Connect with us

Featured

మన స్టార్స్ తెర చాటు ప్రేమకథలు, సక్సెస్ అయినవి కొన్ని, ఫెయిల్ అయినవి కొన్ని..

Published

on

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ మధ్య అఫైర్స్ బాగా వినిపిస్తుంటాయి. రెండు, మూడు సినిమాలు కలిసి నటిస్తే వారిమధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది అని పుకార్లు పుట్టిస్తుంటారు.

ఇదంతా సాధారణ విషయమే అయితే కొన్ని రూమర్లు పెళ్లి వరకు వెళితే మరికొన్ని మధ్యలోనే తెగిపోయాయి. మరి కొన్ని సహజీవనం సాగించే వరకు నడిచాయి. అలా ఇండస్ట్రీలో బాగా వినిపించిన కొన్ని అఫైర్స్ ఇప్పుడు చూద్దాం.

1) శృతి హాసన్ & మైకేల్ కోర్సెల్

Advertisement

లండన్ కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైకేల్ తో శృతి చాలారోజులుగా డేటింగ్ చేసింది. శృతి హాసన్ కి సంబందించిన చాలా ఈవెంట్స్ లో మైకేల్ కనిపించేవాడు. ఇంట్లో వారికి కూడా ఈ విషయం తెలుసు, కానీ శృతి మాత్రం ఎప్పుడు ఈవిషయం గురించి ప్రస్తావించలేదు. ఆ తరువాత ఇద్దరూ బ్రేకప్ అయినట్టు వార్తలు వినిపించాయి.

2) సమంత & సిద్దార్ద్

జబర్దస్త్ సినిమా షూటింగ్ సమయంలో సిద్దార్ధ్ తో ప్రేమలో పడింది సమంత. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందాం అని అనుకున్నారు. కానీ వారి బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఈ విషయంలో ఈ జంట మీడియా ముందు కూడా మాట్లాడింది. సమంత ఇప్పుడు అక్కినేని చైతన్యను పెళ్లి చేసుకుని హాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది.

3) త్రివిక్రమ్ & పార్వతి మెల్టన్

త్రివిక్రమ్ హీరోయిన్ పార్వతి మెల్టన్ తో చాలా సన్నిహితంగా మెలిగేవాడు. జల్సా సమయంలో త్రివిక్రమ్ ఆమెకు డైమండ్ నెక్లస్ గిఫ్టుగా ఇచ్చాడని అప్పట్లో గాసిప్. కానీ ఆ తరువాత వీరి మధ్య ఎలాంటి బంధం లేదని అది ఒట్టి గాసిప్ మాత్రమె అని తెలుస్తోంది.

4) రాణా & త్రిష

Advertisement


టాలీవుడ్ హీరో రాణా చాలారోజుల పాటు నటి త్రిషతో డేటింగ్ చేసాడని టాక్. వీరిద్దరూ కలిసి తీసుకున్న కొన్ని పర్సనల్ ఫోటోలు కూడా అప్పట్లో బయటకి వచ్చాయి.

5) రిచా గంగోపాధ్యాయ & సుందర్ రామ్


ఒక తమిళ సినిమా సమయం లో వీరిద్దరూ క్లోజ్ అయ్యారు. చాలా సన్నిహితంగా ఉండేవారు. సుందర్ రామ్ రిచాని పెళ్లి చేసుకోవడం కోసం ప్రయత్నించాడు. సూసైడ్ కూడా చేసుకుంటా అని బెదిరించాడు. కానీ దానికి ఆమె అంగీకరించలేదు. కొన్నాళ్లకి ఆమె ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయింది.

6) పవన్ కళ్యాణ్ & అన్నా లెజినోవా


రష్యా కి చెందిన ఆమెతో పవన్ ప్రేమయనం సాగించాడు. అప్పటికే పవన్ కి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తరువాత అయన భార్య రేణు దేశాయ్ కి విడాకులిచ్చి అన్నా లెజినోవాని పెళ్లి చేసుకున్నారు.

7) ఇలియానా & ఆండ్రు నిల్ బోన్

Advertisement


ఆస్ట్రేలియా కి చెందిన ఆండ్రు అనే ఫోటోగ్రాఫర్ తో ఇలియానా చాలా రోజులుగా డేటింగ్ చేసింది. వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని అప్పట్లో వార్తలు జోరు మీద వినిపించాయి. అయితే ఏమయిందో తెలియదు కానీ కొద్దికాలానికి వీరిద్దరికీ బ్రేకప్ అయిందని వార్తలు వచ్చాయి.

8) ఆసిన్ & నిల్ నితిన్ ముఖేష్


మొదట్లో ఆసిన్ & నీల్ నితిన్ మంచి స్నేహితులు. కొన్నాళ్లకు వారి స్నేహం ప్రేమగా మారింది, మరికొన్నాళ్లు డేటింగ్ చేసారు. ఆ తరువాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు.

9) హన్సిక & శింభు


చాలాకాలం పాటు రిలేషన్ సాగించిన వీరిద్దరూ సింబు మరియు హన్సిక జంట. ఆ తరువాత విడిపోయారు. ఇప్పుడు ఎవరికి వారు బిజీ అయిపోయారు.

10) వరుణ్ సందేశ్ & శ్రద్దా దాస్

Advertisement


వీరిద్దరూ కలిసి తరచూ పార్టీలకు వెళ్లడం, టైం స్పెండ్ చేయడం తో వీరు ప్రేమలో ఉన్నారు అని వార్తలు వినిపించాయి. కానీ తామిద్దరం మంచి స్నేహితులం అని చెప్పేవారు. ఆ తరువాత వరుణ్ వితికని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటున్నారు.

Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!