Connect with us

Featured

సమంత, శర్వానంద్ “జాను” సినిమా రివ్యూ !!

Published

on

హీరో శర్వానంద్, టాలీవుడ్ క్వీన్ సమంత అక్కినేని జంటగా నటించిన చిత్రం జాను. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ చిత్రం, తమిళనాట సంచలన విజయం సాధించిన 96 సినిమాకు రీమేక్. ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించగా.. “96” చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ “జానూ” సినిమాకి కూడా ఈయనే దర్శకుడిగా కొనసాగారు. ఆ చిత్రానికి మ్యూజిక్ అందించిన గోవింద వసంత ఇక్కడ కూడా సంగీతం చేసారు. అయితే ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ సినిమా కధ ఏమిటి? “జాను” గా సమంత మెప్పించిందా ? తన నటనతో శర్వానంద్ ప్రేక్షకులను మరిపించగలిగాడా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం తెలుగునాట రీమేక్ ల పర్వం నడుస్తుంది. ఇది వరకు చాలా సినిమాలు ఇక్కడ రీమేక్ అయ్యాయి. అయితే రీమేక్ అయినా సినిమాలు అన్నీ హిట్ అవుతాయని గ్యారెంటీ లేదు. కానీ మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే రీమేక్ సినిమాలు అయినా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు. ఇదివరకే ఇది చాలా సార్లు రుజువయ్యింది. అయితే రీమేక్ సినిమాలకు ఉన్నన్ని కష్టాలు, కంపేరిజన్లు రెగ్యులర్ సినెమాలకు ఉండవు. సినిమా కథతో పాటుగా ఇక్కడ నేటివిటీకి తగ్గట్టుగా కొంచెం మార్పులు చేర్పులు చేస్తుంటారు దర్శకులు. అందులో తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా అక్కడ విజయ్ సేతుపతి నటనకు, ఇక్కడ శర్వానంద్ నటనను పోల్చడం మొదలుపెడతారు. అక్కడ కథానాయికగా నటించిన త్రిష నటనకు ఇక్కడ సమంత నటనను పోల్చడం వంటివి నాచురల్ గానే జరుగుతుంటాయి. వీటి గురించి లోతుగా విశ్లేషణకూడా సోషల్ మీడియాలో మొదలైంది.

Advertisement

ఇన్ని విశ్లేషణలు, పోలికల మధ్య “జాను” ప్రేక్షకులను ఆకట్టుకోవడం మెమోలు విషయంకాదు. ఇక కథలోకి వెళితే లైఫ్ ఆఫ్ రామ్ అనే పాటతో మొదలైన ఈ సినిమా, చాలా సంవత్సరాల తరువాత స్కూల్ రెయూనియన్ వేడుకలో కలుసుకున్న ప్రేమ జంట. రామ్ & జాను ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం, ప్రేమ ఉన్నా ఎప్పుడూ చెప్పుకోకపోవడంతో కలవలేకపోతారు. ఫ్లాష్ బ్యాక్ స్కూల్ ఎపిసోడ్ మాత్రం హైలైట్ గా నిలిచింది. అందరిని ఆకట్టుకుంటుంది. చిన్ననాటి రామ్, జానూ పాత్రలు చూడ చక్కగా ఉంటాయి. అయితే రెయూనియన్ తరువాత పెళ్లి చేసుకుని సింగపూర్ లో సెటిల్ అయి ఏకాంతంగా గడపాలని భావిస్తారు.. ఆ చిన్నపాటి ప్రయాణంలో జరిగే మధుర క్షణాలు, తరువాత ఏమి జరుగుతుంది అనేది మీరు వెండితెరపై చూడాల్సిందే. తమిళంలో “96” చిత్రాన్ని చూడకుండా “జాను” చిత్రాన్ని చుసిన వారికీ మాత్రం ఈ సినిమా మంచి ఫ్రెష్ అనుభూతినిస్తుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే ముందుగా టైటిల్ పాత్ర పోషిస్తున్న మన “జాను” సమంత గురించి చెప్పుకోవాలి. పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ సమంతకి కొత్తేమీకాదు కానీ ఈ చిత్రంలో ఆమె నటనతో ఆమె కెరీర్లో మరో అద్భుతమైన పాత్ర పోషించింది. హీరో శర్వానంద్ తో కెమిస్ట్రీని అద్భుతంగా పండించింది. ఆమె తప్ప వేరే ఎవరిని “జాను” క్యారెక్టర్ లో ఊహించుకోలేనటగా ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను మరిపించింది. మొత్తానికి ఈ సినిమాకు మంచి మార్కులు కొట్టేసింది సమంత.

ఇక శర్వానంద్. మనస్సులోని బాధలు బయటకి అస్సలు బయటపెట్టకుండా క్రమశిక్షణ తో మెలిగే “రామ్” క్యారెక్టర్ లో శర్వానంద్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడనే చెప్పాలి. లవ్ ఫెయిల్యూర్ అయినా ప్రతి వ్యక్తి రామ్ పాత్రలో తమను తాము ఊహించుకుంటారు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగాడు తన నటనతో.. అయన నటనతో పాటుగా అయన వాయిస్ ఈ సినిమాకి మరో అదనపు బలం. శర్వానంద్ కెరీర్ బెస్ట్ సినిమాగా “జానూ” నిలుస్తుంది.

Advertisement

ఇతర పాత్రలలో “వెన్నెల కిషోర్”, శరణ్య (ఫిదా ఫెమ్), రఘుబాబు తదితరులు వారి పాత్రలకు తగ్గట్టుగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చిన్ననాటి స్కూల్ పాత్రలకు రామ్, జానూ పత్రాలు పోషించిన సాయి కిరణ్, గౌరీ కిషన్ అద్భుతంగా నటించారు. ప్రతి ఒక్కరిని తన దృశ్యకావ్యానికి కనెక్ట్ అయ్యేలా స్వచ్ఛమైన హావభావాలు రాబట్టుకోవడంలో దర్శకుడు “ప్రేమ్ కుమార్” సఫలం అయ్యారనే చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ లోని చిన్నప్పటి రామ్, జానూ క్యారెక్టలను సెలెక్ట్ చేయడంలోనే దర్శకుడు సగం విజయం సాధించాడు. ప్రేక్షకులు మళ్ళి మళ్ళి వచ్చి చూడటానికి ప్రేరేపించేలా అయన ఈ సినిమాని అద్భుతంగా “జాను”ను తెరకేకించారు. తమిళంలో చేసిన మ్యాజిక్ ఇక్కడ కూడా రిపీట్ చేయడం కోసం దర్శకుడు బాగానే కష్టపడ్డాడు. సంగీత దర్శకుడు గోవిందా వసంత కూడా తన సంగీతంతో ప్రేక్షకులను మైమరపించారు. మహేంద్రన్ జయరాజు ఛాయాగ్రహణం ఈ సినిమాకు మరో అసెట్.

ఇక ఫైనల్ గా కథలో కథనంలో ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా “96” చిత్రాన్ని అలాగే దింపేసాడు దర్శకుడు. సో 96 చిత్రాన్ని చూడని వారు ఈ చిత్రానికి బాగానే కనెక్ట్ అవుతారు. ఈ సినిమా కాస్త స్లో గా అనిపిస్తుంది. కానీ శర్వానంద్, సమంతల కెమిస్ట్రీ కోసం, సమంత, శర్వానంద్ ల నటన కోసం ఈ సినిమా కచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిందే.

ఇంకా ఏంటి అండి… రేటింగ్ కోసం చూస్తున్నారా ? సినిమా బాగుంది రేటింగ్ తో పనేముంది చూసేయండి ఒక పనైపోతుంది.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Pawan Kalyan: జగన్ సారా వ్యాపారి.. వచ్చేది రామ రాజ్యమే.. సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్!

Published

on

Pawan Kalyan: టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో చిలకలూరిపేట స‌మీపంలోని బొప్పూడిలో నిర్వ‌హించిన ప్రజాగళం భారీ సభను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాబోయే కురుక్షేత్ర సమరం తర్వాత ఏపీలో రాబోయేది రామ రాజ్యమేనని తెలిపారు. ప్రస్తుతం రావణాసురు పాలన సాగుతుందని త్వరలోనే రామరాజ్యం వస్తుందని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అధికారం డబ్బు అండతో విర్రవీగిపోతున్నారని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి రేటు పూర్తిగా పడిపోయిందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఒక సంక్షేమం లేదని అభివృద్ధి జరగలేదని నిరుద్యోగం పెరిగిపోయిందని తెలిపారు. ఈ కురుక్షేత్ర యుద్ధం తర్వాత రామరాజ్యం రాబోతుందని తెలిపారు. ఇక దేశమంతా డిజిటల్ రంగంలో ముందుకు దూసుకుపోతూ ఉండగా జగన్మోహన్ రెడ్డి మాత్రం మద్యం దుకాణాల వద్ద ఇంకా నగదు బదిలీ చేపడుతూ భారీగా దోచుకుంటున్నారని తెలిపారు. ఈయన ఒక సారా వ్యాపారి అంటూ పవన్ ఎద్దేవా చేశారు.

Advertisement

డ్రగ్స్ రాజధాని..
కేవలం మద్యం విషయంలో మాత్రమే కాదు ఇసుక తవ్వకాలలో కూడా జగన్ బినామీలు సుమారు 40 వేల కోట్ల వరకు దోచుకున్నారని పవన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాజధానిగా మారిపోయింది అంటూ జగన్ పరిపాలనపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు కురిపిస్తూ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అంటూ ఈ సందర్భంగా పవన్ తమ గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Continue Reading

Featured

AP politics: బాబుని సీఎం చేయటం మోడీ అజెండా కాదు.. ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణ!

Published

on

AP politics: ప్రస్తుతం జరగబోయే ఏపీ ఎన్నికలు ఎంతో రసవత్తరంగ మారాయి. జగన్ ఒక్కడే ఒక వైపు ఉండగా మరోవైపు జనసేన టిడిపి బిజెపి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఇలా ఈ పార్టీలన్నీ పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగబోతున్నటువంటి తరుణంలో మొదటిసారి చిలకలూరిపేట వద్ద ప్రజాగళం అనే పేరిట భారీ సభను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి పై ఎలాంటి విమర్శలు చేస్తారో అన్న విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు .అయితే ఈ సభలో మోడీ చేసిన వ్యాఖ్యల గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సభలో మోడీ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలోని మంత్రులు అవినీతికి పాల్పడ్డారు అంటూ ఈయన తెలిపారు. ఎక్కడ కూడా జగన్ గురించి మాట్లాడలేదు అలాగే రాజధానుల ప్రస్తావన తీసుకురాలేదు పోలవరం గురించి ప్రశ్నించలేదు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగన్ ప్రభుత్వంలోని మంత్రుల గురించి మాట్లాడారే తప్ప జగన్ గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు అలాగే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలి అని కూడా ఎక్కడా చెప్పలేదు. ఎన్డీఏకి ఓట్లు వేసి గెలిపించండి అని మాత్రమే కోరారని నాగేశ్వరరావు తెలిపారు. ఇక్కడ మోడీ గారికి చంద్రబాబు నాయుడుని గెలిపించడమే అజెండా కాదని ఈయన తెలిపారు.

Advertisement

జగన్ పై ఎక్కడ విమర్శలు చేయలేదు..
రేపు ఎన్నికలు జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు అలాగే జగన్ పార్టీకి చెందిన ఎంపీలు కూడా మోడీకి అవసరం కనుక ఈయన ఎక్కడ కూడా జగన్ కు ఓటు వేయొద్దని చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించండని చెప్పలేదు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలి అనే అజెండా కనుక ఉండి ఉంటే ఈ సభలో జగన్ పై విమర్శలు చేసేవారు కానీ మోడీ ఎక్కడ కూడా అలా ప్రసంగించలేదు అంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన అనాలసిస్ ద్వారా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

AP politics: పక్క వ్యూహంతో సింగిల్ గా జనాలలోకి దూసుకెళ్తున్న జగన్.. గెలుపే లక్ష్యంగా?

Published

on

AP politics: ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయింది. వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పొత్తులు లేకుండా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు కానీ మరోవైపు టిడిపి జనసేన బిజెపి కూటమిగా ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా భారీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

ఇక ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈయన ప్రాంతాలవారీగా సిద్ధం సభలను ఏర్పాటు చేసి నాయకులలోను కార్యకర్తలను ఫుల్ జోష్ నింపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రచార కార్యక్రమాలలో భాగంగా సరికొత్త వ్యూహాలను రచిస్తూ జనాలలోకి వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. ఈయన ఇప్పటికే ఏ నియోజకవర్గం లో ఎన్ని రోజులు పర్యటించాలి ఎక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి ఎక్కడ రోడ్డు షో చేయాలి అనే విషయాల గురించి పక్కాగా ప్లాన్ సిద్ధం చేశారని తెలుస్తోంది.

2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి 151 స్థానాలలో విజయకేతనం ఎగురు వేసినటువంటి వైసీపీ పార్టీ ఈసారి మాత్రం వై నాట్ 175 అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగబోతోంది తాము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99% అమలు పరిచాము. అందుకే వై నాట్ 175 అనే ధీమాతో జగన్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. 2019 ఎన్నికల ఫలితాలను ఈసారి కూడా రిపీట్ చేయాలని ఈయన తన అభ్యర్థులను కార్యకర్తలను కూడా సిద్ధం చేస్తున్నారు.

Advertisement

వై నాట్ 175
ఇలా వై నాట్ 175 అంటూ ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి సిద్ధం కాగా మరోవైపు కూటమిగా అన్ని పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి పై యుద్ధానికి మేము సిద్ధం అంటున్నారు. మరి ఈ ఐదేళ్ల ప్రజా పాలనకు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తున్నారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!