Connect with us

Featured

షాకింగ్ ట్విస్ట్.. హిమను చంపింది నేనే.. కనిపించే పిశాచి ఆ మోనిత!

Published

on

స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. గత ఎపిసోడ్ లో ఇద్దరు కలిసి అంజిను వెతుకుతూ వెళ్తారు. చివరికి మోనిత అంజి ఉంటున్న హోటల్ కి వెళ్లి తను మారిపోయానని అంజితో చెబుతుంది. అయినప్పటికీ అంజి నమకపోవడంతో తన విశ్వరూపం బయటపడుతుంది. ఇక నేడు కార్తీకదీపం సీరియల్ 110 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. మరి ఈ రోజు హైలెట్స్ ఏమిటో తెలుసుకుందాం…

హోటల్ గదిలో అంజి మోనిత మాట్లాడుతూ ఉండగా దీపమ్మకు ఏమైనాచేసావో అనిఅంటుండగా..మూయరా రాస్కెల్.. ఎవతి రా.. దీప అదే మైనస్ నీ అక్క, నీ చెల్లా… అందరూ దీప భజన చేస్తారు. ఏం పెట్టింది రా..అది నీకు ఇంత పచ్చడి మెతుకులు అయినా వండి పెట్టింది రా.. .ఇదేమి విశ్వాసం రా కుక్కకున్నట్టు నేను ఎంత డబ్బు ఇచ్చాను. అదంతా వదిలేసి వదిలేసి దీపమ్మ.. దీపమ్మ అంటారు ఏంటిరా ఛీ.. దీనమ్మ జీవితం. దాని మొగుడు వదిలేస్తే జరిగినప్పుడు నిజంగా నీకు అంత అభిమానమే ఉంటే కార్తీక కాలర్ పట్టుకొని హిమను చంపింది నేనేనని ధైర్యంగా ఎందుకు చెప్పలేదు. మీరంతా మంచివాళ్లే అని కార్తీక్ నమ్మితే.. నేను ఎందుకు ఇన్ని ఆట ఆడతాను ఛీ.. ఏం బతుకు రా మీది మంచి పేరు తెచ్చుకుని ఏం సాధిస్తున్నారా.. మీరందరూ అంటూ అంజితో గొడవ పడుతుంది. ఇదంతా కిటికీలోనుంచి దీప ఫోన్ లో రికార్డు చేస్తూ ఉంటుంది.

నీ జీవితంలో ఎన్ని రోజులకు ఒకే ఒక మంచి పని చేశావు ఒకే కారులో కార్తీక్ హిమ ఉన్నప్పటికీ హిమను మాత్రమే చంపి కార్తీక్ చనిపోకుండా యాక్సిడెంట్ మాత్రమే బాగా చేశావంటూ అంటుంది. అదొక్కటే నువ్వు నాకు చేసిన ఫేవర్. అయినా చంపించిన నేను ఎంత నేరస్తురాలో చంపిన నువ్వు కూడా అంతే నేరస్తుడు. నువ్వు ఏదో పవిత్రమూర్తి అన్నట్టూ మాట్లాడుతున్నావ్ ఏంటి రా. చూడు నువ్వు ఎంత క్రూరమైనవాడో నేను కూడా అంతే.. కాబట్టి మనం మనం గొడవ పడడం అనవసరం. నువ్వు నాతో వస్తావా.. రావా అని అడుగుతుంది. నాకు నిద్ర వస్తుంది. రేపే నా పెళ్లి.. నిద్రపోకపోతే నా గ్లామర్ దెబ్బతింటుంది. రా నాతో రా అంటూ అంజి చేయి పట్టుకోగా ఇప్పుడు జుట్టు అందిందా.. అంటూ అంజి మాట్లాడుతాడు.

ఇందాక కాళ్లు పట్టుకున్నావా… నువ్వు ఎంత నటన చేసిన నేను నమ్మలేదు. ఎందుకు ఇందుకే.. నువ్వు ఎక్కువ సేపు నటించలేవే. నీ లోనుంచి నీ ఒరిజినల్ పిశాచి వెంటనే బయటకు వస్తుంది నీతో నేను వచ్చేది..నిన్ను ఇప్పుడే లాక్కెళ్లి డాక్టర్ బాబు ..దీప ముందు పడేసి అంటూ మోనితను లాక్కుని వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మోనిత గన్ను తీసి అంజికి గురి పెడుతుంది. గన్ను గురు పెడుతూ దీపమ్మ.. దీపమ్మ భజన చేస్తావు కదా..నీ దీపమ్మ కోసం నీ దీపాన్ని ఆరుపుకో అంటూ అంజిని బెదిరిస్తుంది. దీపమ్మకోసం చచ్చిపో… నేను కార్తిక్ ని వదలడం ఏంటిరా.. అది ఈ జన్మలో జరగదు.

మా పెళ్ళికి నీ పేరును అడ్డు పెట్టి నా పెళ్లి ఆపాలని చూస్తుంది దీప. నా పెళ్లికి ముందు నిన్ను చంపి ఆ కేసు నా మెడకు చుట్టుకుని నా మెడలు మూడుముళ్ళు పడకుండా ఆగిపోతుందని నేను ఆగిపోతున్నాను. కానీ అడ్డు తిరిగితే మాత్రం. నిన్ను ఇప్పుడే ఇక్కడే తూట్లు తూట్లు పడేలా కాల్చిపారేస్తా అని బెదిరిస్తుంది. అప్పుడు అంజి మాట్లాడుతూ.. ఎంత తెలివి నీకు నావల్ల ప్రమాదముందని నన్ను వెతుక్కుంటూ వచ్చావా.. అంటే దీపమ్మ వల్ల ఏదైనా ప్రమాదం ఉందని ఆమెను కూడా ఏమైనా చేసావా అని అంజి అంటాడు.

అప్పుడు మోనిత అవన్నీ నీకు అనవసరం. ఎవరిని ఎప్పుడు ఎలా అడ్డు తప్పించాలో నాకు బాగా తెలుసు. హిమను నీతో ఎలాగైతే చంపించానో నిన్ను కూడా వేరే వాళ్ళతో అలాగే చంపిస్తా. ఇప్పుడు నిన్ని బలివ్వడానికి వచ్చాను. రేయ్.. ద్రాక్షారామం అంటూ ఒక వ్యక్తిని పిలుస్తుంది. రారా.. వీన్ని తాళ్లతో కట్టి డిక్కీలో పడేయి. నేను చెప్పే వరకు వీడిని ప్రాణాలతోనే ఉంచు అంటూ ద్రాక్షారామం కి చెబుతుంది… అప్పుడే దీప అక్కడ ఉన్న విషయం గమనించిన అంజి కాస్త ధైర్యంతో ఉంటాడు. అప్పుడు మోనిత ఏరా గొంతు మూగబోయిందని అంటుంది. రివాల్వర్ తగలగానే ప్రాణాలపై ఆశ పుట్టిందా… పిచ్చి వేషాలు వేస్తే ఏం జరుగుతుందో అర్థమవుతుంది వీడికి అంటూ అంజనీ అక్కడినుంచి తీసుకువెళుతుంది.

ఇక కార్తీక దీప గురించి ఆలోచిస్తూ పడుకొని ఉండగా.. వారణాసి అక్కడికి వచ్చి ఏంటి ఏమైంది అని అడుగుతాడు. ఈ టైంలో రమ్మని ఫోన్ చేశారు అంటూ కంగారు పడతాడు. ఎవరికీ ఏమైంది అని అడగగా ఎవరికీ ఏం కాలేదు.. నువ్వు టెన్షన్ పడకుండా ముందు ఈ నీళ్లు తాగు అంటూ వాటర్ బాటిల్ ఇస్తాడు.నీళ్లు తాగిన తర్వాత వారణాసి చెప్పండి డాక్టర్ బాబు ఎందుకు అంత అర్జెంటుగా రమ్మన్నారు.. దీపకి నువ్వు తోడబుట్టిన తమ్ముడు కన్నా ఎక్కువ. కష్టాల్లో నువ్వు తనకు తోడుగా ఉన్నావు. ఏ కష్టమొచ్చినా నీతో చెప్పేది మరి ఇప్పుడు ఎక్కడికెళ్ళిందో చెప్పు అంటూ వారణాసి ను అడుగుతాడు.

మీతో చెప్పలేదా అంటూ వారణాసి అడగగా… నాతో చెప్పిన చోటకి వెళ్ళలేదు అందుకే నిన్ను అడుగుతున్నా అంటూ చెబుతాడు. నాకు కూడా తెలియదు. అక్క నిజంగా ఎక్కడికి వెళ్ళిందో.. అడిగితే వచ్చాక చెబుతా లేరా అంటూ వెళ్ళింది అని వారణాసి చెప్పగా నమ్మాలా… అంటూ డాక్టర్ బాబు అంటాడు ఒట్టు బాబు నాకు నిజంగానే తెలియదు..ఈవేళలో ఒక్కటే వెళ్లి ప్రమాదం తెచ్చుకుంటుందని భయం వేస్తుంది తెలిస్తే నిజం చెప్పురా అంటూ బతిమాలాడు. అప్పటికి వారణాసి తెలియదని చెబుతాడు.ఆ డ్రైవర్ ఫోన్ నెంబర్ ఉందా అని అడగగా ఉంది అంటే వెంటనే ఫోన్ చేసి అడుగు ఎక్కడ ఉందో అని చెబుతాడు. వారణాసి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దీంతో వారణాసి అక్కడినుంచి వెళ్ళమంటాడు.

కట్ చేస్తే దీప తిరిగి హైదరాబాద్ వస్తుంది.కారులో వస్తూ మోనిత హిమకు యాక్సిడెంట్ చేసిన విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటుంది. అప్పుడు డ్రైవర్ వెంకట్ ఏంటి అక్క.. కారెక్కినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తూనే ఉన్నావ్ ..అని అడగగా ఏంలేదులేరా అంటూ దీప సమాధానం చెబుతుంది. ఏంటో అక్క ఫస్ట్ విజయవాడ వెళ్దాం అన్నావ్ తరువాత.. ఆవిడ ఎక్కింది. ఆవిడ సూర్యాపేటలో దిగగానే నువ్వు కూడా నా ఫోను తీసుకెళ్లి అదే హోటల్ కి వెళ్లావు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు అక్క అంటూ వెంకట్ అనగా…నాక్కూడా ఏం జరుగుతుందో ఏమీ తెలియడం లేదురా అంటూ సమాధానం చెబుతుంది.సరే ఒకసారి నీ ఫోన్ ఇవ్వు డాక్టర్ బాబు కంగారు పడుతూ ఉంటాడు ఫోన్ చేస్తాను అంటే స్విచ్ ఆఫ్ అయింది అక్క.. కంగారులో రావడంతో చార్జర్ తెచ్చుకోవడం మర్చి పోయాను అంటూ సమాధానం చెప్తాడు.

ఇక తెల్లవారగానే ఉదయం ఇంటికి వెళ్ళిన మోనిత ప్రియమణి గీజర్ ఆన్ చెయ్ అని చెబుతుంది. చేశానమ్మ అంటూ రాత్రి కార్తీక్ బాబు వచ్చాడని చెప్పగానే మోనిత కంగారు పడుతుంది ఎందుకు వచ్చాడని అడగగా తెలియదమ్మా మిమ్మల్ని అడిగారు లేదని చెప్పగానే వెళ్ళిపోయాడు అని సమాధానం చెబుతుంది. మీ జీవితం చేజారి పోకుండా చూసుకోండి అని ప్రియమణి అని వెళ్లగా మోనిత కంగారు పడుతుంది.అంతా నాకు అనుకూలంగానే ఉందనుకున్నాను కానీ ఏదో అపశృతి దొరుకుతుంది. కార్తిక్ ఎందుకు వచ్చాడని ఆలోచిస్తుంది.మరోవైపు కార్తిక్ దీప కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పిల్లలు లేచేలోగా వస్తానని ఇంకా రాలేదు ఏంటి అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక దీప ఇంటికి రావడంతో కార్తీక్ ఎక్కడికి వెళ్ళావ్ అంటూ ప్రశ్నిస్తాడు.

మీ పిన్ని ఇంటికి అని చెప్పి వెళ్ళావ్.. ఆమె ఫోన్ చేసి దీప ఉందా అని అడిగింది.అసలు ఎక్కడికి వెళ్ళావ్ చెప్పకుండా. మీ పిన్ని ఇంటికి వెళ్లకుండా ఫోన్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్లావోనని రాత్రంతా నీకోసం పిచ్చోడిలా రోడ్లపై తిరుగుతున్నా అంటూ దీపను ప్రశ్నిస్తాడు అసలేం జరిగింది ఎక్కడికి వెళ్లావు అని అడగగా…బ్రష్ చేసి రండి డాక్టర్ బాబు వేడిగా కాఫీ తాగుతూ మాట్లాడదాం అంటూ లోపలికి వెళ్తుంది.అదేవిధంగా భాగ్యం ఎలాగైనా పెళ్లి ఆపాలని మోనితను కిడ్నాప్ చేయాలని తన ఇంటికి వెళ్లి కథలు చెబుతుంది. రాత్రి నుంచి అంజి కార్తీక్ దగ్గరే ఉన్నాడు అని చెప్పడంతో ఆమె ఏదో ప్లాన్ చేసిందని పసిగట్టిన మోనిత తనకు బుద్ధి చెప్పాలనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

Featured

Manoj -Charan: అర్ధరాత్రి ఫోన్ చేసి 5 లక్షలు అడిగాను.. చరణ్ మంచి మనసు పై మనోజ్ కామెంట్స్!

Published

on

Manoj -Charan: మెగా పవర్ స్టార్ రాంచరణ్ మార్చ్ 27వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే . ఈ పుట్టిన రోజు సందర్భంగా ఈయన తన భార్య కూతురుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అనంతరం చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది సెలబ్రిటీలు, అభిమానులు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంచు మనోజ్ రామ్ చరణ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే అంతే కాకుండా చరణ్ అంటే మనోజ్ కి చాలా అభిమానం అని పలు సందర్భాలలో తెలియజేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ రామ్ చరణ్ మంచితనం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చరణ్ ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేసిన ఎప్పుడు చెప్పుకోలేదు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు సహాయం పొందిన వాళ్లు ఆయన మంచితనం గురించి చెబుతూ ఉంటారు.

Advertisement

ఆడబిడ్డకు సాయం..
ఈ క్రమంలోనే చరణ్ మంచితనం గురించి మనోజ్ మాట్లాడుతూ 2018 వ సంవత్సరంలో నేను అమెరికాలో ఉన్నాను. అర్ధరాత్రి సమయంలో దుబాయిలో ఓ ఆడబిడ్డ తన కుమార్తెతో కలిసి ఇమిగ్రేషన్ సమస్య కారణంగా అక్కడే చిక్కుకుపోయారు వెంటనే ఐదు లక్షలు కావాలి అని అడిగింది అప్పుడు నా దగ్గర అంత డబ్బు లేకపోవడంతో అర్ధరాత్రి చరణ్ కి ఫోన్ చేసి ఐదు లక్షల కావాలి అంటే ఎందుకు అని కూడా అడగకుండా ఐదు నిమిషాలలో పంపించారంటూ తన సహాయ గుణం పై మనోజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Vijay Devarakonda: సినిమా సక్సెస్ కోసం పూజలు చేసిన ఫ్యామిలీ స్టార్… సక్సెస్ అయ్యేనా?

Published

on

Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. చివరిగా ఈయన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇక త్వరలోనే పరశురాం దర్శకత్వంలో నటించినటువంటి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతోంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో మంచి సక్సెస్ అందుకోవాలనే ఉద్దేశంలో విజయ్ దేవరకొండ ప్రత్యేక పూజలను చేశారు ఈ క్రమంలోనే దిల్ రాజు ఆఫీస్ లో దర్శక నిర్మాతలు హీరోలతో కలిసి ప్రత్యేకంగా హోమాలు పూజలను చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

సినిమా విజయం కోసమే పూజలు..
ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమా సక్సెస్ కోసం విజయ్ దేవరకొండ ఇలాంటి పూజలు చేయించారని అయితే ఈ పూజలు సక్సెస్ అయ్యి తన సినిమా మంచి విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి అప్డేట్స్ ఈ సినిమా పై భారీ స్థాయిలోనే అంచనాలు పెంచాయి.

Advertisement
Continue Reading

Featured

Siddharth -Aditi: రహస్యంగా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన అదితి సిద్ధార్థ్?

Published

on

Siddharth -Aditiy: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో
సిద్ధార్థ్ అదితి రావు హైదరి జంట ఒకటి. వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరూ కలిసి అవే భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాలో కలిసిన నటించారు. ఇక ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు..

ఇక వీరిద్దరూ కలిసి ముంబైలో సహజీవనం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి జంటగా వెళ్లారు. అయితే వీరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ వీరు మాత్రం ఎప్పుడూ కూడా తమ రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు. ఇలా రహస్యంగా తమ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి ఈ జంట ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.

ఇలా ముంబైలో సహజీవనం చేస్తున్నటువంటి ఈ జంట తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాథ స్వామి ఆలయ మండపంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో వీరి వివాహ వేడుక హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారనే వార్త వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతారు.

Advertisement

తెలంగాణలో వివాహం..
రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తున్నారు అయితే ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరికీ ఇది మొదటి వివాహం కాదని వీరిద్దరికీ ఇది రెండో వివాహమనే చెప్పాలి ఇప్పటికే వీరిద్దరూ పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటూ తిరిగి రెండో పెళ్లి చేసుకున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!