Connect with us

Featured

కరోనాకు చెక్ పెట్టాలంటే అది ఒక్కటే మార్గం… – డైరెక్టర్ తేజ !!

Published

on

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయంతో జనాలు థమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని గడగడలాడుతున్నారు. ఈ నేపధ్యంలో కరోనాని నివారించే ప్రయత్నంలో భాగంగా విదేశాలు సైతం లాక్ డౌన్‌ను అమలు చేస్తున్నాయన్న సంగతి తెలిసిందే.! ప్రస్తుతం లాక్ డౌన్‌ సందర్భంగా జనాలందరూ ఇంటి దగ్గరే ఉంటూ ఒక్కొక్కరు ఒక్కోవిధంగా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక సెలెబ్రిటీల విషయానికొస్తే వంటింట్లో చేరి క్రొత్త క్రొత్త వంటలపై ప్రయోగాలు చేయడం మొదలు పెట్టారు. మరికొందరైతే పెయింటింగ్, డ్రాయింగ్, జిమ్ అంటూ బిజీబిజీగా గడిపేస్తున్నారు.

ఇవన్నీ ప్రక్కన పెట్టి మన టాలీవుడ్ దర్శకుడు తేజపై ఫోకస్ పెడితే అతను మాత్రం అందరి కంటే భిన్నంగా సినిమా ఫీల్డ్‌కి ఏమాత్రం సంబంధం లేని ఓ క్రొత్త కోర్స్ ని అభ్యసిస్తున్నాడు. ఈమధ్యనే ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన ఓ ఆన్ లైన్ కోర్స్ లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కోర్స్‌ని అందిస్తుంది. కరోనా వైరస్ వ్యాధిని స్టడీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కోర్స్‌లో జాయినైనట్టు మీడియా ప్రతినిధులకు తెలిపాడు. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా లాంటి భయంకరమైన అంటువ్యాధులు జనాలపై దాడి చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, భవిష్యత్ లో ఇలాంటి ఊహించని పరిణామాలకు మానశికంగా ఎలా సిద్దంగా ఉండాలో ఈ కోర్స్ ద్వారా తెలుసుకోబోతున్నట్టు, ఈ ప్రయత్నంలో భాగంగా ఒకవేళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోరితే తాను వాలంటర్‌గా పనిచేయడానికి కూడా సిద్దమేనని తెలియజేశాడు.

ఈ సందర్భంగా తేజ ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలో ప్రస్తుతం నెలకొని వున్న కరోనా పరిణామాలపై తనదైన శైలిలో స్పందించాడు. కరోనా మహమ్మారిపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఏదైనా వున్నదున్నట్టుగా కుండబ్రద్ధలు కొట్టినట్లుగా మాట్లాడే తేజ.. కరోనా మహమ్మారి ఇంతిలాగ విజృంభించడానికి ముఖ్యంగా మన దేశ ప్రజల నిర్లక్ష్యమేనని ఆవేదన చెందాడు. ప్రజల ఆలోచనా విధానంలోనూ, వారి ప్రవర్తనలోనూ మార్పు వచ్చి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనాని కట్టడి చేయగలమని, అలా చేయకుండా నిర్లక్ష్యంగా వుంటే రానున్న రోజుల్లో రోజుకి లక్ష పాజిటివ్ కేసులు వచ్చినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదని తేజ తెలియజేశాడు.

ఇంతవరకూ ప్రపంచవ్యాప్తంగా కరోనాకి సంబంధించిన కేసుల జాబితాలో 11వ స్థానంలో ఉన్న భారత్ ఈ 2 వారాల్లోనే 4వ స్థానంలోకి వచ్చిందని.. నేటికీ ప్రజల జీవన వైఖరిలో మార్పు రాకపోతే ఆ లెక్క కోటి దాకా వెళ్లడం ఖాయమంటూ బల్లగుద్ది చెప్పాడు తేజ. కరోనాను అరికట్టాలంటే, వైరస్ నివారణలో భాగంగా ప్రజల జీవన వైఖరిలో ఖచ్చితంగా మార్పు రావాల్సిందేనని తెలియజేశాడు. ఇక తేజ వృత్తిపరంగా ప్రస్తుతం ‘అలిమేలు మంగ వెంకట రమణ’, ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే 2 సినిమాల నిర్మాణంలో తలమునకలై వున్నాడు. మరి ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న తేజ కామెంట్స్ పై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Magadheera: చరణ్ అభిమానులకు శుభవార్త.. థియేటర్లో రిలీజ్ కాబోతున్న.. ఎప్పుడో తెలుసా?

Published

on

Magadheera: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే తెలుగు థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ,రామ్ చరణ్,ఎన్టీఆర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అన్న వివరాల్లోకి వెళితే.. మగధీర సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్‌ బర్త్‌డే సందర్భంగా మగధీర చిత్రాన్ని 26న రీ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన మగధీర 2009 జూలై 30న విడుదలై, బ్లాక్‌ బస్టర్‌ హిట్ గా నిలిచింది.

రీ రిలీజ్‌..

Advertisement

దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్‌ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌బాబు రీ రిలీజ్‌ చేస్తున్నారు. మగధీర చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్‌ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి అని తెలిపారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌ బాబు.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: బోయపాటి డైరెక్షన్లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ఫిక్స్ చేసిన బాలయ్య?

Published

on

Mokshagna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఈయనకు వయస్సు మీద పడుతున్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక బాలయ్య వారసుడి రాక కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Mokshagna

మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి అభిమానులను ఊరిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు కానీ గత ఏడాది బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాది తన కుమారుడు సినీ ఎంట్రీ ఉంటుందని తెలిపారు.. ఇకపోతే మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం అవుతారన్న సందేహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకసారి అనిల్ రావిపూడి పేరు వినిపించగా మరోసారి బోయపాటి పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఇప్పటికే వీరిద్దరూ స్క్రిప్ట్ గురించి కూడా డిస్కషన్స్ పూర్తి చేశారని ఇక త్వరలోనే ఈ సినిమా పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య తన కొడుకు ఎంట్రీ బోయపాటి పైనే భారం వేసారని తెలుస్తోంది ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

బోయపాటి పైనే భారం..
ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా మరొక వార్త వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి టైం ఫిక్స్ చేశారని ఇక ఈయన బోయపాటి డైరెక్షన్ లోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. మాస్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ తన కుమారుడి మొదటి సినిమా కూడా ఇలాంటి యాక్షన్ టచ్ ఇస్తేనే బాగుంటుందని భావించినటువంటి బాలయ్య బోయపాటిని ఫిక్స్ చేశారట.

Advertisement
Continue Reading

Featured

Venkata Chaitanya: ప్రతి ఒక్కటి తిరిగి ఇచ్చేయాల్సిందే.. వైరల్ అవుతున్న నిహారిక మాజీ భర్త పోస్ట్!

Published

on

Venkata Chaitanya: జొన్నలగడ్డ వెంకట చైతన్య పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ నిహారిక మాజీ భర్తగా ఈయన ఎంత గుర్తింపు పొందారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె తన పెళ్లి విడాకులు అలాగే రెండో పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇందుకు కౌంటర్ గా తన మాజీ భర్త సైలెన్స్ సైలెన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన పరోక్షంగా నిహారికను ఉద్దేశిస్తూ తనకు కౌంటర్ ఇస్తూనే ఇలాంటి పోస్టులు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయినటువంటి చైతన్య తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

పాజిటివిటీని పెంచాలి..
చాలా రోజుల తర్వాత ఇలా మళ్లీ రాసుకు వస్తున్నాను. ఇంస్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయిన తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంచమైనా పాజిటివిటీని పెంచాలని అనుకుంటున్నాను అంటూ ఈయన పోస్ట్ చేయడంతో ఇది చూసినటువంటి నేటిజన్స్ కచ్చితంగా ఇది నిహారికను ఉద్దేశించి చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు విడిపోయిన సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ఇలా పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!