Connect with us

Featured

“సచివాలయం వాస్తు బాగోకే ‘దొర’కి ఆరోగ్యం బాగుండటం లేదంట..” – నటి మాధవీలత !!

Published

on

బీజేపీ యువ నాయకురాలు, ప్రముఖ సినీ నటి మాధవీలత KCR పై సంచలన కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. సచివాలయం కూల్చివేతకు KCR అనారోగ్యానికి లింక్ పెడుతూ ఈసారి మాధవీ లత తన ఫేస్ బుక్‌లో ఓ షాకింగ్ పోస్ట్ ను వీడియో రూపంలో షేర్ చేసింది. ఉస్మానియా హాస్పిటల్ లో వర్షం నీరు రావడంతో అక్కడ రోగులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్లుగా ఈ వీడియోలో చూసిన చాలా మంది..

“KCR గారూ!! ఈ దుస్థితి చూసిన తర్వాతైనా తెలంగాణ ప్రజలకు అత్యవసరంగా కావాల్సింది సచివాలయమా? లేక వైద్యాలయమా? ఒకప్రక్క జనం పిట్టల్లా రాలి పోతుంటే.. మరోవైపు పాలకులేమో వాటి మీద దృష్టి పెట్టకుండా ఆధునిక నిర్మాణాలపైనా దృష్టి సారిస్తారా? అంటూ తీవ్రంగా మండి పడుతున్నారు. కోర్టు స్టే వరకూ వెళ్లిన ఈ అంశంపై “నిజాం కాలం నాటి గుప్త నిధుల కోసమే సచివాలయాన్ని కూల్చి వేస్తున్నారంటూ గతంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నిజాం నవాబులు ఆరోజుల్లో తమ గుప్త నిధులను 5 రహస్య స్థావరాల్లో దాచి వుంచారని వాటిలో మింట్ కాంపౌండ్, హోం సైన్స్ కాలేజీ, సెక్రటరేట్ జీ బ్లాక్ ఉన్నాయని.. జీ బ్లాక్ కింద గుప్త నిధులు ఉన్నట్లు దాదాపు అన్ని ఆంగ్ల పత్రికలు రాసుకొచ్చాయంటూ.. ఇప్పుడు ఆ గుప్త నిధుల కోసమే KCR పాత సచివాలయ భవనాలను కూల్చివేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు రేవంత్. దాంతో సచివాలయం కూల్చివేత అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. హైకోర్ట్‌లో స్టేల వరకూ వెళ్లింది. “ఒక ప్రక్క తెలంగాణ ప్రజలంతా కరోనా మహమ్మారి దెబ్బకి విలవిల్లాడిపోతుంటే.. ఇంత అర్జంట్ గా సచివాలయాన్ని కూల్చేసి..

కొత్తది కట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది..? అని నిలదీయగా దీనికి అధికార పార్టీ నేతలు చెప్పే సమాధానం ఏమిటంటే.. పాత సచివాలయం వాస్తు బాలేదు కాబట్టి కొత్తది కట్టాలి అని.. సరే వాళ్ళు చెప్పింది బాగుంది. అలానే అనుకుందాం.. మరి గడిచిన 7సంవత్సరాలూ KCR పాలించింది ఆ సచివాలయం నుంచే కదా.. అప్పుడేమైంది ఈ వాస్తు సమస్య.? అప్పుడు రాని సమస్య ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటి.? ఎందుకంటే పీఠం మార్చే ఉద్దేశం ఉంది కాబట్టి, తన కుమారుడు KTR జాతకానికి పాత సచివాలయం అంత అనువైనది కాదు కాబట్టి. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పని చేశారు. అందులో చాలా మంది ఈ సచివాలయం నుంచే పాలించారు. కానీ, ఏ ముఖ్యమంత్రి కొడుకూ ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు. Y.s జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన రాష్ట్రం వేరు. ఇప్పుడు ఇదే మూఢ నమ్మకంతో CM KCR సచివాలయాన్ని కూల్చేందుకు సిద్దమైనట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతాంశానికొస్తే.. ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి ని వీడియో రూపంలో షేర్ చేసిన నటి మాధవీలత సచివాలయం అంశంపై స్పందిస్తూ..

“సెక్రెటరేట్ వాస్తు ప్రభావం వల్ల.. ‘దొర’కి ఆరోగ్యం బాగుండటం లేదంట.. అందుకే కొత్త బిల్డింగ్ ప్లాన్. మరి పేషెంట్స్ ఉండే హాస్పటల్స్ ఇలా ఉండొచ్చా.? అలాగైతే ఈ వాస్తులో నీటి దోషం ఉంది.. అయినా పర్లేదా.?” అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ చదివిన చాలామంది నెటిజన్లు ‘నీలాంటి మూర్ఖులు పెట్టే అవివేకపు పోస్టింగ్స్‌తో బీజేపీకి మైలేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువ.. ఒకళ్ళను అనే ముందు మీ బీజేపీ పార్టీ దేశాన్ని ఎలా పాలిస్తున్నారో తెలుసుకో.. ఏది పడితే అది మాట్లాడే ముందు కేసీఆర్ ఏం చేస్తానన్నారో తెలుసుకో.. కేసీఆర్ ఉస్మానియా హాస్పటల్‌ ప్లేస్‌లో కొత్త బిల్డింగ్ కడతా అన్నారు. కాని మీ పార్టీవాళ్లు కోర్టుకి వెళ్లి అడ్డుకున్నారు అది కూడా తెలియకుండా నువ్ కామెంట్స్ చేస్తున్నావ్.. మీ కళ్ళు బైర్లు కమ్మేలా మీ లీడర్లు ఉస్మానియా మీద చేసిన దొంగ రాజకీయాలను సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాము. దమ్ముంటే వాటిని నీ ఫేస్ బుక్ లో షేర్ చేయ్’ అంటూ నటి మాధవీ లతపై ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు TRS కార్యకర్తలు.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!