Connect with us

Featured

వేసవికాలం వచ్చేసింది..మరి పిల్లల ఆహారంపై తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!!

Published

on

వేసవికాలం వచ్చేసింది.. సమ్మర్లో పిల్లలు ఎక్కువగా అనారోగ్యంతో భాధపడుతుంటారు. దానికి అసలైన కారణం పిల్లలకు ఆహరం పట్ల సరియైన అవగాహన లేకపోవడం…

1.వేసవి కాలంలో చాలా మంది పిల్లలు తినడానికి మారం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు తల్లులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వేసవి కాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చేసుకోవచ్చు.. 2) పిల్లల ఆహారం విషయంలో తల్లి యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. బిడ్డను ప్రతి తల్లి ఎంతో ఆప్యాయతతో అన్ని తానే అయి పెంచుతుంది. అటువంటి బిడ్డకు సరైన ఆహారం ఇవ్వడం ప్రతి తల్లి యొక్క బాధ్యత. ప్రతి తల్లి తన బిడ్డ విషయంలో అన్ని కాలంలో కన్నా వేసవికాలంలో ఎక్కువ శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. 3 ) ముఖ్యంగా సంవత్సరం లోపు పిల్లలకు ఈ కాలంలో వేడి చేసి మూత్ర విసర్జన మరియు కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటారు. చంటి పిల్లలు ఒక్కోసారి ఎందుకు ఏడుస్తారో ఎవరు తెలుసు కోలేకపోతారు. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే…..

Advertisement

పిల్లలకు ఎక్కువ మందులు వాడకుండా ఇటువంటి వంటింటి చిట్కాలు వాడడం వలన పిల్లల యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 6 నెలల లోపు తల్లి పాలు తాగే పిల్లలకు ఒక ఉగ్గు గిన్నెడు తల్లి పాలు తీసుకొని దానిలో నాలుగు జీలకర్ర పలుకులు వేసి ఒక గంటసేపు నానపెట్టి వాటిని వడపోసి బిడ్డకు పడితే ఎంతో చలవ చేస్తుంది. దీని వల్ల మూత్రంలో వచ్చే మంట తగ్గుతుంది. మరియు మలవిసర్జన కూడా సాఫీగా ఉంటుంది. ఈ కాలంలో ఇలా ప్రతి రోజు బిడ్డకు పట్టవచ్చు. దీని వలన ఎటువంటి దుస్ఫలితాలు ఉండవు.. అదే 6 నెలల నుండి 1 సంవత్సరం దాటిన పిల్లలకు అయితే ద్రవ పదార్థాల రూపంలో తాగించవచ్చు..

అందులో ముఖ్యంగా……‌ మన అందరికి తెలిసిన ఎండు ద్రాక్ష వీటినే కిస్ మిస్ పండ్లు కూడా అంటారు. ఒక చిన్న గ్లాస్ నీళ్లలో 5 ఎండు ద్రాక్షలను వేసి రాత్రంతా నానపెట్టి ఉదయాన్నే అవి పిల్లలకు పడితే శరీరం లోని ఉష్ణాన్ని తగ్గించడమే కాకుండా పిల్లలకు తక్షణ శక్తి అందుతుంది. కాబట్టి ప్రతి తల్లి ఈ కాలంలో తమ యొక్క బిడ్డలకు ఈ పద్దతిలో నీటిని పడితే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. మరియు వేసవిలో వచ్చే సమస్యలను అధిగమించవచ్చు.

2 సంవత్సరాలు దాటిన పిల్లలు అయితే తినడానికి బాగా ఇబ్బంది పెడతారు. అప్పటివరకు మనం పెట్టింది తింటూ ఉండే వారికీ పెరుగుతున్న క్రమంలో వాళ్ళ నోటికి అన్ని రకాల రుచులు తెలుస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా చెప్పదలిచింది ఏమిటంటే ఈ వయసు పిల్లలు ఈ వేసవి కాలంలో ఎక్కువగా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్ వంటివి తినడానికి ఇష్టపడతారు. చల్లని పదార్థాలు తినడానికి, తిన్న తర్వాత చల్లగా ఉంటాయి కానీ అవి తర్వాత బిడ్డ ఆరోగ్యంపై ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి అలాంటి వాటికి సాధ్యమైనంత దూరంగా పిల్లలను ఉంచడం మంచింది.

2 సంవత్సరాలు వయస్సు దాటిన పిల్లలకు ఒక గ్లాస్ నీటిలో 4 ఎండు ద్రాక్ష, ఒక ఎండు ఖార్జురం వేసి రాత్రంతా నానపెట్టి ఉదయాన్నే వాటిని మిక్స్ పట్టి వడపోసి పిల్లలకు తగిస్తే చాలా మంచిది. ఈ నీటిని పిల్లలకు పట్టడం వలన వల్ల శరీరానికి ఐరన్, విటమిన్స్ కూడా అందుతాయి. పిల్లలు ఎంతో ఉత్సాహంగా కూడా ఉంటారు. మరియు వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది.

ఎండాకాలంలో వేడిమి వలన శరీరంలో నీకు అంతా చెమట రూపంలో బయటకు పోతుంది. కాబట్టి పిల్లలు త్వరగా అలిసిపోతారు. మరియ తమ శక్తిని కోల్పోతారు అందువలన పిల్లలకు తప్పనిసరిగా ఈ నీటిని ఇవ్వడం వలన తిరిగి శక్తిని నింపిన వారు అవుతారు మరియు యూరినరీ సమస్యలు కూడా తొలగిపోతాయి.

Advertisement

ఏ వయస్సు వారైనా ఎక్కువ మంచినీళ్లు తీసుకోవడం వలన శరీరంలో ఉండే మలినాలను తొలగించుకోవచ్చు. అవి ఒక మంచినీళ్లు రూపంలోనే కాకుండా మజ్జిగ, జ్యూస్, ముఖ్యంగా రాగి జావ, బార్లీ జావ వంటివి తీసుకుంటే ఎంతో మంచిది. వీటిని 2 సంవత్సరాలు దాటినా పిల్లలకు కూడా పట్టవచ్చు. వీటి వల్ల వాళ్ళ శరీరంలో నీటి శాతం పెరిగి వారి యొక్క జీవ క్రియ సక్రమంగా సాగడానికి ఎంతో దోహదపడుతుంది.‌ ముఖ్యంగా మనం ఈ రాగి జావా,బార్లీ జావా గురించి చెప్పుకుంటే వీటిని తాగడం వలన ప్రతి ఒక్కరికి శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. చాలామంది వీటిని ఆరోగ్యం బాలేనపుడు లేదా జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ కాలములో ప్రతి రోజు వీటిని తీసుకోవడం ఎంతో మంచిది.

ఈ చిట్కాలను పాటించి మీ పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!