Connect with us

Featured

అవును మేమిద్దరం రిలేషన్షిప్ లో ఉన్నాం… నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే అన్సర్ ఇచ్చిన రాహుల్..

Published

on

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఎన్నో వివాదాలు.. మరెన్నో సంచలనాలతో రసవత్తరంగా ప్రేక్షకులను అలరించిన ‘బిగ్ బాస్ 3’ రియాలిటీ షోలో సోషల్ మీడియా సెలబ్రిటీ, జూనియర్ సమంతాగా క్రేజ్ సంపాదించుకున్న.. ‘అషు రెడ్డి’ మూడో కంటెస్టెంట్‌గా ఎంటరైన సంగతి తెలిసిందే. ఇక ఆమె ఎంట్రీ చూసిన జనం అందరూ షాకయ్యారనే చెప్పాలి. ఎందుకంటే.. ఆమె సమంతా లుక్‌లో స్లిమ్‌గా వుండటమే కాకుండా నటి నమితలా బొద్దుగా ఉండడమే అందుకు కారణమని నెటిజన్లందరి అభిప్రాయం.

బిగ్ బాస్ సీజన్ 3 ముగిసింది. రాక్‌స్టార్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్‌గా నిలిచిన సంగతి విదితమే. ఇక అసలు విషయానికి వస్తే.. బిగ్ బాస్ సీజన్ 3 షో కొనసాగినంతకాలం రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పాలి. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా నడుస్తోందేమోనన్న ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాహుల్ ని ఇదే విషయంపై ప్రశ్నించగా “పునర్నవి డ్రీం బాయ్‌ నేను కాదు. తనకీ ఆల్ రెడీ వేరే వ్యక్తి ఉన్నాడు. మా ఇద్దరివీ వేర్వేరు జీవితాలు. కానీ మా ఇద్దరి మధ్యా ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. మేమిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే.. అంతేకానీ మీరనుకున్నట్లుగా మా ఇద్దరి మధ్యా ఏ రొమాంటిక్ రిలేషన్ లేదు’’ అని చెప్పి అందరికీ షాకిచ్చాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని స్వయంగా పునర్నవియే చెప్పడంతో నెటిజన్లందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.

ఇదిలా ఉంటే పునర్నవిని కాదని బిగ్ బాస్ హౌజ్ లో మరో కంటెస్టంట్ గా పాల్గొన్న అషు రెడ్డితో రాహుల్ ఈమధ్య చాలా క్లోజ్ గా ఉంటున్నాడనే గాసిప్స్ వెలుగులోకి వచ్చాయి. బిగ్ బాస్ నుండి బయటకి వచ్చేసిన తర్వాత పార్టీలని, మీటింగులని అందరూ అందర్నీ కలుస్తున్నారు. కానీ మాత్రం ప్రత్యేకంగా రాహుల్ అషు రెడ్డినే ఎక్కువగా కలుస్తున్నాడు. తాజాగా వీళ్లిద్దరిని 1,2 సార్లు జంటగా చూసిన ప్రేక్షకులు రాహుల్ ను “మీ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారా.?” అనడిగితే “అవును… మేమిద్దరం రిలేషన్షిప్ లో ఉన్నాం.. మా రిలేషన్ పేరు జిగిడి దోస్త్” అంటూ బదులిన్నాడు రాహుల్. ఏం జిగిడీ దోస్తులో.. ఏందో.. ఈ ప్రేమలేందో.. దోస్తులేందో జర మీ ధిమాక్ ఖరాబ్ కాకముందే వీళ్ళ గోల మర్చిపోండి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Magadheera: చరణ్ అభిమానులకు శుభవార్త.. థియేటర్లో రిలీజ్ కాబోతున్న.. ఎప్పుడో తెలుసా?

Published

on

Magadheera: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే తెలుగు థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ,రామ్ చరణ్,ఎన్టీఆర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అన్న వివరాల్లోకి వెళితే.. మగధీర సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్‌ బర్త్‌డే సందర్భంగా మగధీర చిత్రాన్ని 26న రీ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన మగధీర 2009 జూలై 30న విడుదలై, బ్లాక్‌ బస్టర్‌ హిట్ గా నిలిచింది.

రీ రిలీజ్‌..

Advertisement

దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్‌ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌బాబు రీ రిలీజ్‌ చేస్తున్నారు. మగధీర చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్‌ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి అని తెలిపారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌ బాబు.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: బోయపాటి డైరెక్షన్లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ఫిక్స్ చేసిన బాలయ్య?

Published

on

Mokshagna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఈయనకు వయస్సు మీద పడుతున్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక బాలయ్య వారసుడి రాక కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Mokshagna

మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి అభిమానులను ఊరిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు కానీ గత ఏడాది బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాది తన కుమారుడు సినీ ఎంట్రీ ఉంటుందని తెలిపారు.. ఇకపోతే మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం అవుతారన్న సందేహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకసారి అనిల్ రావిపూడి పేరు వినిపించగా మరోసారి బోయపాటి పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఇప్పటికే వీరిద్దరూ స్క్రిప్ట్ గురించి కూడా డిస్కషన్స్ పూర్తి చేశారని ఇక త్వరలోనే ఈ సినిమా పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య తన కొడుకు ఎంట్రీ బోయపాటి పైనే భారం వేసారని తెలుస్తోంది ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

బోయపాటి పైనే భారం..
ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా మరొక వార్త వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి టైం ఫిక్స్ చేశారని ఇక ఈయన బోయపాటి డైరెక్షన్ లోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. మాస్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ తన కుమారుడి మొదటి సినిమా కూడా ఇలాంటి యాక్షన్ టచ్ ఇస్తేనే బాగుంటుందని భావించినటువంటి బాలయ్య బోయపాటిని ఫిక్స్ చేశారట.

Advertisement
Continue Reading

Featured

Venkata Chaitanya: ప్రతి ఒక్కటి తిరిగి ఇచ్చేయాల్సిందే.. వైరల్ అవుతున్న నిహారిక మాజీ భర్త పోస్ట్!

Published

on

Venkata Chaitanya: జొన్నలగడ్డ వెంకట చైతన్య పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ నిహారిక మాజీ భర్తగా ఈయన ఎంత గుర్తింపు పొందారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె తన పెళ్లి విడాకులు అలాగే రెండో పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇందుకు కౌంటర్ గా తన మాజీ భర్త సైలెన్స్ సైలెన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన పరోక్షంగా నిహారికను ఉద్దేశిస్తూ తనకు కౌంటర్ ఇస్తూనే ఇలాంటి పోస్టులు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయినటువంటి చైతన్య తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

పాజిటివిటీని పెంచాలి..
చాలా రోజుల తర్వాత ఇలా మళ్లీ రాసుకు వస్తున్నాను. ఇంస్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయిన తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంచమైనా పాజిటివిటీని పెంచాలని అనుకుంటున్నాను అంటూ ఈయన పోస్ట్ చేయడంతో ఇది చూసినటువంటి నేటిజన్స్ కచ్చితంగా ఇది నిహారికను ఉద్దేశించి చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు విడిపోయిన సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ఇలా పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!