శ్రీను వైట్ల డైరక్షన్ లో ఆకాష్ హీరోగా తెరకెక్కిన “ఆనందం” సినిమా అప్పట్లో యూత్ ఆడియెన్స్ కు బాగా నచ్చింది. ఆ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది కన్నడ కస్తూరి, అందాల ముద్దు గుమ్మ రేఖ వేదవ్యాస్. అప్పటికే రామోజీ రావు ప్రొడక్షన్ లో 2001 లో చిత్ర అనే ఒక కన్నడ సినిమా లో NRI గర్ల్ పాత్ర మాత్రమే చేసిన అనుభవం ఉన్న రేఖ “ఆనందం” సినిమాలో చాలా బాగా నటించింది. ఈ సినిమా విడుదల అయ్యి పదిహేనేళ్లు అయ్యింది. ఆ తర్వాత నందమూరి తారకరత్న హీరోగా డెబ్యూ మూవీ “ఒకటో నంబర్ కుర్రాడు” సినిమాలో ఆమె లక్కీ ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఆ మూవీలోని పాటలు ఇప్పటికి సూపర్ హిట్ అనిపిస్తాయి. అంతకుముందు “జాబిలి” అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలు హిట్ అయితే రేఖ కెరియర్ ఇంకాస్త జోష్ గా ఉండేది.
అదే సమయం లో కింగ్ నాగార్జున, విజయభాస్కర్ డైరక్షన్ లో వచ్చిన “మన్మథుడు” సినిమాలో రేఖకు ఓ స్పెషల్ అప్పియరెన్స్ నటించే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా చేస్తున్న సమయంలోనే నాగార్జున తనకు మరో సినిమా అవకాశం తప్పకుండా ఇస్తా అని మాట ఇచ్చారట. కాని ఇప్పటివరకు నాగార్జున నుండి అలాంటి కాల్ రాలేదని అంటుంది రేఖ. కొన్నాళ్లుగా తెలుగు పరిశ్రమకు దూరమైన ఈ అమ్మడు కన్నడలో మాత్రం కొన్ని సినిమలు చేసి అప్పట్లో కాస్త బిజీ హీరోయిన్ గా ఉండేది. ఇప్పటి వరకు కెరీర్ మొత్తంగా తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కలిపి 45 సినిమాల వరకు నటించింది. చివరగా ఓంకార్ దర్శకత్వంలో “జీనియస్” అనే సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. ఇక 2014 నుండి సౌత్ ఇండియాలో ఎక్కడ ఎలాంటి సినిమాలోనూ రేఖ నటించలేదు.
Advertisement
బెంగుళూరు లో పుట్టి పెరిగిన రేఖ BBA కరస్పాండెన్స్ కోర్స్, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుండి పూర్తి చేసింది. ఇక బుల్లితెరలో ప్రసారం అవుతున్న ఒక షోకి గెస్ట్ గా వచ్చిన రేఖ కొని విషయాలు మీడియా తో పంచుకున్నారు. ఇక అప్పట్లో తాను బ్రతికిఉండగానే చనిపోయాను అంటూ వార్తలు వచ్చాయని చెప్పుకోచ్చింది రేఖ. నాగార్జున తో నటించే అవకాశం వస్తే ఇప్పుడైనా ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు సిద్ధమే అంటుంది రేఖ. మరి నాగార్జున ఈ అమ్మడి అభ్యర్ధనని పట్టించుకున్తాడో లేదో చూడాలి. రేఖకి మాత్రం తెలుగు సినిమా చేయడమంటే ఇప్పటికి ఆసక్తి అని చెప్పింది.
ఇక ఈ 33 ఏళ్ళ ఈ సుందరి ఇంకా పెళ్లి చేసుకోలేదు. అప్పుడప్పుడు మోడలింగ్ చేస్తూ కాలక్షేపం చేస్తుంది. కానీ ఇప్పుడు రేఖను చుసిన వారంతా ఈమేనా మన “ఆనందం” సినిమాలో నటిచింది అని డౌట్ పడుతున్నారు. ఏజ్ తో పాటు వచ్చే ఫిజికల్ మార్పుల వల్ల రేఖ వేదవ్యాస్ గుర్తుపట్టలేకుండా ఉంది. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. మరి మరీనా ఫిజిక్ తో మల్లి హీరోయిన్ గా రాణించడం కష్టమే కాబట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా సరి పెట్టుకుంటుందేమో ఈ అమ్మడు వేచి చూడాలి.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.