Connect with us

Featured

నువ్వు మొగాడ్రా బుజ్జి… విజ్రింబిస్తున్న బైరెడ్డి సిద్దార్థ రెడ్డి హవా!!

Published

on

బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి.. ఈ పేరు గత కొన్ని నెలలుగా నందికొట్కూరు నియోజకవర్గం లో హాట్ టాపిక్.. తాత వారసత్వం పెదనాన్న రాజకీయం ఒంట పట్టించుకోని 19 ఏళ్లకే రాజకీయ రంగప్రవేశం చేసాడు. అడుగడుగునా కరుడుగట్టిన కుయుక్తులతో నలుదిక్కుల పెను సవాళ్లు విసురుతున్న సొంత పెదనాన్న చిన్న పిల్లకాయ అంటూ తీసి పారేసిన తన పార్టీలోనుండి అధికారం కోసం కుట్రలు పన్నుతున్న జనం మాత్రం సిద్దార్థవెంటనే ఉన్నారు ..ఈ విషయం ఇప్పుడు జగన్ కి కూడా తెలిసింది. అందుకే నందికొట్కూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆర్థర్ ఉన్నప్పటికీ పార్టీ పగ్గాలు పాలనా వ్యవహారాలు సిద్ధార్థ చేతిలోనే పెట్టాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

నిన్న మొన్నటి వరకు టీడీపీ పార్టీ తోనే సిద్ధార్థకు గొడవలు అనుకున్నప్పటికీ, నియోజకవర్గంలో పట్టుకోసం సొంత పార్టీ ఎమ్మెల్యే ఆర్థర్ సిద్ధార్థరెడ్డి పై పోరు ప్రారంభించాడు. ఒకే పార్టీ లో ఉన్న ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారయ్యింది. ఒక అధికారి బదిలీ దగ్గర మొదలైన గొడవ చిలికి చిలికి ఎక్కడి వరకు వెళ్ళింది అంటే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇద్దరి మధ్య గొడవలు లేవు అని నిరూపించాల్సి వచ్చింది. కానీ పరిస్థితి చేయిజారిపోకముందే బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మేల్కొన్నాడు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదు అలాగే భవిష్యత్తులో ఆర్థర్ కి కళ్లెం వేయాలంటే ఏం చేయాలో అది చేసి చూపించాడు.

ప్రస్తుతం బైరెడ్డి కేవలం నందికొట్కూరు వైసీపీ పార్టీ ఇంచార్జిగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. ఒక్క ఎస్సీ నియోజకవర్గం కాబట్టే ఎమ్మెల్యే సీట్ ఆర్థర్ కి వెళ్ళింది అనే విషయం అందరికి తెలిసిందే. అందుకే తన మాట జవదాటని ఎస్సీ కాండిడేట్స్ ని నందికొట్కూరు లో రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా దింపడం ప్రారంభించాడు బైరెడ్డి. ప్రణాళికలో భాగంగా మొదట టీడీపీ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే ఐజయ్యను వైసీపీ పార్టీలో చేర్చుకోవడంతో కేవలం ఆధిపత్యం కోసం ఆర్థర్ వేసిన ప్రణాళికలు ఫలించగా పోగా వచ్చే ఎన్నికల్లో తన సీట్ కె ఎసరు పెట్టిన విషయం అర్ధం అయినట్టు ఉంది.

టెక్నీకల్ గా ఎమ్మెల్యే ఆర్థర్ అయినప్పటికీ సిద్దార్థ రెడ్డి చేతికే అన్ని బాధ్యతలు ఇచ్చినట్టు అర్ధం అయ్యింది. అంతే కాదు వైస్ జగన్ సొంత సామజిక వర్గానికి చెందిన వాడు కావడం తో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి పూర్తి సపోర్ట్ దొరికింది. ఇక ఐజయ్య ఎంట్రీ తో కస్సుబుస్సు మన్న ఆర్థర్ ఇప్పుడు నందికొట్కూరు కి సంబంధించి కేవలం నెంబర్ 2 గానే ఉండాల్సిన పరిస్థితి. ఇక సర్దుకుపోవడం తప్ప మరొక దారి లేదు. తోక జాడిస్తే కట్ చేయడానికి అటు బైరెడ్డి ఇటు జగన్ రెడ్డి సిద్ధంగా ఉండటం తో వానపాము మాదిరి తయారయ్యింది ఆర్థర్ పరిస్థితి. కానీ ఈ పరిస్థితి కొంత వైసీపీ పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు. ఆర్థర్ అనుచరులు కూడా అవకాశం కోసం వేచి చూస్తున్నారు. ఇవేమి పట్టించుకోకుండా జగన్ సపోర్ట్ దొరకడంతో బైరెడ్డి సైతం స్థానిక ఎన్నికల్లో తన దూకుడు పెంచి పార్టీ ని గెలిపించే పనిలో ఉన్నారు.

మరో వైపు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురు శబరీ సైతం బీజేపీ పార్టీ నుండి సొంత తమ్ముడివైపు బాణం లా దూసుకస్తుంది. ప్రస్తుతానికి అయితే బైరెడ్డి సిద్దతరెడ్డి కి గట్టిగా గాలి వీస్తుంది మరి అయన సత్తా స్థానిక ఎన్నికల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఏది ఏమైనా నియోజకవర్గ ప్రజలు మాత్రం వీడు అస్సలు సిస్సలైన మొగాడు అనుకుంటున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!