Connect with us

Featured

తెలుగు హీరోయిన్ల జీవితంలో కొన్ని చేదు విషయాలు…అన్నదమ్ములను కోల్పోయి…[స్పెషల్ స్టోరీ]

Published

on

సినిమా ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ వస్తుంటారు. కొంతమందికి మాత్రం లక్కు కలిసొచ్చి స్టార్ డం సొంతం చేసుకుంటారు. ఇంకొంత మంది మాత్రం కొన్ని సినిమాలతోనే సరిపెట్టుకుంది. అయితే హీరోయిన్స్ పైకి ఎంతో నవ్వుతూ అందంగా కనిపించిన వారి నిజ జీవితంలో మాత్రం ఏదో ఒక లోటు ఉండే ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ తమ ఫాన్స్ ఆనందం పెట్టాలనే మంచి పాత్రను ఎంచుకుని సినిమాలను చేస్తుంటారు. అలాంటి కొంత మంది హీరోయిన్ల జీవితంలో మాత్రం కొన్ని చేదు విషయాలు ఉన్నాయి.

ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరోయిన్ల నిజజీవితంలో కూడా ఒక తీరని లోటు ఉండిపోయింది. అదేంటంటే టాలీవుడ్ లో ఉన్న కొంతమంది తెలుగు హీరోయిన్స్ తమ తోడబుట్టిన సోదరులను కోల్పోయారు. తమతో పాటు ఆడి పాడి కలిసి పెరిగిన తమ సోదరులు… ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారని నిజాన్ని బాధని గుండెలోన దాచుకుని పైకి మాత్రం ఎంతో సాధారణంగా కనిపిస్తారు. అలా తమతో పాటు పెరిగిన సోదరులను కోల్పోయిన ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరు…? వాళ్ల సోదరులను ఎలా కోల్పోవాల్సి వచ్చింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా చెప్పుకోవాల్సింది తెలుగమ్మాయి బిందు మాధవి…. బిందు మాధవి చిత్తూరు జిల్లా మదనపల్లి కి చెందిన అమ్మాయి. సాగర్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో బిందుమాధవి ఆవకాయ బిర్యాని సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. హీరోయిన్ గా బిందుమాధవి అవకాశాలు అందిపుచ్చుకుంటున్న సమయంలోనే ఏమైందో తెలియదు గానీ ఆమె తమ్ముడు సాగర్ బలవన్మరణం పొందాడు. బిందు మాధవి కెరియర్ ఫాంలో ఉన్నప్పుడు తనకెంతో ఇష్టమైన తమ్ముని కోల్పోవాల్సి వచ్చింది.

ఇదేవిధంగా అతిలోకసుందరి శ్రీదేవి కుటుంబంలో కూడా జరిగింది. శ్రీదేవికి సతీష్ అనే సోదరుడు ఉన్నాడు. ఈయన శ్రీదేవి తండ్రి మొదటి భార్య కుమారుడు. శ్రీదేవితో పాటు కలిసి తిరిగిన సతీష్ ఓరోజు షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు మరణించాడు. శ్రీదేవి తన సోదరుడిని కోల్పోవాల్సి వచ్చింది.

ఇకపోతే సౌందర్య…. సౌందర్యకి అమర్నాథ్ అనే అన్నయ్య ఉన్నాడు. షూటింగ్ కి సంబంధించిన విషయాలన్నీ తన తండ్రి చూసుకునేవాడు. అయితే తండ్రి మరణంతో సౌందర్యకి సంబంధించిన విషయాలు అన్ని అన్నయ్య అమర్నాథ్ చూసుకునేవాడు. ఎక్కడికి వెళ్లిన ఇద్దరూ కలిసే వెళ్లేవారు. అలా సౌందర్య అమర్ నాథ్ లు ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్లో వెళ్తుండగా….. మధ్యలో ఫ్లైట్ క్రాష్ అయ్యింది. సౌందర్య తో పాటు ఆమె అన్నయ్య కె ఎస్ అమర్నాథ్ కూడా ప్రాణాలు విడిచారు. సౌందర్య అన్నయ్య మరణించాడు.

ఇక హీరోయిన్ కేథరిన్ తెరెసా కూడా తమ తమ్ముణ్ణి కోల్పోయింది. ఇద్దరమ్మాయిలు సినిమా తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కేథరిన్….. పలు తెలుగు చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమాలో నలుగురు హీరోయిన్ల లో ఒక హీరోయిన్ గా నటించింది. కేథరిన్ కు క్రిస్టఫర్ అలెగ్జాండర్ అనే తమ్ముడు కూడా ఉండేవాడు. ఏమైందో తెలియదు కానీ హఠాత్తుగా చనిపోయాడు. క్రిస్టోఫర్ అలెగ్జాండర్ బిపిఏ రెండో సంవత్సరం చదువుతుండగా బలవన్మరణం పొందాడు.. కేథరిన్ కి తమ్ముడు అంటే చాలా ఇష్టమని తమ జీవితంలో అత్యంత సాడ్ మూమెంట్ ఉంది అంటే అది తన తమ్ముడు చనిపోయిన సంఘటనే అని కేథరిన్ చెబుతూ ఉంటారు.

ఇకపోతే కమెడియన్ గీత సింగ్…. కితకితలు సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న గీతాసింగ్ పలు చిత్రాల్లో కామెడీ రోల్స్ చేసింది. ఈమె కూడా తమ అన్నయ్య వివేక్ సింగ్ కోల్పోయింది. అన్నా, వదిన ఇద్దరు మరణించడంతో అన్న పిల్లల్ని పెంచుతూ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. అలా ఎప్పుడూ అండగా ఉంటాడు అనుకున్న అన్నయ్య తనని వదిలేసి వెళ్లిపోయాడు అంటూ పలుమార్లు మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది.

ఇకపోతే శ్రీలక్ష్మి సోదరుడు రాజేష్… రాజేష్ మంచి నటుడు పలు చిత్రాల్లో నటించాడు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. నీతో పాటు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సమయంలోనే యాక్సిడెంట్లో రాజేష్ మరణించాడు. శ్రీలక్ష్మి కూడా తన సోదరుడు రాజేష్ ని శాశ్వతంగా కోల్పోవాల్సి వచ్చింది. అయితే రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ కూడా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. పలు సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారింది.

ఇలా తమకు తోడుగా అండగా ఉంటారు అనుకున్న తమ సోదరులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం వారికి తీరని లోటని మన హీరోయిన్లు చెబుతుంటారు. వీరే అండి తోడబుట్టిన సోదరులను కోల్పోయిన హీరోయిన్స్…… మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం…

Advertisement

Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!