ముప్పలనేని శివ మంచి సాంప్రదాయమైన మరియు ప్రేమకథా చిత్రాలను తెలుగు తెరకు అందించిన దర్శకుడు. కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య వంటి దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా ముప్పలనేని శివ దాదాపు ఇరవై చిత్రాలకుపైగా పనిచేసారు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి లాంటి సీనియర్ హీరోలను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసేవాడు. ఆ క్రమంలో ఆయన అనేక సినిమాలు చేస్తూ దర్శకత్వ అవకాశం కోసం చూస్తున్న తరుణంలో ముప్పలనేని శివ 1994లో కృష్ణ, మాలాశ్రీ హీరో, హీరోయిన్లుగా ఘరానా అల్లుడు చిత్రాన్ని రూపొందించారు.
తర్వాత మంచి ఉద్విగ్న భరితమైన ప్రేమ కథ రాసుకొని దానిని పెద్ద బ్యానర్లో తీద్దామని అనుకున్నారు. ఆ క్రమంలో లో వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ కి ఆ కథ వివరించడం జరిగింది. కథ విన్న అశ్వినీ దత్ గారికి నచ్చిన.. తాను పెద్ద హీరోలతో చేస్తున్నానని ఈ కథ అప్ కమింగ్ హీరోస్ కి పనికి వస్తుందని చెప్పారు. వీలుంటే మంచి బ్యానర్ లో చేయమని సలహా ఇచ్చాడు. ప్రేమ్ నగర్ తీసిన సురేష్ ప్రొడక్షన్స్ మించిన బ్యానర్ ఏముంటుందని డి.రామానాయుడు గారిని ముప్పలనేని శివ కలిశారు. ఆ క్రమంలో ఆ స్టోరీ విన్న రామానాయుడు చాలా ఉత్సాహాన్ని చూపారు.
అప్పుడు వెంటనే హీరో వెంకటేష్ కి ఫోన్ చేసి ఈ కథ గురించి చెప్పగా అది అప్ కమింగ్ హీరోస్ కి బాగా సూట్ అవుతుందని.. కావున కొత్తవాళ్లతో తీయమని డి. రామానాయుడు కు చెప్పారు. తాను ఇది వరకే ‘ప్రేమ ఖైదీ’ చిత్రాన్ని హరీష్ తో చేయడం వలన ఈ కొత్త లవ్ స్టోరీ కి హరీష్ బాగుంటాడని డి. రామానాయుడు, ముప్పలనేని శివ కు సలహా ఇచ్చారు. ముప్పలనేని శివ కూడా ముందుగా రామానాయుడు మాట ప్రకారం హరీష్ అనుకున్నారు కానీ.. అంతకుముందే హీరో హరీష్ కొండపల్లి రత్తయ్య చిత్రంలో నటించినా.. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అందువల్ల ఈ సినిమాకు శ్రీకాంత్ అయితే బాగుంటుందని ముప్పలనేని శివ నిర్మాత రామానాయుడుకు చెప్పారు. అప్పుడే ఇండస్ట్రీకి శ్రీకాంత్ కొత్త కావడంతో ఆయనను ఒకసారి తీసుకు రమ్మని చెప్పగా తీవ్రమైన టైఫాయిడ్ జ్వరంతో ఉన్న శ్రీకాంత్ ఇంటి నుంచి కార్ లో రామానాయుడు స్టూడియో కి తీసుకువెళ్లారు. శ్రీకాంత్ ను చూసిన రామానాయుడు మన సినిమాకు సరిపోతాడని ఆయనకు జ్వరం తగ్గిన తర్వాత సినిమా మొదలు పెడదామని చెప్పారు.
అలా అప్పటి వరకు ఎలాంటి బ్రేకుల్లేని శ్రీకాంత్ కి తాజ్ మహల్ 1995 మేలో విడుదలై ఘన విజయాన్ని సాధించడంతో… వైజయంతి మూవీస్, గీతాఆర్ట్స్ కలయికలో 1996లో పెళ్లి సందడి సినిమా విడుదలై ఏకంగా బ్లాక్ బస్టర్ సాధించింది. ఆ తర్వాత గిల్లికజ్జాలు, వినోదం, ప్రేయసి రావే, ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన లాంటి హిట్ చిత్రాలతో శ్రీకాంత్ దూసుకు వెళ్లడానికి కేవలం తాజ్ మహల్ సినిమానే పునాదిగా పేర్కొనవచ్చు. ఒకవేళ ఈ తాజ్ మహల్ సినిమా హరీష్ చేసి ఉంటే ఆయన భవిష్యత్ ఎలా ఉండేదని ఒక విశ్లేషణ.
Pitapuram: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఎన్నికల హడావిడి మొదలైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరి జెండా ఎగురుతుందన్న విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇలా పిఠాపురం పైన ఇంత ఆసక్తి రావడానికి కారణం అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే కారణమని చెప్పాలి.
గత ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం కాపులు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలోనే ఈయనకు పోటీగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఎవరు గెలుస్తారో అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఎన్నో చానల్స్ వారు ప్రజా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. వంగా గీత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ అంతేకాకుండా ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కూడా ఈమె కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో వంగా గీత కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.
Advertisement
జనసేనదే విజయమా.. ఇకపోతే వంగా గీత 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు అయితే అప్పట్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిన పిఠాపురానికి చేయాల్సినటువంటి న్యాయం చేయలేకపోయారని అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నామంటూ చాలామంది ప్రజలు పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తున్నారంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి చూడాలి మరి పిఠాపురంలో ఏ జెండా ఎగురుతుంది వంగా గీత పవన్ కళ్యాణ్ కి ఎలా పోటీగా నిలబడతారు అనేది తెలియాల్సి ఉంది.
AP politics: రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగిపోతుంది కానీ తెలుగుదేశం పార్టీతో జనసేన బిజెపి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే ఇలా కూటమిగా ఏర్పడి ఎన్నికలలో గెలిచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించాలని ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించారు.
ఇలా ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతున్నటువంటి తరుణంలో కొన్ని నియోజకవర్గాలలో పార్టీల కోసం ఎంతో కష్టపడినటువంటి వారికి సీట్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోనే జనసేనలోనూ కూడా అభ్యర్థులు అలకలు మొదలుపెట్టారు. ఇటీవల బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ సీటు జనసేన పార్టీకే కేటాయిస్తారని, పార్టీ తరపున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు.
ఇలా బిజెపికి సేటు కేటాయించడంతో మహేష్ ఏకంగా జనసేన పార్టీ కార్యాలయం ముందు రెండు గంటల పాటు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈయనని పవన్ కళ్యాణ్ పిలిపించుకొని తనని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవి తప్పకుండా ఇస్తామని చెప్పిన మహేష్ మాత్రం తనకు టికెట్ కావాలని కోరారు.
Advertisement
పొత్తు ధర్మాన్ని పాటించండి.. ఇలా అభ్యర్థులు సహకరించకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.పొత్తు ధర్మాన్ని పాటిద్దామని కూటమిని గెలిపిద్దామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్నోట్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఆ పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
AP Politics: ఏపీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సభలో తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో రాష్ట్ర తెలుసనీ, తన చెల్లెలు షర్మిల సునీతను కూడా తమ రాజకీయాలలో పావులుగా వాడుకున్నారని తెలిపారు.
నా చెల్లెమ్మలు ఇద్దరూ కూడా హంతకులకే మద్దతు తెలుపుతున్నారని జగన్ మండిపడ్డారు. చెల్లెమ్మలు చిన్నాన్నను చంపిన వారితో చేతులు కలపగా నేను మాత్రం ప్రజల పక్షమే ఉంటానని జగన్ తెలిపారు. ఇలాంటి హంతకులతో అవినీతిపరులతో యుద్ధం చేయడానికి ఈ అర్జునుడు సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ ఈ కార్యక్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
Advertisement
కూటమి అంటే కుట్రలు.. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడికి 45 ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపి, ఆయన విగ్రహాలకు పూలమాలలు వేశారని అన్నారు. కూటమి అంటే కుట్రలు కుతంత్రాలని జగన్ తెలిపారు. తమ జెండా మాత్రం మరో జెండాతో జతకట్టలేదని చెప్పారు. కేంద్రం నుంచి ఓ పార్టీని తెచ్చుకున్నారని అన్నారు. ఇటీవల చోటుచేసుకున్న డ్రగ్స్ కేసు వెనుక చంద్రబాబు వదిన గారి చుట్టం ఉన్నారంటూ డ్రగ్స్ వ్యవహారంపై కూడా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.