మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ సినిమా అంటే ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరిలో లాగే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకు కారణం ఆయన సినిమాలో మాటలే తూటాల్లా దూసుకెల్తాయి కాబట్టి. కొన్ని డైలాగులు జనాల మనసులను గట్టిగా తాకుతాయి.
ప్రతీ అక్షరం, పదం ఎంతో జాగ్రత్తగా అమర్చి త్రివిక్రం రాసే డైలాగ్స్ కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్ కలిగిస్తాయి. మనకి వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు..రానిది ట్రై చేయకూడదు. జులాయి సినిమాలో త్రివిక్రం రాసిన డైలాగ్. ఇది ఎంతమంది తమకి తాము ఆపాదించుకున్నారో లెక్కేలేదు.
బాచిరెడ్డి చస్తే మీరు సీఎం అవుతారు..అతణ్ని చంపితే మీరు హంతకుడవుతారు..ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు.. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏమీ ఉండదు.. మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది, భయం వేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటే బావుంటుంది, గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పొచ్చు కానీ గుండెల్లో ఉన్న మాట కళ్లతోనే చెప్పగలం, అందంగా ఉండటం అంటే మనకి నచ్చినట్టు ఉండటం.. ఎదుటి వారికి నచ్చినట్టు ఉండటం కాదు.. నిజం చెప్పేటప్పుడే భయమేస్తుంది నాన్నా.. చెప్పకపోతే ఎప్పుడు భయమేస్తుంది.. ఇలాంటి ఎన్నో డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
అందుకే ఆయన మాటల మాంత్రీకుడు అయ్యారు. సామాన్య ప్రేక్షకుడికి కూడా త్రివిక్రం రాసే మాటలు హృదయంలోకి దూసుకు వెళతాయి. అందుకే త్రివిక్రం సినిమాలకి అన్నీ వర్గాల ప్రేక్షకులు ఉంటారు. అయితే ఆయన త్రివిక్రం సినిమాలలో చాలా వరకు కాపీ సన్నివేశాలుంటాయని తరచూ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో వచ్చిన అతడు, ఖలేజా, జులాయి, అ..ఆ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అలాగే గత చిత్రం అల వైకుంఠపురము లో లాంటి సినిమాలలో కొన్ని సీన్స్ ఆయన హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ చేశారని ప్రచారం జరిగింది.
అ..ఆ సినిమాను అప్పటి మీనా నవల, చిత్రం ఆధారంగా తీసినట్టు ఆయనే ఒప్పుకున్నారు. అలాగే అల్లు అర్జున్ – పూజా హెగ్డే జంటగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా కూడా సీనియర్ ఎన్.టి.ఆర్ నటించిన ఇంటిగుట్టు అనే సినిమాకి కాపీ అని ప్రచారం జరిగింది. సినిమాకి ముందు జరిగిన ప్రచారమే తర్వాత సినిమా రిలీజయ్యాక కూడా చేశారు. ఇవన్నీ జనాలు పట్టించుకోలేదు. అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది. 2020 సంక్రాంతి బరిలో దిగి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.
ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి థమన్ మ్యూజిక్ ప్రధాన కారణం అయింది. భారీ మ్యూజికల్ హిట్ గా నిలిచిన అల వైకుంఠపురములో చిత్రానికి విమర్శకుల ప్రశంసలు, అవార్డులు దక్కాయి. అంతేకాదు తాజాగా సాక్షి అవార్డ్స్లో కూడా అల వైకుంఠపురానికి 5 అవార్డులు దక్కడం గొప్ప విశేషం.
ఈ సినిమాకు గానూ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా హీరోయిన్ పూజా హెగ్డే, ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్, ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత రాధా కృష్ణ, ఉత్తమ సంగీత దర్శకుడిగా థమన్ అవార్డులను దక్కించుకున్నారు. కాపీ మరకలంటించిన అల వైకుంఠపురములో చిత్రానికి ఇలా అవార్డుల పంట పండటం మాత్రం గొప్ప విశేషం.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.