Connect with us

Featured

లవ్ ఒకరితో.. డేటింగ్ మరొకరితో.. – లవ్ ఎఫైర్స్ ను ఓపెన్ గా చెప్పేసిన ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ !!

Published

on

హైదరాబాద్‌లో పుట్టిన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ముంబయ్‌లో పెరిగి అక్కడే సెటిలైంది. ‘మున్నా మైఖేల్’ చిత్రంతో బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన నిధి.. నాగచైతన్య హీరోగా నటించిన ’సవ్యసాచి’ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమై.. ఆ తర్వాత ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రంతో మంచి మార్కులు కొట్టేసింది. నిధి అగర్వాల్‌ ఇటీవలే విడుదలైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో తన సినీ కెరీర్‌లో మొదటి సక్సెస్‌ను అందుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్‌బాబు మేనల్లుడు హీరోగా పరిచయం కాబోతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ఆఫర్లు వస్తున్నా సరే.. ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న ఈ అమ్మడు ఇక అవకాశాల కోసం గ్లామర్ షో చేయాలని గ్రహించి గ్లామర్ డోస్ ను పెంచేసి.. ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసేలా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటున్న ఈ భామ తాజాగా తన చిన్ననాటి సంగతులతో పాటు పర్సనల్ లైఫ్ లో ఎదురైన లవ్, బ్రేకప్, క్రష్ మొదలైన విషయాలను మీడియాతో పంచుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నటిగా తనను వెండితెరపై చూసినప్పుడు తన పేరెంట్స్ ఎంతో సంతోష పడ్డారని, చిన్నతనంలో తాను చాలా అల్లరి పిల్ల‌న‌ని, చాలా అంటే చాలా అల్ల‌రి ప‌నులు చేశాన‌ని చెబుతూ.. అందుకు ఉదాహరణగా బాల్యంలో జరిగిన ఓ సంఘటనను తెలియజేసింది.

స్కూల్లో మార్కులకు సంబంధించిన‌‌​‌​ ప్రోగ్రస్​ రిపోర్ట్ లో తల్లి సంతకాన్ని తానే పెట్టిన‌ట్టు, త‌ల్లి సంతకాన్ని కాపీ కొట్టడం త‌న‌కి ఎప్పటికీ గుర్తుండిపోతుంద‌ని, చిన్నప్పుడు ప‌రీక్ష‌ల్లో మార్క్స్ త‌క్కువ‌గా వ‌స్తే .. ప్రోగ్రస్‌ కార్డ్ తీసుకుని త‌న తండ్రి ద‌గ్గ‌రికి వెళ్ల‌డానికి భ‌య‌మేసేద‌ని, పోనీ అమ్మకు చూపించినా తిట్లు తప్పవు కాబ‌ట్టి ఆమె సంతకాన్ని తానే పెట్టేసేదాన్న‌‌ని, త‌న తండ్రి సంతకం కాపీ చేయ‌డం చాలా క‌ష్ట‌మ‌ని.. త‌న మ‌ద‌ర్ సంతకమైతే చాలా ఈజీ అని, కొన్నాళ్లకు ఈ ఫోర్జరీ సంతకం విషయం తన తల్లికి తెలిసి గట్టిగానే మందలించిందని తెలియజేసింది. ఇక తన లైఫ్ లో ఎదురైన ప్రేమ అనుభవాలను గురించి చెబుతూ.. చిన్నప్పుడు స్కూల్లో 4వ తరగతి చదివేటప్పుడే..తొలిసారిగా ఒక అబ్బాయితో ప్రేమలో పడిందట నిధి. అలా ఊహ తెలియని వయస్సులోనే ప్రేమ అనుభూతి పొందిన ఈ అందాల తార తన ప్రేమను ఎంతో కాలం నిలుపుకోలేకపోయిందట. ఆ తర్వాత కాలేజ్ చదివే రోజుల్లో మరొక అబ్బాయితో డేటింగ్ కి వెళ్లినట్లు చెప్పుకొచ్చింది ఈ భామ. ఆ అబ్బాయి లవ్ ప్రపోజల్ ఇప్పటికీ మరచిపోలేనని చెబుతోంది. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం ప్రేమలో ఉందా లేదా.? అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక తన సెలబ్రిటీ క్రష్ గురించి చెబుతూ… బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ అంటే పిచ్చి అని వెల్లడించింది ఇస్మార్ట్ నటి నిధి అగర్వాల్.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!