తాజ్మహల్ సమాధికి చరిత్రలో గుర్తింపు ఉన్నట్లే తెలుగు చలనచిత్ర సీమలో “ప్రేమనగర్” చిత్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ లో తన జీవితం తాడోపేడో తేల్చుకుందామని ప్రముఖ నిర్మాత రామానాయుడు తన చివరి ప్రయత్నంగా నిర్మించిన చిత్రమిది. అప్పట్లో రచయి(త్రి)తలు రాసిన సూపర్ హిట్ నవలలను సినిమాలుగా నిర్మిస్తున్న కాలం అది. ప్రముఖ రచయిత్రి కోడూరి కౌసల్యా దేవి రచించిన “విరచిత” నవలకు ప్రతిరూపమే ఈ “ప్రేమనగర్” చిత్రం.
ఆ రోజుల్లో ఎందరో నిర్మాతలు, దర్శకులు ఈ చిత్రాన్ని నిర్మించాలని ప్రయత్నించినా ఎందుకనో ధైర్యం చేయలేకపోయారు. కానీ ఈ నవలను చదివిన రామానాయుడు, అప్పటి అగ్ర హీరో అక్కినేని నాగేశ్వరరావుకు ఆ నవల కోసం చెప్పడంతో ఆయన బాగుందని, అందులోని కళ్యాణ్ పాత్ర నచ్చిందని చెప్పడంతో ఆ పాత్రను అక్కినేని నాగేశ్వరరావుతోనే చేయించారు రామానాయుడు. 1971 లో ప్రారంభించిన ఈ చిత్రం షూటింగ్ జరిగే టైంలో వాహిని స్టూడియో అంతా కిటకిటలాడిపోయింది. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేష సంఘటన ఏమిటంటే.? అక్కినేనికి రామా నాయుడు మీద ఉండే అభిమానంతో వారి మాటను కాదనలేక దేవుడికి కొబ్బరికాయ కొట్టారు. ఆ కొబ్బరికాయ సరిగ్గా 2 భాగాలుగా పగలడంతో అక్కడున్న వాళ్ళందరూ ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారట. దేవుడి పటాలకు కొబ్బరికాయ కొట్టడం అదే మొదటిసారి. అదే ఆఖరిసారి అని అక్కినేని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలపడం విశేషం.
ఇక ఈ చిత్రం వెనుక దాగివున్న రహస్యాల వివరాల్లోకి వెళ్తే.. 1971లో అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ జంటగా వచ్చిన ‘ప్రేమ నగర్’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఈ చిత్రం విజయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ వుంది. అదేమిటంటే.. ఈ చిత్ర నిర్మాణానికి ముందు ఆ టైంలో ప్రముఖ రచయిత్రి కోడూరి కౌసల్యదేవి ‘విరచిత’ పేరుతో రాసిన నవల అద్భుతంగా పాఠకుల ప్రశంసలను అందుకుంది. ఆ సంగతి తెలుసుకున్న శ్రీధర్ రెడ్డి అనే నిర్మాత ANR హీరోగా ఈ కధను సినిమాగా తెరపైకి తీసుకురావాలని నిర్ణయించుకుని ఆ రచయిత్రి వద్ద నవల కాపీరైట్స్ ను కొనేశారు. ఆ తర్వాత ఆ నవల ఆధారంగా సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేయించి అక్కినేనికి ఇచ్చారు. స్వతహాగా ఏ పుస్తకాన్ని పూర్తిగా చదివే అలవాటు లేని ANR ఆ సినిమా స్క్రిప్ట్ ను చదవమని శ్రీమతి అన్నపూర్ణగారికి ఇచ్చారు. ఆవిడ ఆ స్క్రిప్ట్ ను మొత్తం చదివి దేవదాసులో లేని కమర్షియల్ అంశాలు ఇందులో చాలా ఉన్నాయని ఈ నవలను సినిమాగా తీసి.. అందులో ANR హీరోగా నటిస్తే ఆ సినిమా ఖచ్చితంగా విజయవంతమౌతుందని జోస్యం చెప్పారు. అంతే.. వెంటనే అన్నపూర్ణ గారి మాట విన్న ANR ఆ సినిమా ప్రాజెక్ట్ ను ఓకే చేసేశారు.
హీరోయిన్ గా ముందు KR విజయ ను ఫిక్స్ చేశారు. హీరోయిన్ పాత్ర కోసం కాస్ట్యూమ్స్ కొనేందుకు కారు ప్రయాణం చేస్తుండగా దారి మధ్యలో శ్రీధర్ రెడ్డి కారు అనుకోకుండా యాక్సిడెంట్ కు గురైంది. ఊహించని ఆ సంఘటనతో ఇదేదో అపశకునంలా భావించిన శ్రీధర్ రెడ్డి భార్య ఈ చిత్రాన్ని నిర్మించే ఆలోచనను విరమించుకున్నారు. అయితే కథలో బలం తెలిసిన అక్కినేని దీన్ని ఎలాగైనా కొనుక్కోమని రామానాయుడు గారికి రికమండ్ చేశారు. హీరోయే స్వయంగా అంత నమ్మకంతో చెబుతుంటే ఎవరైనా కాదంటారా.? అక్కినేని మాట కాదనకుండా వెంటనే ఆ నవల కాపీరైట్స్ ను శ్రీధర్ దగ్గర్నుండి కొనేశారు రామా నాయుడు. ఇక ఈ చిత్రానికి దర్శకుడిగా రాఘవేంద్రరావు గారి తండ్రి K.s ప్రకాష్ రావు గారిని తీసుకున్నారు. సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా జరిగాయి. హీరోయిన్ KR విజయ స్థానంలోకి వాణిశ్రీ వచ్చింది. అప్పట్లోనే 15 లక్షల బడ్జెట్ తో రామా నాయుడు గారు ‘ప్రేమ నగర్’ ని భారీగా నిర్మించారు. 34 ప్రింట్లతో విడుదల చేస్తే ఊహించని విధంగా 50 లక్షలు వసూలు చేసిందీ బ్లాక్ బస్టర్ మూవీ.
గమ్మత్తేమిటంటే.. ఈ చిత్రం విడుదలైన 15రోజులు భారీ వర్షాలు పడుతున్నా సరే.. ప్రేక్షకులు ఆ వర్షాలను లెక్క చేయకుండా గొడుగులు వేసుకుని తండోప తండాలుగా వచ్చి మరీ సినిమా చూశారు. Kv మహదేవన్ సంగీతం, ఆచార్య ఆత్రేయ సంభాషణలు, వెంకట రత్నం ఛాయాగ్రహణం అన్ని కలిసి ఈ చిత్రాన్ని ఓ అద్భుత దృశ్యకావ్యంలా మలిచాయి. గుమ్మడి, శాంతకుమారి, కైకాల సత్య నారాయణ, వరలక్ష్మి, రాజబాబు, ధూళిపాల లాంటి ఎందరో ప్రముఖ నటీనటులు తమ నటనా చాతుర్యం చూపించి ఈ చిత్ర విజయంలో భాగస్వాములయ్యారు. ఈ చిత్రాన్ని తమిళంలో శివాజీ గణేషన్ హీరోగా రామానాయుడు గారే రీమేక్ చేశారు. తమిళంలో కూడా హీరోయిన్ గా వాణిశ్రీనే ఎంచుకున్నారు. ఇక బాలీవుడ్ లో రాజేష్ ఖన్నా, హేమమాలినిలతో తీస్తే అక్కడ కూడా సూపర్ హిట్ సాధించింది ప్రేమ నగర్. ఈవిధంగా శ్రీధర్ రెడ్డి, K.R విజయల చేయి జారిన అదృష్టం.. రామా నాయుడు, వాణిశ్రీలకు అద్భుతంగా కలిసొచ్చింది. సురేష్ బ్యానర్ విలువ “ప్రేమ నగర్” దెబ్బకు రెట్టింపయ్యింది.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.