Connect with us

Featured

రావు గోపాలరావు అంత్యక్రియలకు టాలీవుడ్ స్టార్స్ అందరూ ఎందుకు డుమ్మా కొట్టారో తెలుసా?

గత మూడు దశాబ్దాల క్రితం సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన విలనిజాన్ని చూపించి ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందిన నటులలో రావుగోపాలరావు ఒకరు. అప్పట్లో

Published

on

గత మూడు దశాబ్దాల క్రితం సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన విలనిజాన్ని చూపించి ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందిన నటులలో రావుగోపాలరావు ఒకరు. అప్పట్లో తెరకెక్కిన దాదాపు ప్రతి చిత్రంలోనూ ఈయన కనిపించేవారు. విభిన్న పాత్రలో నటిస్తూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ పొందిన రావుగోపాలరావు మొదట్లో రంగస్థల నటుడిగా పేరు సంపాదించుకుని ఆ తరువాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

రావు గోపాలరావు జనవరి 14, 1937 కాకినాడ సమీపంలోని గంగనపల్లి లో పుట్టారు. ఆయనకు నటన పై ఉన్న ఆసక్తితో మెల్లిగా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలో నటించే అవకాశాలను దక్కించుకున్నారు. క్రాంతి కుమార్ నిర్మాణంలో ‘శారద’ సినిమాలో రావు గోపాల్ రావు నటించిన పాత్ర ఆయనకు ఎంతో పేరు సంపాదించిపెట్టింది. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందిన రావుగోపాలరావు ఆ తర్వాత బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముత్యాలముగ్గు’ సినిమాలో నటించారు. ఈ సినిమా తరువాత రావు గోపాలరావు తన కెరియర్లో ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఆర్థికంగా బాగా ఎదిగినప్పటికీ ముందుచూపు లేని కారణంగా ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకున్నారు. అందరిని నమ్మి పూర్తిగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న రావుగోపాలరావు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక ఉన్న డబ్బును కాస్తా చికిత్సకు ఖర్చు పెట్టేసారు.

అలా చికిత్స తీసుకుంటూనే 1994 ఆగస్టు 13న రావు గోపాలరావు మృతిచెందారు. ఈయన మృతి చెందినప్పటికీ చిత్ర పరిశ్రమ ఇంకా మద్రాసులోనే ఉంది. ఈ క్రమంలోనే ఆయన అంత్యక్రియలను నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది బడా నిర్మాతలు దర్శకులు ఉన్నప్పటికీ ఎవ్వరూ కూడా ఆయన భౌతికకాయానికి నివాళులర్పించిన పోవడం గమనార్హం.

అల్లు రామలింగయ్య, పి ఎల్ నారాయణ, రేలంగి నరసింహ రావు, నిర్మాత జై కృష్ణ వంటి కొందరు మాత్రమే ఈయన పార్థివదేహానికి నివాళులర్పించి ఈయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన కుమారులు రావు రమేష్, క్రాంతి తన తండ్రి పార్థివదేహానికి అగ్ని సంస్కారం జరుపుతున్న క్రమంలో ఆపండి అంటూ కొందరు తమిళ మిత్రులు అక్కడికి వచ్చారు. ఈ సమయంలో చుట్టూ చూసి ఇంకా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటూ తమిళంలో అడిగారట.. ఆ సమయంలో అక్కడే ఉన్న అల్లురామలింగయ్య వచ్చేవాళ్ళు ఎవరూ లేరని సమాధానానం ఇచ్చారట.

Advertisement

సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియ చేయకపోవడం ఎంతో బాధాకరం. ఇంత గొప్ప నటుడికి సాదాసీదాగా అగ్ని సంస్కారాలు చేయడం చాలా బాధగా ఉంది అంటూ ఆ తమిళ మిత్రులు ఈయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారట. అయితే అప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోవడం జరిగింది.. రావు గోపాలరావు అంత్యక్రియలు చెన్నైలో జరగడం కూడా ఒక రకంగా సినీ ప్రముఖులు వెళ్లలేకపోయారనే వాదన వినిపిస్తుంది. ఇక ఈయన వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి పెద్ద కుమారుడు రావు రమేష్ వచ్చారన్న సంగతి మనకు తెలిసిందే.

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!