సోను సూద్… ప్రస్తుతం భారతదేశంలో బాగా వినిపిస్తున్న పేరు. ఎవరైనా ఆపదలో ఉంటే నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్న రియల్ హీరో సోనుసూద్. సోను సూద్ విషయానికి వస్తే ఆయన పంజాబ్ రాష్ట్రంలోని మిగా అనే పట్టణంలో జన్మించారు.
నాగపూర్ నగరంలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో ఆయన విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆ తర్వాత ఆయన మోడలింగ్ రంగంలోకి ఎంటరయ్యారు. ఆ సమయంలో ఫ్యాషన్ షో, రాంప్ వాక్ చేసేవారు. కాపాడండి ఆయనకు సినిమాల్లో విలన్ అనే బలమైన కోరిక బలపడింది. ఆయన నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు. దింతో ఆయన 1999 లో కుళ్ళళలగర్ అనే తమిళ సినిమా ద్వారా సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో చిత్రరంగంలోకి అడుగు పెట్టాడు. ఆ తరువాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కూడా నటించాడు. కాకపోతే ఆయనకు బాలీవుడ్ సినిమాలో నటించాలని బలమైన కోరిక ఉండేది. 2002 లో వచ్చిన షాహిద్-ఏ-ఆజం అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర ద్వారా ఆయన బాలీవుడ్ లోకి ప్రవేశించాడు. ఆపై మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ లో అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించాడు. ఇక టాలీవుడ్ లో నాగార్జున సరసన సూపర్ సినిమాలో హైటెక్ దొంగగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి మరిచిపోలేని విధంగా అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో ఆయన మంచి పేరు సాధించాడు. ఆ సినిమాకు ఉత్తమ విలన్ గా నంది పురస్కారం కూడా లభించింది.
అయితే ప్రస్తుతం భారత దేశం లో కరోనా పరిస్థితి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం వల్ల ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారు. అంతేకాదు ఆ సమయంలో ఎక్కడి వారు అక్కడే ఉండి పోవాల్సిన పరిస్థితి వచ్చిపడింది. దీంతో చాలామంది చేసుకోవడానికి పనులు లేక, ఊరికి వెళ్లడానికి కూడా రవాణా సదుపాయం లేక అనేకమంది ఇబ్బందులు పడ్డారు. పొట్టకూటికోసం చాలామంది వారి సొంత ఊరిని వదిలి ఎక్కడికో వెళ్లి బతికే వలస కూలీల పరిస్థితి ఐతే చాలా ఘోరంగా మారింది. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి సహాయం అందించడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్న అందరికీ చేయలేకపోయాయి. ఇక ఆ సమయంలో ప్రభుత్వాలు అందజేసిన సహాయం అందుకోలేక, వారి సొంత ఊరికి వెళ్లలేక ఉన్నచోటే తినడానికి తిండి, ఉండటానికి నీడ లేక అనేకమంది వలస కూలీలు చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి సంఘటనలు చూసి చెలించిన ఓ రీల్ విలన్ రియల్ హీరో గా మారాడు. అనేకమంది నిరాశ్రయులను ఆదుకోవడానికి ఆయన బయటికి వచ్చారు. ఏ సినిమా హీరో చేయలేని విధంగా ఆయన అందరితో రియల్ హీరో అనిపించేలా పనులు చేసాడు. ఎవరో వస్తారు… ఏదో చేస్తారు అనుకుంటున్న సమయంలో సోను సూద్ దేవుడి గా మారాడు. వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకు వారందరిని రైళ్లు, బస్సు, ఫ్లైట్స్ ద్వారా వారందరిని వారి సొంత ఊరికి పంపించాడు ఆయన.
ఇక 10 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ఓ రైతు పడిన కష్టాలు చూసి చలించి తానున్నానంటూ విషయం తెలిసిన మూడు గంటల్లోనే ఆ రైతుకు ట్రాక్టర్ కొనిచ్చి తన మానవత్వం మరోమారు చూపించాడు. ఇక తాజాగా సాఫ్ట్ వేర్ కూరగాయల శారదకు ఉద్యోగం ఇప్పించాడు కూడా. అయితే ఇందరికి సహాయం చేస్తున్న సోనూసూద్ కు ఆస్తి దండిగా ఉంది కాబట్టే ఆయన అంతలా ఖర్చు పెడుతున్నాడని వితండ వాదాలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయితే నిజానికి సోను సూద్ కు ఎంత ఆస్థి ఉంది, ఆయన ఎలా దానిని సంపాదించాడు అన్న సంగతులు చూస్తే… ఈ విషయంపై తాజాగా ఓ సంస్థ అధ్యయనం చేయగా, సోనుసూద్ ఆస్తుల విలువ రూ. 130 కోట్లు అని తెలిపింది. సోను సూద్ గడిచిన 20 సంవత్సరాల నుండి వివిధ భాషలలో సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ వేస్తూ సంపాదించిన కష్టమే అతని ఆస్తి. బాలీవుడ్ లో అత్యధికంగా రెవెన్యూ రేషన్ తీసుకునే విలన్ లలో సోను సూద్ కూడా ఒకడు. ఇక తాజాగా ఆయన ప్రజల కోసం పది కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు అధ్యయనంలో తేలింది. ముందు ముందు కూడా ఎవరికైనా సహాయం కావాలంటే నేనున్నానంటూ సోనూసూద్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన చెప్పుకొచ్చారు. సినిమాలలో ఆయన విలన్ క్యారెక్టర్ వేస్తున్న, ఆయన రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా మిగిలిపోయాడు. చాలా మంది రీల్ హీరోలను కాదు రియల్ హీరోలను అవుదాం అంటూ సోను సూద్ ను ఫాలో అయిపోతున్నారు చాలామంది.
Pitapuram: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఎన్నికల హడావిడి మొదలైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరి జెండా ఎగురుతుందన్న విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇలా పిఠాపురం పైన ఇంత ఆసక్తి రావడానికి కారణం అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే కారణమని చెప్పాలి.
గత ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం కాపులు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలోనే ఈయనకు పోటీగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఎవరు గెలుస్తారో అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఎన్నో చానల్స్ వారు ప్రజా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. వంగా గీత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ అంతేకాకుండా ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కూడా ఈమె కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో వంగా గీత కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.
Advertisement
జనసేనదే విజయమా.. ఇకపోతే వంగా గీత 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు అయితే అప్పట్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిన పిఠాపురానికి చేయాల్సినటువంటి న్యాయం చేయలేకపోయారని అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నామంటూ చాలామంది ప్రజలు పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తున్నారంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి చూడాలి మరి పిఠాపురంలో ఏ జెండా ఎగురుతుంది వంగా గీత పవన్ కళ్యాణ్ కి ఎలా పోటీగా నిలబడతారు అనేది తెలియాల్సి ఉంది.
AP politics: రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగిపోతుంది కానీ తెలుగుదేశం పార్టీతో జనసేన బిజెపి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే ఇలా కూటమిగా ఏర్పడి ఎన్నికలలో గెలిచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించాలని ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించారు.
ఇలా ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతున్నటువంటి తరుణంలో కొన్ని నియోజకవర్గాలలో పార్టీల కోసం ఎంతో కష్టపడినటువంటి వారికి సీట్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోనే జనసేనలోనూ కూడా అభ్యర్థులు అలకలు మొదలుపెట్టారు. ఇటీవల బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ సీటు జనసేన పార్టీకే కేటాయిస్తారని, పార్టీ తరపున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు.
ఇలా బిజెపికి సేటు కేటాయించడంతో మహేష్ ఏకంగా జనసేన పార్టీ కార్యాలయం ముందు రెండు గంటల పాటు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈయనని పవన్ కళ్యాణ్ పిలిపించుకొని తనని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవి తప్పకుండా ఇస్తామని చెప్పిన మహేష్ మాత్రం తనకు టికెట్ కావాలని కోరారు.
Advertisement
పొత్తు ధర్మాన్ని పాటించండి.. ఇలా అభ్యర్థులు సహకరించకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.పొత్తు ధర్మాన్ని పాటిద్దామని కూటమిని గెలిపిద్దామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్నోట్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఆ పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
AP Politics: ఏపీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సభలో తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో రాష్ట్ర తెలుసనీ, తన చెల్లెలు షర్మిల సునీతను కూడా తమ రాజకీయాలలో పావులుగా వాడుకున్నారని తెలిపారు.
నా చెల్లెమ్మలు ఇద్దరూ కూడా హంతకులకే మద్దతు తెలుపుతున్నారని జగన్ మండిపడ్డారు. చెల్లెమ్మలు చిన్నాన్నను చంపిన వారితో చేతులు కలపగా నేను మాత్రం ప్రజల పక్షమే ఉంటానని జగన్ తెలిపారు. ఇలాంటి హంతకులతో అవినీతిపరులతో యుద్ధం చేయడానికి ఈ అర్జునుడు సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ ఈ కార్యక్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
Advertisement
కూటమి అంటే కుట్రలు.. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడికి 45 ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపి, ఆయన విగ్రహాలకు పూలమాలలు వేశారని అన్నారు. కూటమి అంటే కుట్రలు కుతంత్రాలని జగన్ తెలిపారు. తమ జెండా మాత్రం మరో జెండాతో జతకట్టలేదని చెప్పారు. కేంద్రం నుంచి ఓ పార్టీని తెచ్చుకున్నారని అన్నారు. ఇటీవల చోటుచేసుకున్న డ్రగ్స్ కేసు వెనుక చంద్రబాబు వదిన గారి చుట్టం ఉన్నారంటూ డ్రగ్స్ వ్యవహారంపై కూడా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.