Connect with us

Featured

చందమామ సినిమాలో హీరోయిన్ ఎంత మారిపోయింది చూస్తే అస్సలు నమ్మలేరు…!!

Published

on

కృష్ణవంశీ దర్శకత్వం వహించిన చందమామ సినిమా ఎవరైనా మర్చిపోగలరా.. కాజల్ సింధు మీనన్ నటనతో మరియు అందాలతో సినిమా సూపర్ హిట్ అయ్యిందండంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ సినిమాలో కాజల్ ని మించి సింధు మీనన్ నాభి అందాలతో పెర్ఫార్మ్ చేసి మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా మినహా మిగతా అన్ని సినిమాల్లో హోమ్లీ పాత్రల్లో నటిస్తూ పక్కింటి అమ్మాయి లాగ కనిపించింది సింధు మీనన్.

1994లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రష్మీ అనే కన్నడ సినిమా పరిశ్రమలో కెరీర్ మొదలు పెట్టిన సింధు నలభై వరకు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ కన్నడ, మలయాళీ సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు అన్ని భాషలు అలవోకగా మాట్లాడగలదు. స్వతహాగా మలయాళీ అయినా పుట్టి పెరిగింది మాత్రం బెంగుళూరు లోనే. చదువులు కూడా అక్కడే పూర్తి చేసిన సింధు 2001 లో భద్రాచలం సినిమాతో తెలుగు సినిమాలో అడుగుపెట్టింది. ఈ సినిమా విడుదల అయినా సమయానికి సింధుకి కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. ఈ సినిమా విడుదల అవ్వడానికి ముందే కన్నడలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది. 13 ఏళ్ళ వయసులోనే నాలుగు కన్నడ సినిమాల్లో నటించింది. భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం ఉన్న సింధు చిన్ననాటి నుండి నాట్యంలో శిక్షణ తీసుకుంది.

సింధుని ఒక ప్రోగ్రాం లో చుసిన జడ్జి ఒక దర్శకుడికి పరిచయం చేసి హీరోయిన్ గా మొదటి సినిమా ఆఫర్ ఇప్పించాడు. ఇక కొన్నేళ్ల పాటు సినిమాల్లో బిజీ గా ఉన్న సింధు ఆ తర్వాత మన తెలుగు అబ్బాయి అయినా డొమినిక్ ప్రభుని అనే ఒక టెక్కీ ని ఏప్రిల్ 2010 లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. చివరగా తెలుగులో సుభద్ర అనే సినిమాలో నటించి నటన కు గుడ్ బాయ్ చెప్పేసింది. ఇప్పుడు లండన్ లో సెటిల్ అయ్యి ఇద్దరు పిల్లలకు జన్మ ఇచ్చింది. ఒక బాబు మరియు ఒక పాపా.. ఆమె పేరు స్వెత్లానా. కానీ ఇప్పుడు మునపటి తన రూపంలో చాల మార్పులు వచ్చి గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉంది.

ఇక పెళ్లయ్యాక అనుకోకండా ఒక చీటింగ్ కేసులో కూడా ఇరుక్కుంది సింధు. సింధు మీనన్ సోదరుడు బెంగుళూరు లో ని బ్యాంకు అఫ్ బరోడాలో ముప్పై లక్షల అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో పూచీకత్తుగా ఉన్న సింధుపై అలాగే మనోజ్ పై కేసు నమోదు చేసారు పోలీసులు. ఇక అప్పు కోసం తనఖా పెట్టిన పత్రాలు సైతం నకిలీవి అని తేలడంతో ఇదే కేసు విషయమే సింధుని సైతం ఇండియాకి రప్పించారు. కానీ విషయం ఆ తర్వాత సర్దుమణగడంతో తిరిగి లండన్ వెళ్ళిపోయింది సింధు.

సినిమాల్లో అవకాశాల తగ్గాక కొన్ని సీరియల్స్ లోను టీవీ షోస్ లో నటించి హోస్ట్ చేసిన సింధు 2012 తర్వాత ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు. కేవలం ఫ్యామిలికి మాత్రమే ప్రియారిటీ ఇస్తూ ఒక్క టీవీ షో లో కూడా కనిపించలేదు. చివరగా శ్రీమాన్ శ్రీమతి అనే పాపులర్ తమిళ టీవీ షోకి ప్రొడ్యూసర్ గా మరియు హోస్ట్ గా వ్యవహరించింది. ఈ షో అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఇక సింధు తమ్ముడు కార్తీక్ VJ గా పనిచేసి ‘సుకుమార’, వండర్ వరల్డ్, లిఫ్ట్ కోడ్ల వంటి కన్నడ సినిమాల్లో హీరోగా నటించాడు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!