తెలుగు చిత్రరంగంలో మెగా కుటుంబానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ప్రతి పది మందిలో ఐదుగురు మెగా ఫ్యాన్సే వుంటారంటే అతిశయోక్తికాదు. ఎందుకంటే ఆ కుటుంబం నుంచి ఒకరు ఇద్దరు కాదు ఏకంగా అరడజను మంది హీరోలు వచ్చారు. అందులో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇప్పటికే తమదైన శైలిలో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అల్లు శిరీష్ ఇంకా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇదే సమయంలో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ “ఉప్పెన” చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు.
వీళ్ళందరూ ఇలా ఉంటే తాను కూడా ఇదే కుటుంబం నుంచి వచ్చానంటూ నిహారిక కొణిదెల కూడా తన వంతు ప్రయత్నంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మెగా డాటర్ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాబ్రదర్ నాగబాబు తనయ నిహారికని అందరూ ఇప్పుడు మెగా డాటర్ అని పిలుస్తున్నారు. మెగా కాంపౌండ్ లో హీరోయిన్ గా రంగప్రవేశం చేస్తున్న తొలి అమ్మాయి నిహారిక. ఆమె హీరోయిన్ గా పరిచయమైన తొలి సినిమా ‘ఒక మనస్సు’. ఆ తర్వాత 3 సినిమాల్లో నటించింది. తొలి సినిమా ఒక మనసు డిజాస్టర్ కాగా.. 2వ సినిమా హ్యాపీ వెడ్డింగ్, 3వది సూర్యకాంతం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో కోలీవుడ్ లోనైనా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో భాగంగా విజయ్ సేతుపతితో నటించిన చిత్రం కూడా ఫ్లాప్ కావడంతో తనకు సినిమాలు కలసి రావడం లేదని ఒక నిర్ణయానికి వచ్చింది కొణిదెల నిహారిక. ప్రస్తుతం ఈమె సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టాలని ఆలోచిస్తుంది. అందుకే ఆ వైపుగా కథలు వినడం మొదలు పెట్టింది. ఇదిలావుండగా.. నిహారిక కొణిదెల గత కొన్ని రోజులుగా వరుస పెట్టి వార్తల్లోనే ఉంటుంది. ఈమధ్యనే ఆమె పెళ్లి కూడా కుదరడంతో నిత్యం ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో నిహారిక పేరు వైరలవుతూనే ఉంది. తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది నిహారిక. ఈమె చేసిన ఓ పని నెటిజన్స్ ఆగ్రహానికి గురి చేసింది. అంతలా నెటిజన్లు కోప్పడే విధంగా నిహారిక ఏం చేసిందబ్బా అనే కదా మీ సందేహం..? ఈమధ్య సినిమా ఛాన్సలు లేక.. కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ లు బందైన నేపథ్యంలో నిహారిక ఒన్ ప్లస్ అనే చైనా మొబైల్ కు ప్రమోషన్ చేసింది. వన్ ప్లస్ ఫోన్కు బ్రాండింగ్ చేస్తూ తన ఫేస్ బుక్లో పోస్ట్లు షేర్ చేసింది.
ఓ వైపు దేశమంతా చైనా ప్రాడక్ట్స్ బ్యాన్ చేయాలని చెప్తుంటే.. నువ్వు మాత్రం ఇలా చైనా ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తున్నావా.? నీకసలు బాధ్యత ఉందా.? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు అనిపించడం లేదా.? అసలు చైనా ఫోన్స్ అన్నీ తీసేయాలని ప్రభుత్వమే చెప్తుంటే నువ్వు మాత్రం ఏకంగా ఈ చైనా ఫోన్ వాడమంటూ ప్రమోట్ చేస్తావా.? ఇలా ప్రమోషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్.? అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తెలిసి చేసిందో, తెలియక చేసిందో కానీ., నిహారిక మాత్రం చైనా మొబైల్ వివాదంలో భలే చిక్కుకుంది. నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు ఈమె దగ్గర సమాధానం లేదిప్పుడు. త్వరలోనే ఈమె చైతన్య జొన్నలగడ్డతో ఏడడుగులు వేయబోతుంది. ఆగస్టులో నిశ్చితార్థం.. డిసెంబరులో పెళ్లి ప్లాన్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.