ముకేష్ అంబానీ.. అనిల్ అంబానీ.. ఈ అంబానీ బ్రదర్స్ గురించి తెలియని భారతీయులుండరు. తండ్రి ధీరూభాయ్ అంబానీ హఠాత్తుగా మరణించేసరికి వీళ్ళిద్దరికీ ఆస్తుల పంపకాలలో విభేధాలొచ్చాయి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ గొడవలు సద్దుమణి అన్నదమ్ములిద్దరూ తండ్రి ఆస్తులను పంచుకున్నారు. ఆ తరువాత అనిల్ అంబానీ బిలియనీర్ అయ్యాడు. రెండవ స్థానంలో ముకేష్ నిలిచాడు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి.. అనే సామెతకు ప్రతిరూపంగా అనిల్ అంబానీ బిలియనీర్ స్ధానాన్ని కోల్పోయాడు. ముకేష్ అంబానీ ప్రపంచంలోనే టాప్ బిలియనీర్ల జాబితాలో స్ధానం దక్కించుకున్నాడు. వీళ్ళిద్దరి బిజినెస్ స్టోరీలోని ట్విస్ట్ ఏమిటంటే..
తండ్రి మరణాంతరం ఇద్దరికీ ఆస్తి సమానంగా వచ్చింది. కానీ దాన్ని కాపాడుకోవడంలో ముకేష్ అంబానీ సక్సెస్ అయితే.. అనిల్ అంబానీ ఫెయిలయ్యీడు. ఇలా ఎందుకు జరిగింది.? ముకేష్ అంబానీ సక్సెస్ సీక్రెట్స్ ఏమిటి.? అనిల్ అంబానీ ఫెయిల్యూర్కు గల కారణాలేమిటి.? ఈ అంశాలను మనం ఒక్కసారి పరిశీలిస్తే ధీరూభాయ్ అంబానీ బ్రతికుండగా రిలయన్స్ కంపెనీలు అన్నీ కలసి మెలసి ఉండేవి. ఆ సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి గ్యాస్ చాలా తక్కువ ధరకే రిలయన్స్ పవర్కు సప్లై అయ్యేది. కానీ అన్నదమ్ములిద్దరూ విడిపోయాక రిలయన్స్ ఇండస్ట్రీస్ ముకేష్ చేతికి, రిలయన్స్ పవర్ అనిల్ చేతికి వెళ్లిపోయాయి. ఆ కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తక్కువ ధరకు గ్యాస్ అమ్మలేమని, మార్కెట్ ధర ప్రకారం గ్యాస్ ఇస్తామని, కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు.. అంటూ రిలయన్స్ పవర్కు ఖరాఖండిగా చెప్పేసింది. దాంతో అనిల్ అంబానీ ఆధ్వర్యంలో నడిచే రిలయన్స్ పవర్ ఎక్కువ మొత్తానికి గ్యాస్ను కొనుగోలు చేసి పవర్ ప్లాంట్కు వాడాల్సి వచ్చింది. అది అప్పట్లోనే అనిల్ అంబానీకి కోలుకోలేని దెబ్బ. దాంతో ఆ కంపెనీ చాలా వరకు నష్టపోయింది. ఆ తరువాత ఆ నష్టాలు అలాగే కొనసాగుతూ వచ్చాయి. ఇది ముకేష్ అంబానీకి మొదటి సక్సెస్ కాగా.. అనిల్కు మొదటి లాస్గా నిలిచింది.
ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్లో వచ్చే లాభాలను ముకేష్ అంబానీ చాలా తెలివిగా ఖర్చు పెట్టేవారు. దేశంలో చిల్లర వ్యాపారానికి ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఆయన రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ డిజిటల్, ట్రెండ్స్, ట్రెండ్స్ ఫుట్వేర్ పేరిట అనేక స్టోర్స్ను ఓపెన్ చేశారు. అవి మారుతున్న కాలానికి తగినవిధంగానే సక్సెస్ అయ్యాయి. కానీ అనిల్ అంబానీ మాత్రం రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అంటూ సినిమాల్లో డబ్బును పెట్టుబడి పెట్టారు. సినిమా ప్రపంచం గురించి మనకు తెలిసిందే కదా..! అందులో లాభం కన్నా నష్టమే ఎక్కువగా వస్తుంటుంది. ఆ 2వ కారణంతో అనిల్ అంబానీ తను ఊహించని విధంగా నష్టపోయాడు. ఇది ఆయనకు తగిలిన రెండో దెబ్బ. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు అప్పట్లో ఎంతో క్రేజ్ ఉండేది. అయితే భవిష్యత్తులో మొబైల్స్ వాడకం, ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుందని అప్పట్లోనే ఊహించిన ముకేష్ చాలా జాగ్రత్తగా ప్లాన్ వేసి, పకడ్బందీగా కొన్ని సంవత్సరాల పాటు శ్రమించి జియో నెట్వర్క్ను నిర్మించారు.
ఆ తరువాత అది ఎలా లాభాల బాటలో పరుగులెట్టిందో అందరికీ తెలుసు. ఆయన ముందు చూపు కారణంగా జియో ఇప్పుడు మహా సామ్రాజ్యంగా అవతరించింది. భవిష్యత్తులో టెక్నాలజీ ఏవిధంగా మారుతుందో ముకేష్ ముందే ఊహించి జియోలో పెట్టుబడి పెట్టి సక్సెస్ సాధించారు. కానీ అనిల్ మాత్రం రిలయన్స్ కమ్యూనికేషన్స్ను పట్టించుకోలేదు. దీంతో జియో రాగానే ఆ సంస్థ భారీగా నష్టపోయింది. అనిల్ అంబానీ ఫెయిల్యూర్లో రిలయన్స్ కమ్యూనికేషన్దే కీలకపాత్ర వహించిందని చెప్పవచ్చు. దాదాపుగా ఆ సంస్థ నష్టాల వల్లే ఆయన బిలియనీర్ స్ధానాన్ని కోల్పోయారు. కానీ ముకేష్ మాత్రం జియో ద్వారా లాభాల బాట పట్టారు. అనేక విదేశీ కంపెనీలు ఇప్పుడందులో వాటాలు కొంటున్నాయి. ఇది ముకేష్ సాధించిన మరో విజయానికి నిదర్శనం. ముకేష్ అంబానీకి సహజంగానే ముందు చూపు ఎక్కువ. అందుకనే ఆయన తన కంపెనీల ద్వారా వచ్చే లాభాలను ఎప్పటికప్పుడు కొత్త కంపెనీలు పెట్టేందుకు ఉపయోగించారు. అది కూడా చాలా తెలివిగా ప్లాన్ చేశారు. భవిష్యత్తులో ఏయే రంగాలకు డిమాండ్ ఉంటుందో ఆయన ముందుగానే పసిగట్టారు. అందుకు అనుగుణంగానే ఆయన ఆయా కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా విజయం సాధించారు. కానీ అనిల్ మాత్రం విలాసాలు, నిర్లక్ష్యంగా ఉండడం, ముందు చూపు లేకపోవడం, ఆస్తిని కాపాడుకునే యత్నాలు చేయకపోవడంతో నష్టాల బాట పట్టాడు. ఇప్పుడు దివాలా తీశాడు.
ముకేష్ అంబానీ అందరు ధనికుల్లా కాదు. ఆయన ఎప్పుడూ సాదాసీదాగా ఉంటారు. ఆయన సంతానం కూడా అంతే. కానీ అనిల్ అంబానీ మాత్రం అలా కాదు. విలాసాలకు దగ్గరగా ఉండేవాడు. డబ్బును నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టేవాడు. అదే ఇప్పుడాయన కొంప ముంచిందని మేధావులు చెబుతున్నారు. ముకేష్ అంబానీ చాలా తెలివిగా, ముందు చూపుతో వ్యాపారం చేసి సక్సెస్ అయ్యారు. కానీ అనిల్ కి అవేవీ లేకపోవడంతో నష్టాల ఊబిలో చిక్కుకున్నాడు. చివరకు బ్యాంకులకు డబ్బులను ఎగ్గొట్టిన దగాకోరుగా చరిత్రపుటల్లో నిలబడ్డాడు. విదేశీ కంపెనీలకు రావల్సిన డబ్బులు చెల్లించడంలో అనిల్ అంబానీ విఫలమైతే.. ముకేష్ అంబానీ మాత్రం విదేశీ కంపెనీలే తన జియోలో పెట్టుబడులకు వచ్చేలా చేసుకున్నారు. ఇదీ.. ఈ ఇద్దరి మధ్య ఉన్న తేడా. అనిల్ అంబానీకి రుణాలను ఇచ్చేందుకు కూడా ఇప్పుడు బ్యాంకులు ముందుకురావడం లేదు. దీంతో అనిల్ అంబానీ భవిష్యత్ ప్రస్తుతం అన్న ముకేష్ చేతుల్లోనే ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితి ఇలా ఎంత కాలం ఉంటుందో చెప్పలేం. కానీ వ్యాపారానికి పెద్ద ఎత్తున అప్పులు తీసుకుని నష్టాలు రావడంతో అనిల్ విఫలమైతే.. ముకేష్ మాత్రం పెట్టుబడులను ఆహ్వానిస్తూ లాభాల బాట పట్టారు. అనిల్ ఫెయిల్యూర్, ముకేష్ సక్సెస్ను చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. రిలయన్స్ ఇండస్ట్రీస్లో పెట్రోల్ సంస్థే పెద్ద కంపెనీ. అలాగే టాటా గ్రూప్ వారికి టీసీఎస్ పెద్ద కంపెనీ.. ఆయా గ్రూప్లలో ఉన్న ఇతర కంపెనీలకు నష్టాలు వస్తే ఆదుకునేందుకు ఆ పెద్ద కంపెనీలు ఉన్నాయి.
కానీ అనిల్ అంబానీకి చెందిన గ్రూప్ కంపెనీల్లో నిజానికి ఇలాంటి పెద్ద కంపెనీ ఒక్కటీ లేదు. దీంతో ఆయన సహజంగానే దివాలా తీయాల్సి వచ్చింది. ముకేష్ అంతగా సక్సెస్ అవడానికి కారణం ఆయనకున్న రిలయన్స్ చమురు బిజినెసే అని చెప్పవచ్చు. అందులో వచ్చిన లాభాలనే ఆయన ఇతర సంస్థలకు పెట్టుబడిగా పెట్టి సక్సెస్ సాధించారు. ముకేష్ అంబానీ దేశంలో, రాష్ట్రాల్లో అధికారాల్లో ఉండే రాజకీయ పార్టీలు, నాయకులతో సత్సంబంధాలు కొనసాగించేవారు. ఆయన వ్యాపారాలు సజావుగా, సుదీర్ఘకాలం పాటు విజయవంతంగా నడిచేందుకు ఇది కూడా ఒక కారణమే. కానీ అనిల్ మాత్రం ఇలాంటివేవీ పట్టకుండా ఉండేవారు. దీంతో అది ఆయన పతనానికి కారణమైంది.
ముకేష్ అంబానీ సక్సెస్ సాధించేందుకు కారణమైన వ్యాపారాల్లో ఐపీఎల్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కూడా ఒకటి. ఆ టీం ఐపీఎల్లో పలు టోర్నీలు సాధించింది. ఈ క్రమంలో ఆ ఫ్రాంచైజీకి ఆదాయం కూడా బాగానే వచ్చింది. అలాగే ఆ టీం పేరిట ఆయన భార్య నీతా అంబానీ అనేక చారిటీ కార్యక్రమాలు చేపట్టింది. దీంతో ఆమె కూడా బాగానే పాపులర్ అయ్యారు. ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కానీ అనిల్ అంబానీ ఇలాంటి విషయాలకు దూరంగా ఉన్నారు. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థలు, జియోపై ప్రజలకు నమ్మకం బాగా కుదిరింది. నాణ్యమైన సేవలను అందిస్తుండడంతో ఆ కంపెనీకి వారు దగ్గరయ్యారు. ముకేష్ సక్సెస్ వెనుక ఉన్న కారణాల్లో ఇది కూడా ఒకటి. దీంతోపాటు ముకేష్ పిల్లలు కూడా ఆయన వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించే స్థాయికి ఎదిగారు. ఏ పారిశ్రామిక వేత్తయినా కోరుకునేది అదే కదా.. అందుకనే ఆయన అనిల్ కన్నా విజయవంతమైన వ్యక్తిగా నిలిచారు. నమ్మకం, ముందుచూపు ఈ రెండూ విజయానికి మూలస్తంభాలనే జీవిత సత్యాన్ని మనం ముకేష్ అంబానీ సక్సెస్ స్టోరీ ద్వారా తెలుసుకోవచ్చు.
Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.
ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.
Advertisement
జగన్ అంటే అభిమానం.. ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.
Advertisement
కార్తీకదీపం డాక్టర్ బాబు.. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.
Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.
ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.
ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.
Advertisement
సీతాఫలం.. అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.