Connect with us

Featured

అర్దాంతరంగా కంటికి కానరాని దూరాలకు చేరిన తెలుగు సినీ తారలు …!

Published

on

సినిమాలు మానవ జీవితంలో ఒక భాగం అని చెప్పవచ్చు. అందులో నటించే నటీనటులకు అంత ప్రాధాన్యత ఇస్తారు మన తెలుగు ప్రేక్షకులు. కేవలం తెలుగు వారే అని కాకుండా తమిళం, కన్నడ ఇలా పలు భాషల్లోని నటీనటులకు వారి వారి అభిమానులు ఎంతగానో వారిని ఆప్యాయంగా కొలుస్తారు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా… పుట్టిన వాడు గిట్టక మానడు అన్న సామెత ఇప్పుడు చెప్పు కోవాలి. దీనికి కారణం మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు వారి చిన్న ఏజ్ లోనే మరణించారు.

ఇటీవల బాలీవుడ్ లో కూడా ఇర్ఫాన్, రిషి కపూర్ ఇలాంటి మంచి హీరోలను సినీ పరిశ్రమ కోల్పోయింది. ఇకపోతే ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగి అర్ధాంతరంగా తనువు చాలించిన అనేకమంది నటీనటుల గురించి ఒకసారి చూద్దామా….

ఈ లిస్టులో మొదటిగా చెప్పుకునేది మహానటి సావిత్రి. అలనాటి కాలంలో సౌత్ సినిమాలను ఏలిన హీరోయిన్ ఎవరూ అంటే ఒకే ఒక పేరు సావిత్రి. సౌత్ ఇండియాలో మొట్టమొదటి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి సావిత్రి. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజెఆర్ వీరందరూ కూడా ఆమె తర్వాతే అన్నట్లుగా ఆమె కాలం కొనసాగింది. ఈవిడ జెమినీ గణేష్ ను ప్రేమ వివాహం చేసుకొని కొన్ని కారణాలవల్ల ఆయనతో విడిపోయింది. ఆ తరువాత తన జీవితంలో చాలా ఆటుపోట్లను ఎదుర్కొని 19 నెలలు కోమాలో ఉండి డిసెంబర్ 26 ,1981 వ సంవత్సరంలో ఆవిడ కన్నుమూశారు. ఆమె కన్నుమూసే సరికి 45 సంవత్సరాలు మాత్రమే.

ఇక ఆ తరువాత అతిలోక సుందరి శ్రీదేవి గురించి మాట్లాడుకోవాలి. తాను బాలనటిగా కెరీర్ ను ప్రారంభించి సావిత్రి తర్వాత అంత స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్ ఎవరు అంటే కేవలం శ్రీదేవి అని మాత్రమే చెబుతారు. 1979వ సంవత్సరంలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి 4 సంవత్సరాల తర్వాత 1983లో వచ్చిన హిమ్మత్ వాలా సినిమాతో అక్కడ ఆమెకు బ్రేక్ లభించింది. ఆ తర్వాత ఆమె అక్కడ కూడా చిన్నగా చిన్నగా టాప్ హీరోయిన్ గా మారిపోయింది. 2018 సంవత్సరంలో దుబాయ్ లోని ఒక హోటల్ లో ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి ప్రాణాలు వదిలేసింది.

ఇక మరో హీరోయిన్ సౌందర్య. దాదాపు పది, పదిహేను సంవత్సరాల వరకు తెలుగు ఇండస్ట్రీలో తను ఏ పాత్ర చేసినా ప్రేక్షకులు ఇట్లే గుర్తుపెట్టుకునే విధంగా ఆవిడ నటన చేసింది. అయితే 2004వ సంవత్సరంలో బిజెపి పార్టీ తరఫున ప్రచారానికి వెళుతున్న మార్గంలో విమానం కూలిపోయి మరణించడం జరిగింది. అప్పటికి కేవలం ఆవిడకు 32 సంవత్సరాలు మాత్రమే. ఇలా వెళితే మనము టాలీవుడ్ లో అనేక మంది హీరో హీరోయిన్ల లిస్టు చెప్పుకుంటా వెళ్లొచ్చు.

దివ్యభారతి, సిల్క్ స్మిత, ఆర్తి అగర్వాల్, ప్రత్యూష, ఫటాఫట్ జయలక్ష్మి, విలక్షణ నటుడు శ్రీహరి, హీరో ఉదయ్ కిరణ్, హాస్య నటుడు వేణుమాధవ్, యువ నటుడు యశోసాగర్, కమెడియన్ విజయ్ సాయి, ప్రేమికుల రోజు హీరో కునాల్ సింగ్, అచ్యుత్ ఇలా చాలా మంది సినీ ప్రముఖులు అర్ధాంతరంగా వారి ప్రాణాలను పోగొట్టుకొని ప్రేక్షకులకు తీరని లోటుని ఏర్పరిచారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!