబో బృందంతో కలిసి నృత్య కార్యక్రమాలలో పాల్గొనే వాడు, అలన్ అమిన్ నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ప్రఖ్యాత దర్శకుడు మోహిత్ సూరికి తన చిత్రం రాజ్ 2 షూటింగ్ సందర్భంగా ఆర్థిక సాయం చేశాడు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ గత నెల 14న ఆయన తన ఇంట్లోనే బలవాన్మరనానికి పాల్పడ్డారు. సుశాంత్ మరణాన్ని అతని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. హీరోగా మంచి కెరీర్ ను వదిలేసి ఇలా అర్ధాంతరంగా చనిపోవాల్సిన అవసరం సుశాంత్ కు లేదని.. ఆయన్ని ఎవరో పక్కా ప్లాన్ ప్రకారమే చంపేసారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ సుశాంత్ నిజంగానే సూసైడ్ చేసుకుని ఉంటే ఎందుకు ఈ కేసులో సాక్ష్యాధారాలను ప్రజల ముందుకు తీసుకురావడం లేదని గట్టిగానే అడుగుతున్నారు ఫ్యాన్స్.
ఈ క్రమంలోనే సుశాంత్ ఆత్మతో సంప్రదించాలని ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్ స్టీవ్ హుఫ్కు కొద్దిరోజులుగా ఫ్యాన్స్, నెటిజన్లు ఈ- మెయిల్స్, మెసేజ్స్ పంపడంతో ఆయన.. జూలై 13వ తేదీన ఆస్ట్రల్ డోర్ వే సహాయంతో సుశాంత్ ఆత్మను సంప్రదించాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను తన ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్లో కూడా షేర్ చేశాడు. అందులో స్టీవ్ పలు ప్రశ్నలను సంధించాడు. ఆ వీడియోలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ”సుశాంత్ నన్ను గుర్తుపట్టారా” అని స్టీవ్ అడగడం, దానికి ఎస్ఎస్ఆర్, “మీరు నన్ను అనుమతించారు” అని సమాధానం చెప్పడంతో ఈ వీడియో మొదలవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ లో మాత్రం మరిన్ని సందేహాలు రెట్టింపయ్యాయి.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.