Connect with us

Featured

తెలుగు హీరోయిన్ల జీవితంలో కొన్ని చేదు విషయాలు…అన్నదమ్ములను కోల్పోయి…[స్పెషల్ స్టోరీ]

Published

on

సినిమా ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ వస్తుంటారు. కొంతమందికి మాత్రం లక్కు కలిసొచ్చి స్టార్ డం సొంతం చేసుకుంటారు. ఇంకొంత మంది మాత్రం కొన్ని సినిమాలతోనే సరిపెట్టుకుంది. అయితే హీరోయిన్స్ పైకి ఎంతో నవ్వుతూ అందంగా కనిపించిన వారి నిజ జీవితంలో మాత్రం ఏదో ఒక లోటు ఉండే ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ తమ ఫాన్స్ ఆనందం పెట్టాలనే మంచి పాత్రను ఎంచుకుని సినిమాలను చేస్తుంటారు. అలాంటి కొంత మంది హీరోయిన్ల జీవితంలో మాత్రం కొన్ని చేదు విషయాలు ఉన్నాయి.

ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరోయిన్ల నిజజీవితంలో కూడా ఒక తీరని లోటు ఉండిపోయింది. అదేంటంటే టాలీవుడ్ లో ఉన్న కొంతమంది తెలుగు హీరోయిన్స్ తమ తోడబుట్టిన సోదరులను కోల్పోయారు. తమతో పాటు ఆడి పాడి కలిసి పెరిగిన తమ సోదరులు… ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారని నిజాన్ని బాధని గుండెలోన దాచుకుని పైకి మాత్రం ఎంతో సాధారణంగా కనిపిస్తారు. అలా తమతో పాటు పెరిగిన సోదరులను కోల్పోయిన ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరు…? వాళ్ల సోదరులను ఎలా కోల్పోవాల్సి వచ్చింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా చెప్పుకోవాల్సింది తెలుగమ్మాయి బిందు మాధవి…. బిందు మాధవి చిత్తూరు జిల్లా మదనపల్లి కి చెందిన అమ్మాయి. సాగర్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో బిందుమాధవి ఆవకాయ బిర్యాని సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. హీరోయిన్ గా బిందుమాధవి అవకాశాలు అందిపుచ్చుకుంటున్న సమయంలోనే ఏమైందో తెలియదు గానీ ఆమె తమ్ముడు సాగర్ బలవన్మరణం పొందాడు. బిందు మాధవి కెరియర్ ఫాంలో ఉన్నప్పుడు తనకెంతో ఇష్టమైన తమ్ముని కోల్పోవాల్సి వచ్చింది.

ఇదేవిధంగా అతిలోకసుందరి శ్రీదేవి కుటుంబంలో కూడా జరిగింది. శ్రీదేవికి సతీష్ అనే సోదరుడు ఉన్నాడు. ఈయన శ్రీదేవి తండ్రి మొదటి భార్య కుమారుడు. శ్రీదేవితో పాటు కలిసి తిరిగిన సతీష్ ఓరోజు షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు మరణించాడు. శ్రీదేవి తన సోదరుడిని కోల్పోవాల్సి వచ్చింది.

ఇకపోతే సౌందర్య…. సౌందర్యకి అమర్నాథ్ అనే అన్నయ్య ఉన్నాడు. షూటింగ్ కి సంబంధించిన విషయాలన్నీ తన తండ్రి చూసుకునేవాడు. అయితే తండ్రి మరణంతో సౌందర్యకి సంబంధించిన విషయాలు అన్ని అన్నయ్య అమర్నాథ్ చూసుకునేవాడు. ఎక్కడికి వెళ్లిన ఇద్దరూ కలిసే వెళ్లేవారు. అలా సౌందర్య అమర్ నాథ్ లు ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్లో వెళ్తుండగా….. మధ్యలో ఫ్లైట్ క్రాష్ అయ్యింది. సౌందర్య తో పాటు ఆమె అన్నయ్య కె ఎస్ అమర్నాథ్ కూడా ప్రాణాలు విడిచారు. సౌందర్య అన్నయ్య మరణించాడు.

ఇక హీరోయిన్ కేథరిన్ తెరెసా కూడా తమ తమ్ముణ్ణి కోల్పోయింది. ఇద్దరమ్మాయిలు సినిమా తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కేథరిన్….. పలు తెలుగు చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమాలో నలుగురు హీరోయిన్ల లో ఒక హీరోయిన్ గా నటించింది. కేథరిన్ కు క్రిస్టఫర్ అలెగ్జాండర్ అనే తమ్ముడు కూడా ఉండేవాడు. ఏమైందో తెలియదు కానీ హఠాత్తుగా చనిపోయాడు. క్రిస్టోఫర్ అలెగ్జాండర్ బిపిఏ రెండో సంవత్సరం చదువుతుండగా బలవన్మరణం పొందాడు.. కేథరిన్ కి తమ్ముడు అంటే చాలా ఇష్టమని తమ జీవితంలో అత్యంత సాడ్ మూమెంట్ ఉంది అంటే అది తన తమ్ముడు చనిపోయిన సంఘటనే అని కేథరిన్ చెబుతూ ఉంటారు.

ఇకపోతే కమెడియన్ గీత సింగ్…. కితకితలు సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న గీతాసింగ్ పలు చిత్రాల్లో కామెడీ రోల్స్ చేసింది. ఈమె కూడా తమ అన్నయ్య వివేక్ సింగ్ కోల్పోయింది. అన్నా, వదిన ఇద్దరు మరణించడంతో అన్న పిల్లల్ని పెంచుతూ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. అలా ఎప్పుడూ అండగా ఉంటాడు అనుకున్న అన్నయ్య తనని వదిలేసి వెళ్లిపోయాడు అంటూ పలుమార్లు మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది.

ఇకపోతే శ్రీలక్ష్మి సోదరుడు రాజేష్… రాజేష్ మంచి నటుడు పలు చిత్రాల్లో నటించాడు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. నీతో పాటు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సమయంలోనే యాక్సిడెంట్లో రాజేష్ మరణించాడు. శ్రీలక్ష్మి కూడా తన సోదరుడు రాజేష్ ని శాశ్వతంగా కోల్పోవాల్సి వచ్చింది. అయితే రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ కూడా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. పలు సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారింది.

ఇలా తమకు తోడుగా అండగా ఉంటారు అనుకున్న తమ సోదరులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం వారికి తీరని లోటని మన హీరోయిన్లు చెబుతుంటారు. వీరే అండి తోడబుట్టిన సోదరులను కోల్పోయిన హీరోయిన్స్…… మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం…

Advertisement

Continue Reading
Advertisement

Featured

AP Politics: కూటమికి మద్దతుగా మెగాస్టార్ .. జగన్ కి ఇది ఊహించని షాక్!

Published

on

AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.

Advertisement

మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే..
ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ సభలో కత్తులు కలకలం.. పోలీసుల అదుపులోకి ఇద్దరు యువకులు?

Published

on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.

ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.

Advertisement

దాడికి ప్రయత్నమా..
ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: గులకరాయికే విలవిలలాడితే గొడ్డలి పోటు సంగతి ఏంటి జగనన్న: షర్మిల

Published

on

AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.

ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.

Advertisement

కంచుకోటకు బీటలు..
ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!