ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయంతో జనాలు థమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని గడగడలాడుతున్నారు. ఈ నేపధ్యంలో కరోనాని నివారించే ప్రయత్నంలో భాగంగా విదేశాలు సైతం లాక్ డౌన్ను అమలు చేస్తున్నాయన్న సంగతి తెలిసిందే.! ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా జనాలందరూ ఇంటి దగ్గరే ఉంటూ ఒక్కొక్కరు ఒక్కోవిధంగా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక సెలెబ్రిటీల విషయానికొస్తే వంటింట్లో చేరి క్రొత్త క్రొత్త వంటలపై ప్రయోగాలు చేయడం మొదలు పెట్టారు. మరికొందరైతే పెయింటింగ్, డ్రాయింగ్, జిమ్ అంటూ బిజీబిజీగా గడిపేస్తున్నారు.
ఇవన్నీ ప్రక్కన పెట్టి మన టాలీవుడ్ దర్శకుడు తేజపై ఫోకస్ పెడితే అతను మాత్రం అందరి కంటే భిన్నంగా సినిమా ఫీల్డ్కి ఏమాత్రం సంబంధం లేని ఓ క్రొత్త కోర్స్ ని అభ్యసిస్తున్నాడు. ఈమధ్యనే ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన ఓ ఆన్ లైన్ కోర్స్ లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కోర్స్ని అందిస్తుంది. కరోనా వైరస్ వ్యాధిని స్టడీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కోర్స్లో జాయినైనట్టు మీడియా ప్రతినిధులకు తెలిపాడు. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా లాంటి భయంకరమైన అంటువ్యాధులు జనాలపై దాడి చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, భవిష్యత్ లో ఇలాంటి ఊహించని పరిణామాలకు మానశికంగా ఎలా సిద్దంగా ఉండాలో ఈ కోర్స్ ద్వారా తెలుసుకోబోతున్నట్టు, ఈ ప్రయత్నంలో భాగంగా ఒకవేళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోరితే తాను వాలంటర్గా పనిచేయడానికి కూడా సిద్దమేనని తెలియజేశాడు.
ఈ సందర్భంగా తేజ ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలో ప్రస్తుతం నెలకొని వున్న కరోనా పరిణామాలపై తనదైన శైలిలో స్పందించాడు. కరోనా మహమ్మారిపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఏదైనా వున్నదున్నట్టుగా కుండబ్రద్ధలు కొట్టినట్లుగా మాట్లాడే తేజ.. కరోనా మహమ్మారి ఇంతిలాగ విజృంభించడానికి ముఖ్యంగా మన దేశ ప్రజల నిర్లక్ష్యమేనని ఆవేదన చెందాడు. ప్రజల ఆలోచనా విధానంలోనూ, వారి ప్రవర్తనలోనూ మార్పు వచ్చి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనాని కట్టడి చేయగలమని, అలా చేయకుండా నిర్లక్ష్యంగా వుంటే రానున్న రోజుల్లో రోజుకి లక్ష పాజిటివ్ కేసులు వచ్చినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదని తేజ తెలియజేశాడు.
ఇంతవరకూ ప్రపంచవ్యాప్తంగా కరోనాకి సంబంధించిన కేసుల జాబితాలో 11వ స్థానంలో ఉన్న భారత్ ఈ 2 వారాల్లోనే 4వ స్థానంలోకి వచ్చిందని.. నేటికీ ప్రజల జీవన వైఖరిలో మార్పు రాకపోతే ఆ లెక్క కోటి దాకా వెళ్లడం ఖాయమంటూ బల్లగుద్ది చెప్పాడు తేజ. కరోనాను అరికట్టాలంటే, వైరస్ నివారణలో భాగంగా ప్రజల జీవన వైఖరిలో ఖచ్చితంగా మార్పు రావాల్సిందేనని తెలియజేశాడు. ఇక తేజ వృత్తిపరంగా ప్రస్తుతం ‘అలిమేలు మంగ వెంకట రమణ’, ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే 2 సినిమాల నిర్మాణంలో తలమునకలై వున్నాడు. మరి ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న తేజ కామెంట్స్ పై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.