టాలీవుడ్లో ప్రేమించి పెళ్ళి చేసుకున్న అందమైన జంటల్లో ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రతల జంట ఒక్కటి. ఈ జంట యొక్క గొప్పతనం ఏమిటంటే.. వీళ్ళిద్దరి పెళ్లి జరిగిన దగ్గర్నుండి నేటివరకు ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలకు చోటు లేకపోవడమే. ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఈ జోడి ఎవరికీ నచ్చినట్టువారు ఉంటారు. వృత్తిపరంగా ఇద్దరూ ఎంత బిజీగా వున్నా ఒకరికొరు గౌరవించుకుంటూ గౌరవ ప్రదంగా కలిసి జీవిస్తున్నారు. అందుకే పెళ్ళైన పది నెలలలోపే విడాకులు తీసుకుంటున్న నవతరం దంపతులందరికీ ఈ జంట ఆదర్శం అనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే..
తాజాగా సోషల్ మీడియాలో ‘ఆస్క్ మీ యువర్ క్వశ్చన్’ ఛాటింగ్ లో పాల్గొన్న నమ్రత.. మహేష్ బాబుతో తన పెళ్ళి ఎలా జరిగిందో.. తెలియజేసింది. ప్రేమించడం, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం లాంటి సంఘటనలు సినిమాల్లోనే కాదు. మహేష్ బాబు, నమ్రతల జీవితంలోనూ చోటు చేసుకున్నాయని నమ్రత మాటల ద్వారా తెలుసుకోవచ్చు. 2000 సంవత్సరంలో విడుదలైన ‘వంశీ’ చిత్రంలో మహేశ్, నమ్రత కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మాజీ ఫెమీనా మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్తో ప్రేమలో పడ్డారు. సుమారు ఐదేళ్ళ పాటు వీళ్ళిద్దరూ సక్సెస్ ఫుల్ గా డేటింగ్ ను కొనసాగించిన తర్వాత పెద్దలను ఎదురించి ఫిబ్రవరి 10, 2005న ముంబైలో నిరాడంబరంగా పెళ్ళి చేసుకున్నారు. ఆ విధంగా వివాహ బంధంతో వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. ఆ తర్వాత తొమ్మిదేళ్ల దాంపత్య జీవితంలో మహేష్, నమ్రత ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చారు. వారే గౌతమ్, సితారలు. ప్రస్తుతానికైతే ఇద్దరూ చదువుకుంటున్నారు. నమ్రత శిరోద్కర్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు.
ఆమె చివరిగా నటించిన చిత్రం ‘అంజి’. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ ఛాటింగ్ లో భాగంగా నెటిజన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చింది నమ్రత. “మీకిష్టమైన హీరో ఎవరు.?” అని ఓ అభిమాని అడగటంతో.. “ఇది కాస్త క్లిష్టమైన ప్రశ్ననే.. అయినా సరే ఓపెన్ గా చెప్పేస్తున్నాను. నాకిష్టమైన హీరో అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పడూ మహేష్ బాబే” అని తెలిపింది. మహేష్ సినిమాల్లో తనకు ఒక్కడు, పోకిరి, దూకుడు, మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు చాలా ఇష్టమని, తాను మహేష్ బాబు సినిమాల సెలెక్షన్ విషయాలలో అస్సలు జోక్యం చేసుకోనని నమ్రత తెలిపింది.
మహేష్ కొడుకు గౌతమ్ ఆల్ రెడీ “1-నేనొక్కడినే” సినిమాలో నటించారు. ఆ సినిమాలో గౌతమ్ యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఏడేళ్ల వయసులో తొలి సినిమాలోనే ఎంతో మెచ్యూరిటీ చూపించి తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకున్నాడు గౌతమ్. అలాగే సితార కూడా చిన్నతనంలోనే సెలబ్రిటీ హోదాను పట్టేసింది..మొత్తానికి టాలీవుడ్ లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులు అన్యోన్య దంపతులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. తన జీవితంలో మధుర క్షణాలు ఏమైనా వున్నాయంటే అవి మహేష్ని పెళ్లి చేసుకోవడం, ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడమేనని, భవిష్యత్తులో ఒక్కసారైనా మళ్ళీ మహేష్తో కలిసి నటించే అవకాశం వస్తే చూడాలనివుందంటూ ఆమె ఛాటింగ్ ముగించడం ఆసక్తికరంగా మారింది. అదండి సంగతి.. మొత్తానికి మహేశ్.. నమ్రతల జంట మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ కదా.!
Magadheera: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే తెలుగు థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ,రామ్ చరణ్,ఎన్టీఆర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది.
ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అన్న వివరాల్లోకి వెళితే.. మగధీర సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్ బర్త్డే సందర్భంగా మగధీర చిత్రాన్ని 26న రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన మగధీర 2009 జూలై 30న విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
రీ రిలీజ్..
Advertisement
దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్బాబు రీ రిలీజ్ చేస్తున్నారు. మగధీర చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి అని తెలిపారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్ బాబు.
Mokshagna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఈయనకు వయస్సు మీద పడుతున్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక బాలయ్య వారసుడి రాక కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి అభిమానులను ఊరిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు కానీ గత ఏడాది బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాది తన కుమారుడు సినీ ఎంట్రీ ఉంటుందని తెలిపారు.. ఇకపోతే మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం అవుతారన్న సందేహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకసారి అనిల్ రావిపూడి పేరు వినిపించగా మరోసారి బోయపాటి పేరు కూడా తెరపైకి వచ్చింది.
ఇప్పటికే వీరిద్దరూ స్క్రిప్ట్ గురించి కూడా డిస్కషన్స్ పూర్తి చేశారని ఇక త్వరలోనే ఈ సినిమా పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య తన కొడుకు ఎంట్రీ బోయపాటి పైనే భారం వేసారని తెలుస్తోంది ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.
Advertisement
బోయపాటి పైనే భారం.. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా మరొక వార్త వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి టైం ఫిక్స్ చేశారని ఇక ఈయన బోయపాటి డైరెక్షన్ లోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. మాస్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ తన కుమారుడి మొదటి సినిమా కూడా ఇలాంటి యాక్షన్ టచ్ ఇస్తేనే బాగుంటుందని భావించినటువంటి బాలయ్య బోయపాటిని ఫిక్స్ చేశారట.
Venkata Chaitanya: జొన్నలగడ్డ వెంకట చైతన్య పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ నిహారిక మాజీ భర్తగా ఈయన ఎంత గుర్తింపు పొందారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఈ విధంగా నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె తన పెళ్లి విడాకులు అలాగే రెండో పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇందుకు కౌంటర్ గా తన మాజీ భర్త సైలెన్స్ సైలెన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
అయితే తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన పరోక్షంగా నిహారికను ఉద్దేశిస్తూ తనకు కౌంటర్ ఇస్తూనే ఇలాంటి పోస్టులు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయినటువంటి చైతన్య తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
Advertisement
పాజిటివిటీని పెంచాలి.. చాలా రోజుల తర్వాత ఇలా మళ్లీ రాసుకు వస్తున్నాను. ఇంస్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయిన తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంచమైనా పాజిటివిటీని పెంచాలని అనుకుంటున్నాను అంటూ ఈయన పోస్ట్ చేయడంతో ఇది చూసినటువంటి నేటిజన్స్ కచ్చితంగా ఇది నిహారికను ఉద్దేశించి చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు విడిపోయిన సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ఇలా పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.