ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సినిమా బ్యాక్ డ్రాప్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చి హీరోహీరోయిన్లుగా స్థిరపడిన వారు ఎందరో. అయితే ఇది వరకు కాలంలో మాత్రం ముందుగా నాటకాలలో నటించి ఆ అనుభవంపై సినిమాలలోకి వచ్చి పేరు పొందిన వ్యక్తులు ఎందరో. ఇలా ఇదివరకు కాలంలో ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఆయన కష్టాలు పడి సినిమాల్లో నిలదొక్కుకున్న వ్యక్తి పి.ఎల్.నారాయణ. ఈయన నిజానికి మళయాల కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే ఈయన పుట్టుక గుంటూరు జిల్లా, బాపట్ల నగరంలో జరిగింది. ఇక అక్కడే బాల్యం లో విద్యనభ్యసించి ఆ తర్వాత ఒంగోలు ప్రజానాట్యమండలి ద్వారా కుక్క అనే నాటకం రాశారు. నాటకానికి జాతీయ అవార్డు కూడా దక్కింది. దీంతో ఆయనకు సినిమాలలో అవకాశం దక్కేలా చేసింది.
ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లాయర్, బడిపంతులు, రాజకీయ నేత, కార్మిక నేత, బిక్షగాడు, తాగుబోతు ఇలా ఎలాంటి పాత్ర అయినా సరే నూటికి నూరు శాతం న్యాయం చేకూర్చారు. ఇలా నారాయణ తెలుగు, తమిళ చిత్రాల్లో కలిసి ఏకంగా 300 చిత్రాలకు పైగా ఆయన నటించారు. ఇకపోతే ఈయన కుటుంబం నుంచి మరో టాప్ హీరోయిన్ కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన సంగతి చాలా మందికి తెలియదు. ఆయన కుటుంబం నుంచి హీరోయిన్ గా చేసిన ఆవిడ ఎవరో కాదండి… టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అయిన శ్రీకాంత్ భార్య ఊహ. అవును… ఊహకు పి.ఎల్.నారాయణ స్వయానా మేనమామ.
ఇక ఊహ విషయానికి వస్తే, ఊహ మొట్టమొదటగా తమిళ సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఊహ అసలు పేరు శివరంజని. ఆవిడ తెలుగులో నటించకు ముందే తమిళంలో 20 సినిమాలకు పైగా నటించారు. అక్కడ ఆవిడ ఒకానొక దశలో స్టార్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈవివి సత్యనారాయణ గారు నిర్మించిన ఆ చిత్రంలో శివరంజని పేరును కాస్తా ఊహ గా మార్చేసి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు ఆవిడ చేస్తూ ఉండగా.. అందులో హీరో శ్రీకాంత్ తో అత్యధికంగా సినిమాలను చేసేవారు. ఇకపోతే ఆ సినిమాల నేపథ్యంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మొదటగా వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి వారి ఇంట్లో అడ్డు చెప్పడంతో వారు బయటికి వెళ్లి వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ ఇప్పుడు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కూడా ఉన్నారు.
అయితే టాలీవుడ్ లో ఊహ అనేక చిత్రాలను చేయగా మొదటి సినిమా అలాగే చివరి సినిమా కూడా తన భర్త శ్రీకాంత్ తో చేసినది కావడం విశేషం. ఇకపోతే ప్రస్తుతం వీరి పిల్లలు కూడా సినిమాలలో నటించిన సంగతి చాలా మందికి తెలియదు. శ్రీకాంత్ ఊహ ల కుమార్తె గుణశేఖర్ నిర్మించిన రుద్రమదేవి సినిమాలో రుద్రమదేవి చిన్ననాటి క్యారెక్టర్ రోల్ లో నటించింది. అలాగే పెద్ద కొడుకు రోషన్ అక్కినేని నాగార్జున నిర్మించిన నిర్మల కాన్వెంట్ సినిమాలో హీరోగా నటించి మెప్పించాడు. ఇకపోతే శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన హీరోగా మాత్రమే కాకుండా వివిధ రకాల క్యారెక్టర్స్ చేసుకుంటూ తనదైన మార్క్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో చూపించాడు. ప్రస్తుతం ఆయన అనేక వ్యాపారాలు చేసుకుంటూ వీలు దొరికినప్పుడల్లా సినిమాలలో నటిస్తున్నారు.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.