Connect with us

Featured

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

Published

on

మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ “ఇడియట్” సినిమా.. డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఈ చిత్రంతో హీరోగా రవితేజ, డైరెక్టర్ గా పూరి జగన్నాద్ లకు ఎంత పేరు వచ్చిందో.. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ రక్షిత కు కూడా అంతే క్రేజ్ వచ్చింది. ఆమెకు తెలుగులో ఇది తోలి చిత్రం. నటించిన తొలి చిత్రంతోనే ప్రేక్షకులను తన అందంతో, నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో మరికొందరు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా వచ్చింది. చిరంజీవి సరసన “గోవిందుడు అందరివాడు” చిత్రంలో, నాగార్జున తో “శివమణి”, మహేష్ బాబు కి జతగా “నిజం”, ఎన్టీఆర్ “ఆంధ్రావాలా” వంటి సినిమాలతో స్టార్ హీరోల సరసన నటించింది రక్షిత. ఆ సమయంలో రక్షిత క్రేజ్ మామూలుగా లేదు. కొన్ని సినిమాలకు ఆమె కోసం మాత్రమే వెళ్లిన అభిమానులు కూడా ఉన్నారు. అప్పట్లో కుర్ర కారుని ఒక ఊపేసింది రక్షిత. తన అందంతో అలా కట్టిపడేసేది ఆమె.

అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే కన్నడ దర్శకుడు ప్రేమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రక్షిత. 2007 లో వీరి వివాహం జరిగిన తరువాత ఆమె సినిమాల్లో నటించలేదు. పెళ్లి తరువాత రక్షిత సినిమాల వైపు చూడలేదు. మెల్ల మెల్లగా ఆమె ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. ప్రస్తుతం కొన్ని కన్నడ టీవీ షో లలో జడ్జి గా వస్తున్నారు రక్షిత. ఇప్పుడు ఆమెను చుసిన వారు మాత్రం షాక్ అవుతున్నారు. ఇడియట్ సినిమాలో హీరోయిన్ గా మంచి స్ట్రక్చర్ మెయింటైన్ చేసిన రక్షిత ఇప్పుడు బాగా లావుగా కనిపిస్తున్నారు.

Advertisement

ఆమెతో పాటు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అప్పటి హీరోయిన్లు ఇండస్ట్రీలో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వెలుగుతున్నారు అయితే తాను మాత్రం వెండితెరపై కనిపించానని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు రక్షిత. బహుశా అందువల్లే అనుకుంట ఆమె ఫిజిక్ పై పెద్దగా శ్రద్ద పెట్టడంలేదు. వాలెంటైన్స్ డే సందర్భంగా జరిగిన షోలో ఆమె భర్తతో కలిసి దిగిన ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. ఈ ఫోటోలు రక్షితను చుసిన తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇడియట్ సినిమాలో రక్షిత గుర్తున్నవారు ఇప్పుడు చుసిన రక్షిత ఇలా చూసి చాలా షాక్ అవుతున్నారు. అసలు ఈమె ఇడియట్ సినిమా హీరోయిన్ ఏనా అనిపిస్తుంది. ఎందుకంటే రక్షిత చాలా లావుగా ఉన్నారు.

Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!